ETV Bharat / city

TSRTC BUS CHARGES: బస్సు ఛార్జీలు పెంచేందుకు 'టీఎస్ఆ​ర్టీసీ యాజమాన్యం కసరత్తులు

author img

By

Published : Dec 1, 2021, 9:41 AM IST

TSRTC BUS CHARGES: బస్సు ఛార్జీలు పెంచేందుకు టీఎస్​ఆర్టీసీ యాజమాన్యం కసరత్తులు చేస్తోంది. ఛార్జీల పెంపుపై తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేడు రవాణాశాఖ కేంద్ర కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధానంగా ఆర్టీసీ(TSRTC) ఛార్జీలు పెంచే అంశంపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కాలంటే ఛార్జీలు పెంచడం ఒక్కటే మార్గమని యాజమాన్యం భావిస్తోంది.

TSRTC BUS CHARGES
TSRTC BUS CHARGES

TSRTC BUS CHARGES: నష్టాల నుంచి గట్టేక్కేందుకు టీఎస్​ఆర్టీసీ ఛార్జీలను పెంచాలని యాజమాన్యం భావిస్తోంది. ఈమేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని కోరనుంది. రెండేళ్ల క్రితం ఆర్టీసీలో సమ్మె తర్వాత 2019 డిసెంబరులో ఆర్టీసీ ఛార్జీలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ సమయంలో కిలోమీటరుకు రూ.20 పైసల చొప్పున పెంచింది. ఆ తర్వాత చిల్లర కష్టాల పేరుతో మరో 10పైసలు పెంచింది. అయితే ఆర్టీసీని నష్టాలు వెంటాడుతున్నాయి. వాటి నుంచి బయటపడేందుకు పలు చర్యలు తీసుకుంటున్నా... ఛార్జీలు పెంచడం తప్పదని యాజమాన్యం భావిస్తోంది. ఈమధ్య తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌, ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌లు సమావేశమై ఛార్జీలు పెంచడానికి నిర్ణయించారు. ఈమేరకు ముఖ్యమంత్రి వద్దకు ప్రతిపాదనలు తీసుకెళ్లారు. కిలోమీటరుకు 25 పైసల నుంచి 30 పైసల వరకు పెంచాలని ప్రతిపాదించారు.

ఛార్జీలు పెరిగితే..

ప్రస్తుతం కిలోమీటరుకు కనీస ఛార్జీ 10 నుంచి గరిష్ఠంగా 35 రూపాయల వరకు ఉంది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ సబర్బన్, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులకు కిలోమీటర్‌కు 10 రూపాయల చొప్పున.. మెట్రో డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులకు 15 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. డీలక్స్ బస్సులకు 20 రూపాయలు, సూపర్ లగ్జరీ బస్సులకు 25, రాజధాని ఏసీ బస్సులకు 35, గరుడప్లస్ ఏసీ బస్సులకు కిలోమీటర్‌కు 35 రూపాయలు వసూలు చేస్తున్నారు. బస్సు ఛార్జీలు పెరిగితే... ఇప్పుడున్న నష్టాల్లో కొంతమేరకైనా తగ్గే అవకాశాలున్నాయని ఆర్టీసీ యాజమాన్యం అంచనా వేస్తోంది.

మూడేళ్లలో భారీ నష్టం

గడిచిన మూడేళ్లలో ఆర్టీసీ ఆదాయానికి, ఖర్చుకు మధ్య అంతరం భారీగా పెరిగిపోయింది. ఈ మూడేళ్లలోనే ఆర్టీసీకి రూ.4,260 కోట్ల నష్టాలు వచ్చాయి. కరోనా లాక్‌డౌన్‌తో, పెరిగిన డీజిల్ ధరలతో నష్టాలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.పెరుగుతున్న నష్టాలను తగ్గించుకోవాలంటే టిక్కెట్ ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని ఆర్టీసీ యాజమాన్యం అభిప్రాయపడుతుంది.

  • 2018-19 మార్చి నాటికి ఆర్టీసీ ఆదాయం రూ.4,882 కోట్లు కాగా, ఖర్చు రూ.5,811 కోట్లకు చేరుకుంది. నష్టం రూ.929 కోట్లు.
  • 2019-20 మార్చి నాటికి ఆదాయం రూ.4,592 కోట్లు, ఖర్చు 5,594 కోట్లు. నష్టం రూ.1,002 కోట్లు.
  • 2020-21 మార్చి నాటికి ఆర్టీసీ ఆదాయం 2,455 కోట్లు, ఖర్చు రూ.4,784 కోట్లకు చేరుకుంది. నష్టం రూ.2,329 కోట్లు.

ఏటా రూ.900కోట్ల ఆదాయం

అయితే... బస్సు ఛార్జీల పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇప్పటివరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఒకవేళ యాజమాన్యం అనుకున్నట్లు ఛార్జీలు పెంచితే ఆర్టీసీకి ఏటా 900 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. ఇవాళ జరగనున్న సమావేశంలో ఆర్టీసీ నష్టాలు, ఛార్జీల పెంపుపై చర్చించి... మరోసారి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే అవకాశముంది.

