ETV Bharat / city

సన్నిహితులకే ‘కిక్కు’.. 16 మద్యం కంపెనీలపై అంతులేని ప్రేమ..

author img

By

Published : Jun 28, 2022, 3:57 AM IST

రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన మద్యం.. వైకాపా ప్రభుత్వం వచ్చాక అధికార పార్టీ కీలక నేతలకూ కాసులు కురిపిస్తోందన్న విమర్శలు హోరెత్తుతున్నాయి. కొందరు నేతలు, అధికార పార్టీ వారికి చెందిన డిస్టిలరీలు, వారి మెప్పు పొందిన కంపెనీల బ్రాండ్లే భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఏపీఎస్‌బీసీఎల్‌ వద్ద మద్యం సరఫరాకు దాదాపు 100 కంపెనీలు నమోదై ఉన్నాయి. వీటిలో 16 కంపెనీలపైనే ఏపీఎస్‌బీసీఎల్‌ అంతులేని ప్రేమ కనబరిచింది. 2019 అక్టోబరు 2 నుంచి 2021 నవంబరు 30 మధ్య 73.92% మద్యం సరఫరా ఆర్డర్లను ఆ సంస్థలకే కట్టబెట్టింది. తమిళనాడు కంపెనీల బ్రాండ్లకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి.

Liquor companies
Liquor companies

సర్కారు ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన మద్యం.. వైకాపా ప్రభుత్వం వచ్చాక అధికార పార్టీ కీలక నేతలకూ కాసులు కురిపిస్తోందన్న విమర్శలు హోరెత్తుతున్నాయి. కొందరు నేతలు, అధికార పార్టీ వారికి చెందిన డిస్టిలరీలు, వారి మెప్పు పొందిన కంపెనీల బ్రాండ్లే భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) వద్ద మద్యం సరఫరాకు దాదాపు 100 కంపెనీలు నమోదై ఉన్నాయి. వీటిలో 16 కంపెనీలపైనే ఏపీఎస్‌బీసీఎల్‌ అంతులేని ప్రేమ కనబరిచింది. 2019 అక్టోబరు 2 నుంచి 2021 నవంబరు 30 మధ్య 73.92% మద్యం సరఫరా ఆర్డర్లను ఆ సంస్థలకే కట్టబెట్టింది. విలువ ప్రకారం చూస్తే అది 62 శాతం. వీటిలో అత్యధికం అధికార పార్టీకి చెందిన, ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉన్న వారివేననే ప్రచారం ఉంది.

2019 డిసెంబరు 2న ‘అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ అనే సంస్థ హైదరాబాద్‌లో ఊపిరి పోసుకుంది. సొంతంగా ఒక్క డిస్టిలరీ కూడా లేని ఈ సంస్థకు రెండేళ్లలోనే రూ.1164 కోట్ల విలువైన 68 లక్షల కేసుల మద్యం సరఫరాకు ఓఎఫ్‌ఎస్‌లు ఇవ్వడం గమనార్హం.

.

‘మద్యం అధికార పార్టీ కీలక నేతలకు కాసులు కురిపిస్తోంది.. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి, ఏపీఎస్‌బీసీఎల్‌లోని ఓ ఉన్నతాధికారి కనుసన్నల్లోనే మొత్తం మద్యం వ్యాపారం నడుస్తోంది.. ఏ కంపెనీ నుంచి, ఏ బ్రాండు మద్యాన్ని ఎంత కొనాలో వారే నిర్ణయిస్తున్నారు’.. అని ప్రతిపక్షాలు తొలి నుంచీ ఆరోపిస్తున్నాయి. ఈ వాదనలకు బలం చేకూర్చేలాగానే ఏపీఎస్‌బీసీఎల్‌ మద్యం సరఫరా ఆర్డర్లు ఇస్తోంది. సొంత డిస్టిలరీలు లేకున్నా వేరేవాటిని సబ్‌లీజుకు తీసుకుని తమ బ్రాండ్ల మద్యం తయారు చేయించుకున్న కంపెనీలకూ, ప్రభుత్వం మద్యం వ్యాపార నిర్వహణ ప్రారంభించిన రెండు నెలల తర్వాత పుట్టిన కంపెనీకీ, అధికార పార్టీ ప్రజాప్రతినిధి గుప్పిట్లో ఉందనే ప్రచారమున్న సంస్థకూ భారీ మొత్తాల్లో ఆర్డర్లు లభించాయి. తమిళనాడు వారి యాజమాన్యంలో ఉన్న కొన్ని కంపెనీలకు భారీగానే మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాయి. సమాచార హక్కు ద్వారా సేకరించిన ఈ వివరాల్ని విశ్లేషించి.. ఆ కంపెనీలు ఎవరివని ఆరా తీస్తే ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.

ఆ 16 కంపెనీలకే రూ.11,040.65 కోట్లు..

2019 అక్టోబరు 2 నుంచి 2021 నవంబరు 30 మధ్య 25 నెలల్లో ఏపీఎస్‌బీసీఎల్‌ వివిధ కంపెనీలకు.. రూ.17,570.49 కోట్ల విలువైన 10.28 కోట్ల కేసుల మద్యం సరఫరాకు ఆర్డర్లు (ఓఎఫ్‌ఎస్‌) ఇచ్చింది. అందులో రూ.11,040.65 కోట్ల విలువైన 7.60 కోట్ల కేసుల మద్యం సరఫరాకు ఎస్‌ఎన్‌జీ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బ్రూవరీస్‌ డివిజన్‌), ఎస్‌ఎన్‌జీ షుగర్స్‌ అండ్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బీఆర్‌కే స్పిరిట్స్‌, రాడికో ఖైతాన్‌, పెరల్‌ డిస్టిలరీస్‌ లిమిటెడ్‌, ఎంఎస్‌ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బీఆర్‌కే స్పిరిట్స్‌, శార్వాణి ఆల్కో బ్రూవరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సెంటినీ బయోప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అంబర్‌ స్పిరిట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బీడీహెచ్‌ ఆగ్రో వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, లీలా డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జేఆర్‌ అసోసియేట్స్‌ కంపెనీ, ఈగల్‌ డిస్టిలరీ కంపెనీ లిమిటెడ్‌లకే ఆర్డర్లు దక్కాయి.

.

కొత్త మద్యం విధానం వచ్చాక ఏర్పాటైన కంపెనీకి రూ.1,164 కోట్ల ఆర్డర్లు..

* వైకాపా అధికారంలోకి వచ్చాక.. 2019 అక్టోబరు 2 నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రైవేటు వ్యాపారుల చేతిలో ఉన్న మద్యం దుకాణాల్ని ప్రభుత్వమే నిర్వహించటం ప్రారంభించింది. కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన రెండు నెలల తర్వాత 2019 డిసెంబరు 2న ‘అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ అనే సంస్థ హైదరాబాద్‌లో ఊపిరి పోసుకుంది.

* ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన కాశీచాయనుల శ్రీనివాసులు.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్న శ్రేయాస్‌ బయోలాజికల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 2021లో 5 నెలలు (జనవరి నుంచి జూన్‌ వరకూ) డైరెక్టర్‌గా వ్యవహరించారు.

* సొంతంగా ఒక్క డిస్టిలరీ కూడా లేని ఈ సంస్థకు రెండేళ్లలోనే (2019 డిసెంబరు 2 నుంచి 2021 నవంబరు 30 మధ్య) రూ.1164.86 కోట్ల విలువైన 68.02 లక్షల కేసుల మద్యం సరఫరాకు ఓఎఫ్‌ఎస్‌లు ఇవ్వడం గమనార్హం.

వేరే డిస్టిలరీలు సబ్‌లీజుకు తీసుకుని..

* సొంత డిస్టిలరీలు లేకపోవడంతో అదాన్‌ సంస్థ.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల రాజేష్‌ 2020 నవంబరు 10 వరకూ డైరెక్టర్‌గా కొనసాగిన విశాఖ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్‌కుమార్‌కు సంబంధించిన పీఎంకే డిస్టిలేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌లను సబ్‌లీజుకు తీసుకుని తమ కంపెనీ బ్రాండ్ల మద్యం తయారు చేయిస్తోంది.

* ఏసీ బ్లాక్‌ రిజర్వ్‌ విస్కీ, అదాన్స్‌ సుప్రీం బ్లెండ్‌ సుపీరియర్‌ గ్రెయిన్‌ విస్కీ, అరిస్టోక్రాట్‌ ప్రీమియం క్లాసిక్‌ విస్కీ బ్రాండ్లు ఉత్పత్తి చేస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కొన్నాళ్లపాటు ఈ కంపెనీ బ్రాండ్ల మద్యాన్ని మాత్రమే అమ్మాలని సిబ్బందికి లక్ష్యాలు కూడా విధించడం గమనార్హం.

అధికార పార్టీ కీలకనేత గుప్పిట్లోని కంపెనీకి రూ.1,863 కోట్ల ఆర్డర్లు

* రాయలసీమలోని ఓ దివంగత నేతకు చెందిన కంపెనీకి రూ.1,863 కోట్ల విలువైన మద్యం సరఫరాకు ఆర్డర్లు దక్కాయి. దీని వెనుక పెద్ద కథే ఉంది. వైకాపా అధికారం చేపట్టిన అప్పటి నుంచి ఆ కంపెనీ.. అధికార పార్టీలో చక్రం తిప్పే, అత్యంత సీనియర్‌ నేత అయిన ప్రజాప్రతినిధి కుమారుడి ఆధీనంలోకి వెళ్లిపోయింది. అతనూ ప్రస్తుతం ప్రజాప్రతినిధే. ఆ నాయకుడి గుప్పిట్లోనే ఇప్పుడు అక్కడ రకరకాల బ్రాండ్లు తయారవుతున్నాయి.

* ఈ కంపెనీకి 25 నెలల్లో (2019 అక్టోబరు 2 - 2021 నవంబరు 30) 1.16 కోట్ల కేసుల మద్యం సరఫరాకు ఏపీఎస్‌బీసీఎల్‌ ఆర్డర్లు ఇచ్చింది. వీటి విలువ ఏకంగా రూ.1,863.12 కోట్లు.

ఒకే ప్రాంగణం, చిరునామాతో ఉన్న రెండు కంపెనీలకు రూ.774.71 కోట్ల విలువైన ఆర్డర్లు..

.

* ఎంఎస్‌ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జేఆర్‌ అసోసియేట్స్‌ కంపెనీలు రెండూ ఒకే ప్రాంగణంలో, ఒకే భవనంలో నడుస్తున్నాయి. ఎంఎస్‌ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ సాగర్‌ సొసైటీలోని ప్లాట్‌ నంబర్‌-64, రోడ్డు నంబర్‌-2 చిరునామాతో ఉండగా, జేఆర్‌ అసోసియేట్స్‌ అనే మరో కంపెనీ ప్లాట్‌ నంబర్‌ 64/ఏ, స్ట్రీట్‌ నంబర్‌-1, రోడ్డు నంబర్‌-2 సాగర్‌ సొసైటీ, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌ చిరునామాతో ఉంది. అయితే ఈ రెండు చిరునామాలు ఒకే భవనానికి సంబంధించినవిగా ‘ఈనాడు’ పరిశీలనలో తేలింది. ఈ రెండు కంపెనీల యజమాని పేరు జైపాల్‌రెడ్డే. ఈ రెండింటికీ కలిపి ఏపీఎస్‌బీసీఎల్‌ ఏకంగా రూ.774.71 కోట్ల విలువైన మద్యం సరఫరాకు ఆర్డర్లు ఇచ్చింది.

* ఎంఎస్‌ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.585.57 కోట్ల విలువైన 28.63 లక్షల కేసుల మద్యం సరఫరా కోసం ఆర్డర్లు దక్కాయి. అమిరెడ్డి జైపాల్‌రెడ్డి, అమిరెడ్డి స్నేహారెడ్డి, యోగేష్‌కుమార్‌ జాజులు ఈ కంపెనీలో డైరెక్టర్లు. ఈ కంపెనీ కూడా ఏపీలోని బీడీహెచ్‌ ఆగ్రో వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, విశాఖ డిస్టిలరీస్‌, బీఆర్‌కే స్పిరిట్స్‌, సోరింగ్‌ స్పిరిట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డిస్టిలరీల్లో వివిధ రకాల మద్యం బ్రాండ్లు తయారు చేసి.. ఏపీఎస్‌బీసీఎల్‌కు సరఫరా చేస్తోంది.

* ఈ కంపెనీ సరఫరా చేసే మేన్షన్‌ హౌస్‌ ట్రూ స్పిరిట్‌ ఫ్రెంచ్‌ బ్రాందీ, మంజీరా క్లాసిక్‌ రిజర్వ్‌ విస్కీ, టీఐ మేన్షన్‌ హౌస్‌ అథెంటిక్‌ ప్రీమియం ఫ్రెంచ్‌ బ్రాందీ, టీఐ మేన్షన్‌ హౌస్‌ రేరేస్ట్‌ స్పిరిట్‌ ఫ్రెంచ్‌ బ్రాందీ కోసం ఎక్కువగా ఏపీఎస్‌బీసీఎల్‌ ఆర్డర్లు ఇచ్చింది. వీటిలో టీఐ మేన్షన్‌ హౌస్‌ ట్రూ స్పిరిట్‌ ఫ్రెంచ్‌ బ్రాందీ, టీఐ కొరియర్‌ నెపోలియన్‌ గ్రీన్‌ సెయింట్‌ మిలియన్‌ ప్రీమియం ఫ్రెంచ్‌ బ్రాందీ సరఫరాకు ఏపీఎస్‌బీసీఎల్‌ నుంచి భారీగా ఆర్డర్లు దక్కాయి.

* జేఆర్‌ అసోసియేట్స్‌ కంపెనీ విశాఖ డిస్టిలరీస్‌ను సబ్‌ లీజుకు తీసుకుని మంజీరా క్లాసిక్‌ రిజర్వ్‌ విస్కీని ఉత్పత్తి చేస్తోంది. ఆ ఒక్క బ్రాండ్‌వే రూ.189.14 కోట్ల విలువైన 13.02 లక్షల కేసుల సరఫరాకు అనుమతులు దక్కడం గమనార్హం.

తమిళనాడుకు చెందిన ఎస్‌ఎన్‌జే కంపెనీలకు రూ.1,996.66 కోట్లు..

* ఎస్‌ఎన్‌జే 10000 స్పెషల్‌ సూపర్‌ స్ట్రాంగ్‌ బీర్‌, బ్రిటిష్‌ ఎంపైర్‌ అల్ట్రా ప్రీమియం స్ట్రాంగ్‌ బీర్‌, రాయల్‌ ప్యాలెస్‌ వీఎస్‌వోపీ బ్రాందీ, జీసీ గ్రీన్‌ ఛాయిస్‌ సుపీరియర్‌ విస్కీ, మల్బార్‌ హౌస్‌ వీఎస్‌వోపీ బ్రాందీ.. ఇవేవీ గతంలో పెద్దగా ప్రాచుర్యంలో లేవు. ఏపీలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మాత్రం మూడేళ్లుగా ఈ బ్రాండ్లు ఎక్కువగానే అమ్ముతున్నారు. తమిళనాడువాసులకు చెందిన ఎస్‌ఎన్‌జీ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బ్రూవరీస్‌ డివిజన్‌), ఎస్‌ఎన్‌జీ షుగర్స్‌ అండ్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ కంపెనీలు ఈ బ్రాండ్లు ఉత్పత్తి చేస్తున్నాయి.

* ఈ రెండు కంపెనీలకు కలిపి రూ.1996.66 కోట్ల విలువైన 2.12 కోట్ల కేసుల మద్యం సరఫరాకు ఏపీఎస్‌బీసీఎల్‌ ఆర్డర్లు ఇచ్చింది. ఎస్‌ఎన్‌జే షుగర్స్‌ అండ్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ తయారు చేసే.. జీసీ గ్రీన్‌ ఛాయిస్‌ సుపీరియర్‌ విస్కీ బ్రాండుకు వైకాపా అధికారంలోకి వచ్చాకే అనుమతిచ్చారు. ఈ ఒక్క బ్రాండుకే రూ.384.36 కోట్ల విలువైన 32.06 లక్షల కేసుల సరఫరా కోసం ఏపీఎస్‌బీసీఎల్‌ ఆర్డర్లు ఇవ్వడం గమనార్హం. అధికార పార్టీలోని కొందరు పెద్దలతో ఉన్న సంబంధాల వల్లే వీరికి ఇంత పెద్ద మొత్తంలో ఆర్డర్లు దక్కాయన్న ప్రచారం ఉంది.

* పుదుచ్చేరికి చెందిన లీలా డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి రూ.198.62 కోట్ల విలువైన మద్యం సరఫరా కోసం ఏపీఎస్‌బీసీఎల్‌ ఆర్డర్లు ఇచ్చింది. ఈ కంపెనీ తయారుచేసే లీలాస్‌ బ్రిలియంట్‌ బ్లెండ్‌ సూపర్‌ గ్రెయిన్‌ విస్కీ 9.83 లక్షల కేసుల సరఫరాకు ఆర్డర్లు దక్కాయి. ఎస్‌ఎన్‌జే షుగర్స్‌ అండ్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌, ఎస్‌ఎన్‌జే డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బ్రూవరీస్‌ డివిజన్‌)లో డైరెక్టర్లుగా ఉన్న గీతా జయమురుగన్‌ 2020 ఫిబ్రవరి 26 వరకూ, నాగలింగం జయమురుగన్‌ 2022 మార్చి 1 వరకూ లీలా డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లోనూ డైరెక్టర్లుగా కొనసాగారు.

పెరల్‌ డిస్టిలరీస్‌ కంపెనీలకు రూ.931.32 కోట్లు..

* ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఉన్న పెరల్‌ డిస్టిలరీస్‌ లిమిటెడ్‌ కంపెనీకి రూ.427.09 కోట్ల విలువైన 25.41 లక్షల మద్యం కేసుల సరఫరాకు, పెరల్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ కంపెనీకి రూ.504.22 కోట్ల విలువైన 28.77 లక్షల మద్యం కేసుల సరఫరాకు ఆర్డర్లు ఇచ్చారు. ఆ రెండు కంపెనీల పేరిటే రూ.931.32 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కాయి. మాగుంట పార్వతమ్మ ఈ కంపెనీలో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

* రాడికో ఖైతాన్‌ లిమిటెడ్‌ కంపెనీకి రూ.948.64 కోట్ల విలువైన 51 లక్షల మద్యం కేసుల సరఫరాకు ఆర్డర్లు ఇచ్చారు. సెంటినీ బయో ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పీఎంకే డిస్ట్టిలేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మోహన్‌ బ్రూవరీస్‌, బీఆర్‌కే స్పిరిట్స్‌ కంపెనీలను సబ్‌లీజుకు తీసుకుని వారి మద్యం బ్రాండ్లు తయారు చేశారు.

* ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం దావులూరు గ్రామంలోని బీఆర్‌కే స్పిరిట్స్‌ కంపెనీకి రూ.1041.15 కోట్ల విలువైన 77.24 లక్షల మద్యం కేసుల సరఫరాకు ఆర్డర్లు ఇచ్చారు.

* ఉమ్మడి కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని శార్వాణి ఆల్కో బ్రూవరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి రూ.426.64 కోట్ల విలువైన 30.23 లక్షల కేసుల కేసుల మద్యం సరఫరాకు ఆర్డర్లు లభించాయి. ఈ కంపెనీని హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఈ.చంద్రారెడ్డి నిర్వహిస్తున్నారు.

* ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సెంటినీ బయోప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి రూ.393.40 కోట్ల విలువైన 25.89 లక్షల కేసుల సరఫరా ఆర్డర్లు లభించాయి.

* అంబర్‌ స్పిరిట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి రూ.475.99 కోట్ల విలువైన 33.09 లక్షల కేసుల సరఫరాకు ఏపీఎస్‌బీసీఎల్‌ ఆర్డర్లు ఇచ్చింది.

* తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలోని బీడీహెచ్‌ ఆగ్రో వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి 24.99 లక్షల కేసుల మద్యం సరఫరాకు ఆర్డర్లు దక్కాయి. వీటి విలువ రూ.322.78 కోట్లు.

* ఈగల్‌ డిస్టిలరీస్‌కు రూ.532.46 కోట్ల విలువైన 41.74 లక్షల కేసుల మద్యం సరఫరాకు ఆర్డర్లు ఇచ్చారు.

* నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చాక ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌లో ఎస్పీవై హెచ్‌డీ గోల్డ్‌ విస్కీ, ఎస్పీవై గెలాక్సీ ప్యూర్‌ గ్రెయిన్‌ విస్కీ, ఎస్పీవై గెలాక్సీ బ్రాందీ, ఎస్పీవై హెచ్‌డీ గోల్డ్‌ బ్రాందీ, ఎస్పీవై ఛాంపియన్‌ స్పెషల్‌ విస్కీ బ్రాండ్లకు 2019 అక్టోబరు 2 నుంచి 2020 ఫిబ్రవరి మధ్య అనుమతులు లభించాయి. ఏపీఎస్‌బీసీఎల్‌ ఈ బ్రాండ్లనే ఎక్కువగా కొనుగోలు చేసింది.

ఇవీ చదవండి:

సర్కారు ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన మద్యం.. వైకాపా ప్రభుత్వం వచ్చాక అధికార పార్టీ కీలక నేతలకూ కాసులు కురిపిస్తోందన్న విమర్శలు హోరెత్తుతున్నాయి. కొందరు నేతలు, అధికార పార్టీ వారికి చెందిన డిస్టిలరీలు, వారి మెప్పు పొందిన కంపెనీల బ్రాండ్లే భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) వద్ద మద్యం సరఫరాకు దాదాపు 100 కంపెనీలు నమోదై ఉన్నాయి. వీటిలో 16 కంపెనీలపైనే ఏపీఎస్‌బీసీఎల్‌ అంతులేని ప్రేమ కనబరిచింది. 2019 అక్టోబరు 2 నుంచి 2021 నవంబరు 30 మధ్య 73.92% మద్యం సరఫరా ఆర్డర్లను ఆ సంస్థలకే కట్టబెట్టింది. విలువ ప్రకారం చూస్తే అది 62 శాతం. వీటిలో అత్యధికం అధికార పార్టీకి చెందిన, ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉన్న వారివేననే ప్రచారం ఉంది.

2019 డిసెంబరు 2న ‘అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ అనే సంస్థ హైదరాబాద్‌లో ఊపిరి పోసుకుంది. సొంతంగా ఒక్క డిస్టిలరీ కూడా లేని ఈ సంస్థకు రెండేళ్లలోనే రూ.1164 కోట్ల విలువైన 68 లక్షల కేసుల మద్యం సరఫరాకు ఓఎఫ్‌ఎస్‌లు ఇవ్వడం గమనార్హం.

.

‘మద్యం అధికార పార్టీ కీలక నేతలకు కాసులు కురిపిస్తోంది.. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి, ఏపీఎస్‌బీసీఎల్‌లోని ఓ ఉన్నతాధికారి కనుసన్నల్లోనే మొత్తం మద్యం వ్యాపారం నడుస్తోంది.. ఏ కంపెనీ నుంచి, ఏ బ్రాండు మద్యాన్ని ఎంత కొనాలో వారే నిర్ణయిస్తున్నారు’.. అని ప్రతిపక్షాలు తొలి నుంచీ ఆరోపిస్తున్నాయి. ఈ వాదనలకు బలం చేకూర్చేలాగానే ఏపీఎస్‌బీసీఎల్‌ మద్యం సరఫరా ఆర్డర్లు ఇస్తోంది. సొంత డిస్టిలరీలు లేకున్నా వేరేవాటిని సబ్‌లీజుకు తీసుకుని తమ బ్రాండ్ల మద్యం తయారు చేయించుకున్న కంపెనీలకూ, ప్రభుత్వం మద్యం వ్యాపార నిర్వహణ ప్రారంభించిన రెండు నెలల తర్వాత పుట్టిన కంపెనీకీ, అధికార పార్టీ ప్రజాప్రతినిధి గుప్పిట్లో ఉందనే ప్రచారమున్న సంస్థకూ భారీ మొత్తాల్లో ఆర్డర్లు లభించాయి. తమిళనాడు వారి యాజమాన్యంలో ఉన్న కొన్ని కంపెనీలకు భారీగానే మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాయి. సమాచార హక్కు ద్వారా సేకరించిన ఈ వివరాల్ని విశ్లేషించి.. ఆ కంపెనీలు ఎవరివని ఆరా తీస్తే ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.

ఆ 16 కంపెనీలకే రూ.11,040.65 కోట్లు..

