ETV Bharat / city

కేంద్రానికి చెప్పాకే.. పోలవరం రివర్స్ టెండరింగ్: విజయసాయి

పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ నిర్ణయం.. కేంద్రానికి చెప్పాకే అమలు చేశామని.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అవినీతి నిర్మూలన దిశగా.. తమకు మోదీ, అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు.

author img

By

Published : Aug 21, 2019, 4:05 PM IST

Updated : Aug 21, 2019, 4:23 PM IST

vijayasai reddy
కేంద్రానికి చెప్పాకే.. పోలవరం రివర్స్ టెండరింగ్: విజయసాయి

పోలవరం జలాశయ నిర్మాణ టెండర్లు రద్దు, పీపీఏల రద్దుపై.. వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి కొత్త విషయాన్ని వెల్లడించారు. ఇన్నాళ్లూ.. తెదేపా నేతలు ఈ విషయంపై ఆగ్రహం, అభ్యతరం వ్యక్తం చేస్తున్నా పెద్దగా స్పందించని వైకాపా నేతలు.. ఇప్పుడు మాత్రం అంతా కేంద్రానికి చెప్పే చేస్తున్నాం.. అని తేల్చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో దిల్లీలో వైకాపా ఎంపీల సమావేశం అనంతరం.. విజయసాయిరెడ్డి ఈ విషయంపై మాట్లాడారు. ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సంప్రదించాకే ముఖ్యమంత్రి జగన్.. ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. పోలవరం రివర్స్ టెండరింగ్, పీపీఏల విషయంలోనూ మోదీతో మాట్లాడాకే నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని..రాష్ట్ర ఖజానాను దోచుకుందని ఆయన ఆరోపించారు. వారందరినీ చట్టపరిధిలోకి తీసుకురావాలనేదే తమ దృఢ సంకల్పంగా విజయసాయి చెప్పుకొచ్చారు. కొండవీటి వాగు కారణంగా అమరావతి ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.

కేంద్రానికి చెప్పాకే.. పోలవరం రివర్స్ టెండరింగ్: విజయసాయి

పోలవరం జలాశయ నిర్మాణ టెండర్లు రద్దు, పీపీఏల రద్దుపై.. వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి కొత్త విషయాన్ని వెల్లడించారు. ఇన్నాళ్లూ.. తెదేపా నేతలు ఈ విషయంపై ఆగ్రహం, అభ్యతరం వ్యక్తం చేస్తున్నా పెద్దగా స్పందించని వైకాపా నేతలు.. ఇప్పుడు మాత్రం అంతా కేంద్రానికి చెప్పే చేస్తున్నాం.. అని తేల్చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో దిల్లీలో వైకాపా ఎంపీల సమావేశం అనంతరం.. విజయసాయిరెడ్డి ఈ విషయంపై మాట్లాడారు. ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సంప్రదించాకే ముఖ్యమంత్రి జగన్.. ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. పోలవరం రివర్స్ టెండరింగ్, పీపీఏల విషయంలోనూ మోదీతో మాట్లాడాకే నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని..రాష్ట్ర ఖజానాను దోచుకుందని ఆయన ఆరోపించారు. వారందరినీ చట్టపరిధిలోకి తీసుకురావాలనేదే తమ దృఢ సంకల్పంగా విజయసాయి చెప్పుకొచ్చారు. కొండవీటి వాగు కారణంగా అమరావతి ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.

Intro:ap_atp_52_21_vthanapampini_surver_down_av_ap10094


Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో సాంకేతిక లోపాలతో రైతులకు ఇక్కట్లు.

సర్వర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రత్యామ్నాయ విత్తనాల కోసం వచ్చిన రైతులు అసౌకర్యానికి గురయ్యారు రాప్తాడు నియోజకవర్గంలో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయంలో సర్వర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో రైతులు ఇబ్బంది పడ్డారు.

సకాలంలో వర్షాలు కురవక పోవడంతో రైతులు వేరుశనగ సాగు చేయలేకపోయారు రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.

పంటకు అనుకూల వర్షాలు కురవడంతో రైతులు చిరుధాన్యాల సాగు పై ఆసక్తి కనపరుస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఉన్న వ్యవసాయ కార్యాలయంలో ఉచితంగా పంపిణీ చేస్తున్న ప్రత్యామ్నాయ విత్తనాలను తీసుకునేందుకు రైతులు బారులు తీరారు ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట దాకా సర్వర్ సమస్య తలెత్తడంతో రైతులు ఆందోళనకు లోనయ్యారు ఈ క్రమంలో వరుసలో ఉన్న ఒక మహిళ కిందకు పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారు.




Conclusion:R.Ganesh
RPD(ATP)
CELL:9440130913
Last Updated : Aug 21, 2019, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.