ఇదీ చదవండి:

TIRUMALA: తిరుమల కనుమదారిలో విరిగిపడ్డ కొండచరియలు.. రెండో ఘాట్‌రోడ్‌ మూసివేత

TSRTC BUS CHARGES: నష్టాల నుంచి గట్టేక్కేందుకు టీఎస్​ఆర్టీసీ ఛార్జీలను పెంచాలని యాజమాన్యం భావిస్తోంది. ఈమేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని కోరనుంది. రెండేళ్ల క్రితం ఆర్టీసీలో సమ్మె తర్వాత 2019 డిసెంబరులో ఆర్టీసీ ఛార్జీలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ సమయంలో కిలోమీటరుకు రూ.20 పైసల చొప్పున పెంచింది. ఆ తర్వాత చిల్లర కష్టాల పేరుతో మరో 10పైసలు పెంచింది. అయితే ఆర్టీసీని నష్టాలు వెంటాడుతున్నాయి. వాటి నుంచి బయటపడేందుకు పలు చర్యలు తీసుకుంటున్నా... ఛార్జీలు పెంచడం తప్పదని యాజమాన్యం భావిస్తోంది. ఈమధ్య తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌, ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌లు సమావేశమై ఛార్జీలు పెంచడానికి నిర్ణయించారు. ఈమేరకు ముఖ్యమంత్రి వద్దకు ప్రతిపాదనలు తీసుకెళ్లారు. కిలోమీటరుకు 25 పైసల నుంచి 30 పైసల వరకు పెంచాలని ప్రతిపాదించారు.

ఛార్జీలు పెరిగితే..

ప్రస్తుతం కిలోమీటరుకు కనీస ఛార్జీ 10 నుంచి గరిష్ఠంగా 35 రూపాయల వరకు ఉంది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ సబర్బన్, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులకు కిలోమీటర్‌కు 10 రూపాయల చొప్పున.. మెట్రో డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులకు 15 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. డీలక్స్ బస్సులకు 20 రూపాయలు, సూపర్ లగ్జరీ బస్సులకు 25, రాజధాని ఏసీ బస్సులకు 35, గరుడప్లస్ ఏసీ బస్సులకు కిలోమీటర్‌కు 35 రూపాయలు వసూలు చేస్తున్నారు. బస్సు ఛార్జీలు పెరిగితే... ఇప్పుడున్న నష్టాల్లో కొంతమేరకైనా తగ్గే అవకాశాలున్నాయని ఆర్టీసీ యాజమాన్యం అంచనా వేస్తోంది.

మూడేళ్లలో భారీ నష్టం

గడిచిన మూడేళ్లలో ఆర్టీసీ ఆదాయానికి, ఖర్చుకు మధ్య అంతరం భారీగా పెరిగిపోయింది. ఈ మూడేళ్లలోనే ఆర్టీసీకి రూ.4,260 కోట్ల నష్టాలు వచ్చాయి. కరోనా లాక్‌డౌన్‌తో, పెరిగిన డీజిల్ ధరలతో నష్టాలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.పెరుగుతున్న నష్టాలను తగ్గించుకోవాలంటే టిక్కెట్ ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని ఆర్టీసీ యాజమాన్యం అభిప్రాయపడుతుంది.

  • 2018-19 మార్చి నాటికి ఆర్టీసీ ఆదాయం రూ.4,882 కోట్లు కాగా, ఖర్చు రూ.5,811 కోట్లకు చేరుకుంది. నష్టం రూ.929 కోట్లు.
  • 2019-20 మార్చి నాటికి ఆదాయం రూ.4,592 కోట్లు, ఖర్చు 5,594 కోట్లు. నష్టం రూ.1,002 కోట్లు.
  • 2020-21 మార్చి నాటికి ఆర్టీసీ ఆదాయం 2,455 కోట్లు, ఖర్చు రూ.4,784 కోట్లకు చేరుకుంది. నష్టం రూ.2,329 కోట్లు.

ఏటా రూ.900కోట్ల ఆదాయం

అయితే... బస్సు ఛార్జీల పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇప్పటివరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఒకవేళ యాజమాన్యం అనుకున్నట్లు ఛార్జీలు పెంచితే ఆర్టీసీకి ఏటా 900 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. ఇవాళ జరగనున్న సమావేశంలో ఆర్టీసీ నష్టాలు, ఛార్జీల పెంపుపై చర్చించి... మరోసారి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే అవకాశముంది.

ఇదీ చదవండి:

TIRUMALA: తిరుమల కనుమదారిలో విరిగిపడ్డ కొండచరియలు.. రెండో ఘాట్‌రోడ్‌ మూసివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.