ఆయనో వృక్ష ప్రేమికుడు. మొక్కలే ఆయనకు నేస్తాలు. వాటిని తన పిల్లలకన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. ఆ చెట్ల చెంతనే సేద తీరుతారు, మాట్లాడతారు. తన ఆనందాలను వాటితోనే పంచుకుంటారు. ఇంతకీ ఆయన ఉండేది ఏ అడవుల్లోనో కాదు.. చెన్నై మహా నగరంలో. పంజాబ్ నుంచి చెన్నై వచ్చి స్థిరపడిన ఓ పర్యావరణ ప్రేమికుడు తన ఇంటిని వనంలా మార్చుకున్నారు. 350కి పైగా అరుదైన చెట్లు, మొక్కలు, మూలికలను ఇంటి ఆవరణలో పెంచుతున్నారు. వృక్షో రక్షత రక్షితః అన్న మాటను అక్షరాలా అవలంభిస్తోన్న జస్వంత్ సింగ్పై ప్రత్యేక కథనం.
ఇవీ చదవండి: