ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM

ప్రధాన వార్తలు @ 9 AM

author img

By

Published : Jun 8, 2021, 9:01 AM IST

Updated : Jun 8, 2021, 9:07 AM IST

Top News @ 9 AM
Top News @ 9 AM
  • నేడు 'జగనన్న తోడు' రెండో విడత నిధులు విడుదల
    రాష్ట్రంలోని చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తి కళాకారులకు జగనన్న తోడు పథకం రెండో విడత కింద రూ.370 కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి జగన్​ విడుదల చేస్తారని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ భరత్​ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • Covid Third Wave: పిల్లల కోసం.. ఒక్కోటి 180 కోట్లతో 3 ఆసుపత్రులు: సీఎం జగన్
    కొవిడ్ థర్డ్​వేవ్ (Covid Third Wave) దృష్ట్యా చిన్నారుల కోసం రాష్ట్రంలో 3 కేర్‌ సెంటర్లు (care centers) ఏర్పాటు చేయాలని సీఎం జగన్ (cm jagan ) ఆదేశాలు జారీ చేశారు. మూడో వేవ్​పై సమీక్షించిన ఆయన.. పలు కీలక సూచనలు చేశారు. ఒక్కో ఆస్పత్రికి రూ.180 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • Black Fungus in AP: రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,623 కేసులు, 103 మంది మృతి!
    బ్లాక్‌ ఫంగస్‌ కేసుల్లో మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫంగస్‌ లక్షణాలు ముందే గుర్తించలేకపోవడం, చికిత్సకు అత్యవసరంగా ఉపయోగించాల్సిన ఇంజెక్షన్ల కొరత మరణాలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,623 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదు కాగా... 103 మంది మరణించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • 'జూన్ 21 నుంచి అందరికీ ఉచితంగా టీకా'
    18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా కేంద్రమే అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇందుకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను రూపొందించి, జూన్​ 21 నుంచి సరికొత్త విధానం అమలు చేస్తామని ప్రకటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • ప్రజలకు 'పరోక్ష' వాతలు!
    కరోనా పేరు చెప్పుకొని తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి గత ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోకుండా, పరోక్ష పన్నులను భారీగా పెంచుకుంటూ పోయాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • ఓపెన్‌ స్కైస్‌ ఒప్పందం నుంచి వైదొలిగిన రష్యా
    స్వేచ్ఛాయుత గగనతల ఒప్పందం(ఓఎస్​టీ) నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా అధికారికంగా ప్రకటించింది. ఈ బిల్లుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంతకం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • Brain Tumor Day: మెదడులో.. కణితి ఎలా ఏర్పడుతుంది?
    అన్ని అవయవాల పనితీరును నియంత్రించేది, నిర్వర్తించేది మెదడే. ఇంతటి కీలకమైన మెదడులో కణితి (ట్యూమర్‌) ఏర్పడితే? ఎవరికైనా ఆందోళన సహజమే. నిజానికి మెదడు కణితులన్నీ క్యాన్సర్‌ కానవసరం లేదు. మామూలువీ కావొచ్చు. వీలైనంత త్వరగా గుర్తిస్తే కొన్ని కణితులను పూర్తిగా నయం చేయొచ్చు. కావాల్సింది అవగాహనే. వరల్డ్‌ బ్రెయిన్‌ ట్యామర్‌ డే సందర్భంగా మెదడు కణితులపై సమాచారం మీకోసం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • మరింత సులభంగా ఐటీ రిటర్నులు
    పన్ను చెల్లింపుదారులు మరింత సులభంగా వీటిని దాఖలు చేసేందుకు వెబ్‌సైట్‌లో మార్పులు చేసింది ఆదాయ పన్ను శాఖ. ఐటీఆర్‌ ఇ-ఫైలింగ్‌ 2.0 పోర్టల్​ను మరిన్ని కొత్త సదుపాయాలతో అందుబాటులోకి తీసుకువచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • టీ20 ప్రపంచకప్‌ ఆతిథ్య రేసులో శ్రీలంక
    భారత్​లో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్​ను(T20 worldcup) యూఏఈలో నిర్వహిస్తారని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడు ఈ మెగాటోర్నీని శ్రీలంకకు తరలించే అవకాశం ఉందని బీసీసీఐ(BCCI) వర్గాల సమాచారం. యూఏఈ కాకుండా లంకను ఎంచుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • Raksha bandhan: మరోసారి జోడీగా అక్షయ్​, భూమి!
    అక్షయ్​ కుమార్(Akshay Kumar)​, భూమి పెడ్నేకర్​ మరోసారి జోడీ కట్టనున్నారు. ఆనంద్​ ఎల్​ రాయ్​ దర్శకత్వంలో రూపొందనున్న 'రక్షాబంధన్​'(Raksha bandhan) చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించనున్నారని సమాచారం. ఈ నెలలోనే ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • నేడు 'జగనన్న తోడు' రెండో విడత నిధులు విడుదల
    రాష్ట్రంలోని చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తి కళాకారులకు జగనన్న తోడు పథకం రెండో విడత కింద రూ.370 కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి జగన్​ విడుదల చేస్తారని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ భరత్​ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • Covid Third Wave: పిల్లల కోసం.. ఒక్కోటి 180 కోట్లతో 3 ఆసుపత్రులు: సీఎం జగన్
    కొవిడ్ థర్డ్​వేవ్ (Covid Third Wave) దృష్ట్యా చిన్నారుల కోసం రాష్ట్రంలో 3 కేర్‌ సెంటర్లు (care centers) ఏర్పాటు చేయాలని సీఎం జగన్ (cm jagan ) ఆదేశాలు జారీ చేశారు. మూడో వేవ్​పై సమీక్షించిన ఆయన.. పలు కీలక సూచనలు చేశారు. ఒక్కో ఆస్పత్రికి రూ.180 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • Black Fungus in AP: రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,623 కేసులు, 103 మంది మృతి!
    బ్లాక్‌ ఫంగస్‌ కేసుల్లో మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫంగస్‌ లక్షణాలు ముందే గుర్తించలేకపోవడం, చికిత్సకు అత్యవసరంగా ఉపయోగించాల్సిన ఇంజెక్షన్ల కొరత మరణాలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,623 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదు కాగా... 103 మంది మరణించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • 'జూన్ 21 నుంచి అందరికీ ఉచితంగా టీకా'
    18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా కేంద్రమే అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇందుకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను రూపొందించి, జూన్​ 21 నుంచి సరికొత్త విధానం అమలు చేస్తామని ప్రకటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • ప్రజలకు 'పరోక్ష' వాతలు!
    కరోనా పేరు చెప్పుకొని తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి గత ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోకుండా, పరోక్ష పన్నులను భారీగా పెంచుకుంటూ పోయాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • ఓపెన్‌ స్కైస్‌ ఒప్పందం నుంచి వైదొలిగిన రష్యా
    స్వేచ్ఛాయుత గగనతల ఒప్పందం(ఓఎస్​టీ) నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా అధికారికంగా ప్రకటించింది. ఈ బిల్లుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంతకం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • Brain Tumor Day: మెదడులో.. కణితి ఎలా ఏర్పడుతుంది?
    అన్ని అవయవాల పనితీరును నియంత్రించేది, నిర్వర్తించేది మెదడే. ఇంతటి కీలకమైన మెదడులో కణితి (ట్యూమర్‌) ఏర్పడితే? ఎవరికైనా ఆందోళన సహజమే. నిజానికి మెదడు కణితులన్నీ క్యాన్సర్‌ కానవసరం లేదు. మామూలువీ కావొచ్చు. వీలైనంత త్వరగా గుర్తిస్తే కొన్ని కణితులను పూర్తిగా నయం చేయొచ్చు. కావాల్సింది అవగాహనే. వరల్డ్‌ బ్రెయిన్‌ ట్యామర్‌ డే సందర్భంగా మెదడు కణితులపై సమాచారం మీకోసం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • మరింత సులభంగా ఐటీ రిటర్నులు
    పన్ను చెల్లింపుదారులు మరింత సులభంగా వీటిని దాఖలు చేసేందుకు వెబ్‌సైట్‌లో మార్పులు చేసింది ఆదాయ పన్ను శాఖ. ఐటీఆర్‌ ఇ-ఫైలింగ్‌ 2.0 పోర్టల్​ను మరిన్ని కొత్త సదుపాయాలతో అందుబాటులోకి తీసుకువచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • టీ20 ప్రపంచకప్‌ ఆతిథ్య రేసులో శ్రీలంక
    భారత్​లో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్​ను(T20 worldcup) యూఏఈలో నిర్వహిస్తారని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడు ఈ మెగాటోర్నీని శ్రీలంకకు తరలించే అవకాశం ఉందని బీసీసీఐ(BCCI) వర్గాల సమాచారం. యూఏఈ కాకుండా లంకను ఎంచుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • Raksha bandhan: మరోసారి జోడీగా అక్షయ్​, భూమి!
    అక్షయ్​ కుమార్(Akshay Kumar)​, భూమి పెడ్నేకర్​ మరోసారి జోడీ కట్టనున్నారు. ఆనంద్​ ఎల్​ రాయ్​ దర్శకత్వంలో రూపొందనున్న 'రక్షాబంధన్​'(Raksha bandhan) చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించనున్నారని సమాచారం. ఈ నెలలోనే ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
Last Updated : Jun 8, 2021, 9:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.