ETV Bharat / city

తెలంగాణలో మరో ఇద్దరికి కరోనా.. 135కి చేరిన కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 143కు చేరుకోగా... తెలంగాణలో 135కి చేరింది.

author img

By

Published : Apr 2, 2020, 7:40 PM IST

two-more-new-cases
తెలంగాణలో మరో ఇద్దరికి కరోనా.. 135కి చేరిన కేసులు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తెలంగాణలోనూ ప్రతాపం చూపుతోంది. ములుగు జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఏటూరునాగారంలో ఒకరికి, పస్రాలో మరొకరికి కరోనా సోకినట్టు ప్రకటించారు. వీరిద్దరూ నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లి వచ్చారు. ఇద్దరికి ఎలాంటి కరోనా లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయించామని తెలిపారు.

సంగారెడ్డి జిల్లాలో ఆరుగురికి...

సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డిలో ఇద్దరు, అంగడిపేటలో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. జహీరాబాద్‌, కొండాపూర్‌లో ఒక్కొక్కరికి కరోనా సోకింది.

మంత్రి హరీశ్​రావు సమీక్ష

ఆర్థిక శాఖమంత్రి మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హుటాహుటిన సంగారెడ్డి చేరుకున్నారు. కలెక్టర్‌తో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. కరోనా పాజిటివ్ గా తేలిన ఆరుగురు బాధితులను వైద్యచికిత్స కోసం తరలించారు. వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచారు. కొత్తగా వచ్చిన ఎనిమిదితో కలుపుకుని తెలంగాణలో కరోనా కేసులు 135కు చేరాయి.

ఇవీ చూడండి:

కరోనా కట్టడి చర్యలపై సీఎం​కు చంద్రబాబు లేఖ

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తెలంగాణలోనూ ప్రతాపం చూపుతోంది. ములుగు జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఏటూరునాగారంలో ఒకరికి, పస్రాలో మరొకరికి కరోనా సోకినట్టు ప్రకటించారు. వీరిద్దరూ నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లి వచ్చారు. ఇద్దరికి ఎలాంటి కరోనా లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయించామని తెలిపారు.

సంగారెడ్డి జిల్లాలో ఆరుగురికి...

సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డిలో ఇద్దరు, అంగడిపేటలో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. జహీరాబాద్‌, కొండాపూర్‌లో ఒక్కొక్కరికి కరోనా సోకింది.

మంత్రి హరీశ్​రావు సమీక్ష

ఆర్థిక శాఖమంత్రి మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హుటాహుటిన సంగారెడ్డి చేరుకున్నారు. కలెక్టర్‌తో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. కరోనా పాజిటివ్ గా తేలిన ఆరుగురు బాధితులను వైద్యచికిత్స కోసం తరలించారు. వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచారు. కొత్తగా వచ్చిన ఎనిమిదితో కలుపుకుని తెలంగాణలో కరోనా కేసులు 135కు చేరాయి.

ఇవీ చూడండి:

కరోనా కట్టడి చర్యలపై సీఎం​కు చంద్రబాబు లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.