ETV Bharat / city

'నిజాయతీ ఉంటే రఘురామకృష్ణరాజు రాజీనామా చేయాలి'

author img

By

Published : Mar 23, 2021, 9:17 PM IST

ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైకాపా ఎంపీ రెడ్డప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇసుక తవ్వకాలపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. నిజాయతీ ఉంటే ఎంపీ పదవికి రఘురామ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ycp mp reddappa
ycp mp reddappa

రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నారంటూ వైకాపా ఎంపీ రెడ్డప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాయతీ ఉంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని.. నైతిక విలువలు పాటించి ప్రెస్ మీట్లు మానుకోవాలని రెడ్డప్ప సూచించారు.

ఇసుక తవ్వకాలపై కేంద్ర సంస్థలతో బిడ్డింగ్ నిర్వహించినా....​ రాష్ట్ర ప్రభుత్వం నిందలు వేయడం సరికాదని హితవు పలికారు. పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడం సబబు కాదన్న ఆయన.. రఘురామకృష్ణరాజును పార్టీలోంచి బహిష్కరించే అంశం పార్టీలోని పెద్దలు చూసుకుంటారని చెప్పారు.

రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నారంటూ వైకాపా ఎంపీ రెడ్డప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాయతీ ఉంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని.. నైతిక విలువలు పాటించి ప్రెస్ మీట్లు మానుకోవాలని రెడ్డప్ప సూచించారు.

ఇసుక తవ్వకాలపై కేంద్ర సంస్థలతో బిడ్డింగ్ నిర్వహించినా....​ రాష్ట్ర ప్రభుత్వం నిందలు వేయడం సరికాదని హితవు పలికారు. పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడం సబబు కాదన్న ఆయన.. రఘురామకృష్ణరాజును పార్టీలోంచి బహిష్కరించే అంశం పార్టీలోని పెద్దలు చూసుకుంటారని చెప్పారు.

ఇదీ చదవండి:

చెత్త సేకరణకు 8 వేల ఆటోమేటిక్ ట్రక్కులు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.