ETV Bharat / city

'పాలన 6 నెలలు... అప్పు రూ.30 వేల కోట్లు'

author img

By

Published : Nov 29, 2019, 5:25 PM IST

Updated : Nov 29, 2019, 7:56 PM IST

వైకాపా సర్కార్‌ను ఇంకా నాలుగున్నరేళ్లు ఎలా భరించాలనే భయాందోళన... రాష్ట్రంలో నెలకొందని భాజపా విమర్శించింది. సీఎం జగన్‌ మాటలకు ఆ పార్టీ కార్యకర్తలు, నేతల చేతలకు పొంతన లేదని దుయ్యబట్టింది. వైకాపా సర్కార్‌కు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం చేతకావడంలేదని ఆరోపించింది.

bjp leaders meeting
భాజపా నేతల సమావేశం
దిల్లీలో భాజపా నేతల సమావేశం

రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలకు, చేతలకు ఏ మాత్రం పొంతనలేదని భాజపా నేతలు విమర్శించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై దిల్లీలో సమావేశమైన భాజపా నేతలు... వైకాపా సర్కార్​పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతిపై స్పష్టత ఇవ్వకుండా... ఆ ప్రాంత రైతులను ఏపీ ప్రభుత్వం ఆందోళనకు గురి చేస్తోందని ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు.

వైకాపా ప్రభుత్వాన్ని చూసి పెట్టుబడి దారులు భయపడి పారిపోతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలోనూ జగన్ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. ఆంగ్ల మాధ్యమాన్ని తాము వ్యతిరేకించడం లేదని.. ప్రణాళికబద్ధంగా అమలు చేయాలని సూచిస్తే వైకాపా నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఎంపీ సుజనా చౌదరి అన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో రూ.30 వేల కోట్లు అప్పు చేసిందని వెల్లడించారు. ఇలానే వ్యవహరిస్తే ఏపీ ఆర్థికవ్యవస్థ ఏమవుతుందని ప్రశ్నించారు.

ప్రభుత్వ సొమ్ముతో కార్యకర్తలకు జీతాలా..?
వైకాపా ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చి... ప్రభుత్వ సొమ్ముతో జీతాలు ఇస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఫలితంగా పార్టీ జెండా కప్పుకున్న వారికే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని విమర్శించారు. వైకాపా సర్కార్‌ను ఇంకా నాలుగున్నరేళ్లు ఎలా భరించాలనే భయాందోళన రాష్ట్రంలో నెలకొందని కన్నా పేర్కొన్నారు. కృత్రిమ ఇసుక కొరతతో వేలాది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్న ఆయన.. ప్రభుత్వానికి మద్యంపాలసీపై ఉన్న శ్రద్ధ ఇసుకపై లేదని ఎద్దేవా చేశారు. దేవాదాయ భూములు అన్యాక్రాంతం చేయాలని చూస్తే భాజపా పోరాటం చేస్తుందని కన్నా హెచ్చారించారు.

ఇదీ చదవండి

'దాడి యత్నాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం'

దిల్లీలో భాజపా నేతల సమావేశం

రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలకు, చేతలకు ఏ మాత్రం పొంతనలేదని భాజపా నేతలు విమర్శించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై దిల్లీలో సమావేశమైన భాజపా నేతలు... వైకాపా సర్కార్​పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతిపై స్పష్టత ఇవ్వకుండా... ఆ ప్రాంత రైతులను ఏపీ ప్రభుత్వం ఆందోళనకు గురి చేస్తోందని ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు.

వైకాపా ప్రభుత్వాన్ని చూసి పెట్టుబడి దారులు భయపడి పారిపోతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలోనూ జగన్ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. ఆంగ్ల మాధ్యమాన్ని తాము వ్యతిరేకించడం లేదని.. ప్రణాళికబద్ధంగా అమలు చేయాలని సూచిస్తే వైకాపా నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఎంపీ సుజనా చౌదరి అన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో రూ.30 వేల కోట్లు అప్పు చేసిందని వెల్లడించారు. ఇలానే వ్యవహరిస్తే ఏపీ ఆర్థికవ్యవస్థ ఏమవుతుందని ప్రశ్నించారు.

ప్రభుత్వ సొమ్ముతో కార్యకర్తలకు జీతాలా..?
వైకాపా ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చి... ప్రభుత్వ సొమ్ముతో జీతాలు ఇస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఫలితంగా పార్టీ జెండా కప్పుకున్న వారికే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని విమర్శించారు. వైకాపా సర్కార్‌ను ఇంకా నాలుగున్నరేళ్లు ఎలా భరించాలనే భయాందోళన రాష్ట్రంలో నెలకొందని కన్నా పేర్కొన్నారు. కృత్రిమ ఇసుక కొరతతో వేలాది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్న ఆయన.. ప్రభుత్వానికి మద్యంపాలసీపై ఉన్న శ్రద్ధ ఇసుకపై లేదని ఎద్దేవా చేశారు. దేవాదాయ భూములు అన్యాక్రాంతం చేయాలని చూస్తే భాజపా పోరాటం చేస్తుందని కన్నా హెచ్చారించారు.

ఇదీ చదవండి

'దాడి యత్నాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం'

Intro:Body:Conclusion:
Last Updated : Nov 29, 2019, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.