2019 అక్టోబరు 2 నుంచి 2021 నవంబరు 30 మధ్య 25 నెలల్లో ఏపీఎస్‌బీసీఎల్‌ వివిధ కంపెనీలకు.. రూ.17,570.49 కోట్ల విలువైన 10.28 కోట్ల కేసుల మద్యం సరఫరాకు ఆర్డర్లు (ఓఎఫ్‌ఎస్‌) ఇచ్చింది. అందులో రూ.11,040.65 కోట్ల విలువైన 7.60 కోట్ల కేసుల మద్యం సరఫరాకు ఎస్‌ఎన్‌జీ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బ్రూవరీస్‌ డివిజన్‌), ఎస్‌ఎన్‌జీ షుగర్స్‌ అండ్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బీఆర్‌కే స్పిరిట్స్‌, రాడికో ఖైతాన్‌, పెరల్‌ డిస్టిలరీస్‌ లిమిటెడ్‌, ఎంఎస్‌ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బీఆర్‌కే స్పిరిట్స్‌, శార్వాణి ఆల్కో బ్రూవరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సెంటినీ బయోప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అంబర్‌ స్పిరిట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బీడీహెచ్‌ ఆగ్రో వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, లీలా డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జేఆర్‌ అసోసియేట్స్‌ కంపెనీ, ఈగల్‌ డిస్టిలరీ కంపెనీ లిమిటెడ్‌లకే ఆర్డర్లు దక్కాయి.

.

కొత్త మద్యం విధానం వచ్చాక ఏర్పాటైన కంపెనీకి రూ.1,164 కోట్ల ఆర్డర్లు..

* వైకాపా అధికారంలోకి వచ్చాక.. 2019 అక్టోబరు 2 నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రైవేటు వ్యాపారుల చేతిలో ఉన్న మద్యం దుకాణాల్ని ప్రభుత్వమే నిర్వహించటం ప్రారంభించింది. కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన రెండు నెలల తర్వాత 2019 డిసెంబరు 2న ‘అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ అనే సంస్థ హైదరాబాద్‌లో ఊపిరి పోసుకుంది.

* ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన కాశీచాయనుల శ్రీనివాసులు.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్న శ్రేయాస్‌ బయోలాజికల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 2021లో 5 నెలలు (జనవరి నుంచి జూన్‌ వరకూ) డైరెక్టర్‌గా వ్యవహరించారు.

* సొంతంగా ఒక్క డిస్టిలరీ కూడా లేని ఈ సంస్థకు రెండేళ్లలోనే (2019 డిసెంబరు 2 నుంచి 2021 నవంబరు 30 మధ్య) రూ.1164.86 కోట్ల విలువైన 68.02 లక్షల కేసుల మద్యం సరఫరాకు ఓఎఫ్‌ఎస్‌లు ఇవ్వడం గమనార్హం.

వేరే డిస్టిలరీలు సబ్‌లీజుకు తీసుకుని..

* సొంత డిస్టిలరీలు లేకపోవడంతో అదాన్‌ సంస్థ.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల రాజేష్‌ 2020 నవంబరు 10 వరకూ డైరెక్టర్‌గా కొనసాగిన విశాఖ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్‌కుమార్‌కు సంబంధించిన పీఎంకే డిస్టిలేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌లను సబ్‌లీజుకు తీసుకుని తమ కంపెనీ బ్రాండ్ల మద్యం తయారు చేయిస్తోంది.

* ఏసీ బ్లాక్‌ రిజర్వ్‌ విస్కీ, అదాన్స్‌ సుప్రీం బ్లెండ్‌ సుపీరియర్‌ గ్రెయిన్‌ విస్కీ, అరిస్టోక్రాట్‌ ప్రీమియం క్లాసిక్‌ విస్కీ బ్రాండ్లు ఉత్పత్తి చేస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కొన్నాళ్లపాటు ఈ కంపెనీ బ్రాండ్ల మద్యాన్ని మాత్రమే అమ్మాలని సిబ్బందికి లక్ష్యాలు కూడా విధించడం గమనార్హం.

అధికార పార్టీ కీలకనేత గుప్పిట్లోని కంపెనీకి రూ.1,863 కోట్ల ఆర్డర్లు

* రాయలసీమలోని ఓ దివంగత నేతకు చెందిన కంపెనీకి రూ.1,863 కోట్ల విలువైన మద్యం సరఫరాకు ఆర్డర్లు దక్కాయి. దీని వెనుక పెద్ద కథే ఉంది. వైకాపా అధికారం చేపట్టిన అప్పటి నుంచి ఆ కంపెనీ.. అధికార పార్టీలో చక్రం తిప్పే, అత్యంత సీనియర్‌ నేత అయిన ప్రజాప్రతినిధి కుమారుడి ఆధీనంలోకి వెళ్లిపోయింది. అతనూ ప్రస్తుతం ప్రజాప్రతినిధే. ఆ నాయకుడి గుప్పిట్లోనే ఇప్పుడు అక్కడ రకరకాల బ్రాండ్లు తయారవుతున్నాయి.

