- ప్రతీకారం తీర్చుకోవడం దారుణం
హైకోర్టుకు వెళ్లిన రైతుపై అధికారులు ప్రతీకారం తీర్చుకోవడం దారుణం అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అతని మృతికి కారణమైన అధికారులకు కఠిన శిక్ష పడేంత వరకు ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- మధ్యంతర ఉత్తర్వులు
రాష్ట్ర సర్కారు తీసుకువచ్చిన జీవో 56ను అమలు చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవోను అమలు చేయాలంటూ సామాజిక కార్యకర్త సురేశ్ బాబు దాఖలు చేసిన పిల్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- స్వామీజీ ప్రబోధానంద కన్నుమూత
ప్రబోధానంద అనారోగ్యంతో హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని తాడిపత్రి మండలంలోని చిన్నపొడమల ఆశ్రమానికి తరలించారు. త్రైత సిద్ధాంతంపై ఈయన అనేక పుస్తకాలు రచించారు. వివాదాస్పద బోధనలు, అభిప్రాయాల వల్ల ప్రబోధానందను ఎంతోమంది విమర్శించేవారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- రూ.18 లక్షల ఖైనీ ప్యాకెట్ల పట్టివేత
విజయవాడ కమిషనరేట్ పరిధిలో రూ.18 లక్షల విలువైన ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయనగరం జిల్లా తరలిస్తుండగా ట్సాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. ఆరుగురిని అరెస్టు చేసి లారీని స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- సన్నిహితుల నుంచే వ్యాప్తి
భారత్లో కరోనా సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్ మరోమారు స్పష్టం చేసింది. వైరస్ నుంచి కోలుకుంటున్న వారి శాతం 62కు పెరిగినట్లు తెలిపింది. కరోనా బాధితుల సన్నిహితులకే వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు పేర్కొంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- ఉద్రిక్తతలకు ముగింపు కాదు
లద్దాఖ్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో భారత్- చైనా తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నాయి. దీని అర్థం ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గినట్లు కాదని సైనిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సైనికుల ఆగ్రహాన్ని దృష్టిలో ఉంచుకొని హింసాత్మక ఘటనలు తలెత్తకుండా ఈ ప్రక్రియ చేపడతారని తెలిపారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- మరింత క్రేజీగా...
వినియోగదారులకు కొత్త ఫీచర్లను అందించడంలో వాట్సాప్ ఎప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగా చాటింగ్లో బోర్ కొట్టకుండా.. ఆసక్తికరంగా మెసేజ్లు పంపించుకునేందుక్ స్టిక్కర్ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- చీలిక తప్పదా?
నేపాల్ అధికార కమ్యూనిస్టు పార్టీలో విభేదాలు... పార్టీలో చీలికకు దారీ తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వివాద పరిష్కారానికి ప్రధాని కేపీ శర్మ ఓలి, నేపాల్ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు ప్రచండ ఇప్పటికే ఆరుసార్లు భేటీ అయ్యారు. అయితే ఫలితం మాత్రం శూన్యం. శుక్రవారం జరగుతుందని భావిస్తున్న పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రధాని ఓలీ భవిష్యత్తు తేలనుంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- ప్లాస్మా దానం చేసి ప్రాణాలు కాపాడండి
కరోనా వైరస్తో పోరాడుతున్న వారికి ప్లాస్మా దానం చేయాలని వైరస్ బారిన పడి కోలుకున్న వారికి పిలుపునిచ్చారు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్. అలా చేస్తే విషమ పరిస్థితుల్లో ఉన్న వారు మెరుగయ్యే అవకాశం ఉందని తెలిపారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- కేసు కొట్టివేత
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకుని ఇటీవలే మరణించాడు. అయితే అతడి మృతికి బాలీవుడ్లోని కొందరు పెద్దలే కారణమని, బిహార్ న్యాయస్థానంలో న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా పిటిషన్ వేశారు. తాజాగా దానిని కొట్టేసిన కోర్టు.. ఈ విషయం తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి