రాష్ట్రానికి 7 వైద్య కళాశాలలు మంజూరు చేయాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్లు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. దిల్లీలో అఖిలపక్షం సమావేశం అనంతరం మాట్లాడిన ఆయన.. ఏపీలో రాజధాని మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. పోలవరం నిర్మాణాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం వృథా కాకుండా చేయగలిగామని అన్నారు. ప్రాజెక్టులో సవరించిన అంచనాలు ఆమోదించాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై భేటీలో ప్రస్తావించినట్లు తెలిపారు. విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని కోరినట్లు పేర్కొన్నారు. మహిళా బిల్లు, బీసీ రిజర్వేషన్లు వంటి అంశాలను లేవనెత్తామని వివరించారు.
ఇదీ చూడండి: