ETV Bharat / city

Theft in petrol bunk: పెట్రోల్ బంకులో దొంగల బీభత్సం.. రూ.40వేలు చోరీ

Theft in petrol bunk: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో దొంగల ముఠా హల్​చల్​ చేసింది. ధర్పల్లి మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంకులో బీభత్సం సృష్టించింది. రాళ్లదాడితో బంకు సిబ్బందిని బెదిరించిన దుండగులు... క్యాష్ కౌంటర్ ఎత్తుకెళ్లారు

author img

By

Published : Dec 30, 2021, 6:19 PM IST

Theft in petrol bunk
Theft in petrol bunk

Theft in petrol bunk: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో దొంగలు హల్​చల్​ చేశారు. ధర్పల్లి మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో బీభత్సం సృష్టించారు. పది మందికి పైగా... ముఠాగా వచ్చి పెట్రోల్ బంకుపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. భయాందోళనకు గురైన సిబ్బందిని బెదిరించి.. క్యాష్ కౌంటర్​ను పగలగొట్టారు. అందు​లో ఉన్న రూ.40 వేలను దొంగలించారు.

బంకు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ శ్రీశైలంతో కలిసి నిజామాబాద్ సీపీ నాగరాజు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Theft in petrol bunk: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో దొంగలు హల్​చల్​ చేశారు. ధర్పల్లి మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో బీభత్సం సృష్టించారు. పది మందికి పైగా... ముఠాగా వచ్చి పెట్రోల్ బంకుపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. భయాందోళనకు గురైన సిబ్బందిని బెదిరించి.. క్యాష్ కౌంటర్​ను పగలగొట్టారు. అందు​లో ఉన్న రూ.40 వేలను దొంగలించారు.

బంకు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ శ్రీశైలంతో కలిసి నిజామాబాద్ సీపీ నాగరాజు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి: MINISTER PERNI NANI: నిబంధనలు పాటిస్తూ థియేటర్లు నడుపుకోవచ్చు: పేర్ని నాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.