* ఈ కంపెనీకి 25 నెలల్లో (2019 అక్టోబరు 2 - 2021 నవంబరు 30) 1.16 కోట్ల కేసుల మద్యం సరఫరాకు ఏపీఎస్‌బీసీఎల్‌ ఆర్డర్లు ఇచ్చింది. వీటి విలువ ఏకంగా రూ.1,863.12 కోట్లు.

ఒకే ప్రాంగణం, చిరునామాతో ఉన్న రెండు కంపెనీలకు రూ.774.71 కోట్ల విలువైన ఆర్డర్లు..

.

* ఎంఎస్‌ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జేఆర్‌ అసోసియేట్స్‌ కంపెనీలు రెండూ ఒకే ప్రాంగణంలో, ఒకే భవనంలో నడుస్తున్నాయి. ఎంఎస్‌ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ సాగర్‌ సొసైటీలోని ప్లాట్‌ నంబర్‌-64, రోడ్డు నంబర్‌-2 చిరునామాతో ఉండగా, జేఆర్‌ అసోసియేట్స్‌ అనే మరో కంపెనీ ప్లాట్‌ నంబర్‌ 64/ఏ, స్ట్రీట్‌ నంబర్‌-1, రోడ్డు నంబర్‌-2 సాగర్‌ సొసైటీ, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌ చిరునామాతో ఉంది. అయితే ఈ రెండు చిరునామాలు ఒకే భవనానికి సంబంధించినవిగా ‘ఈనాడు’ పరిశీలనలో తేలింది. ఈ రెండు కంపెనీల యజమాని పేరు జైపాల్‌రెడ్డే. ఈ రెండింటికీ కలిపి ఏపీఎస్‌బీసీఎల్‌ ఏకంగా రూ.774.71 కోట్ల విలువైన మద్యం సరఫరాకు ఆర్డర్లు ఇచ్చింది.

* ఎంఎస్‌ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.585.57 కోట్ల విలువైన 28.63 లక్షల కేసుల మద్యం సరఫరా కోసం ఆర్డర్లు దక్కాయి. అమిరెడ్డి జైపాల్‌రెడ్డి, అమిరెడ్డి స్నేహారెడ్డి, యోగేష్‌కుమార్‌ జాజులు ఈ కంపెనీలో డైరెక్టర్లు. ఈ కంపెనీ కూడా ఏపీలోని బీడీహెచ్‌ ఆగ్రో వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, విశాఖ డిస్టిలరీస్‌, బీఆర్‌కే స్పిరిట్స్‌, సోరింగ్‌ స్పిరిట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డిస్టిలరీల్లో వివిధ రకాల మద్యం బ్రాండ్లు తయారు చేసి.. ఏపీఎస్‌బీసీఎల్‌కు సరఫరా చేస్తోంది.

* ఈ కంపెనీ సరఫరా చేసే మేన్షన్‌ హౌస్‌ ట్రూ స్పిరిట్‌ ఫ్రెంచ్‌ బ్రాందీ, మంజీరా క్లాసిక్‌ రిజర్వ్‌ విస్కీ, టీఐ మేన్షన్‌ హౌస్‌ అథెంటిక్‌ ప్రీమియం ఫ్రెంచ్‌ బ్రాందీ, టీఐ మేన్షన్‌ హౌస్‌ రేరేస్ట్‌ స్పిరిట్‌ ఫ్రెంచ్‌ బ్రాందీ కోసం ఎక్కువగా ఏపీఎస్‌బీసీఎల్‌ ఆర్డర్లు ఇచ్చింది. వీటిలో టీఐ మేన్షన్‌ హౌస్‌ ట్రూ స్పిరిట్‌ ఫ్రెంచ్‌ బ్రాందీ, టీఐ కొరియర్‌ నెపోలియన్‌ గ్రీన్‌ సెయింట్‌ మిలియన్‌ ప్రీమియం ఫ్రెంచ్‌ బ్రాందీ సరఫరాకు ఏపీఎస్‌బీసీఎల్‌ నుంచి భారీగా ఆర్డర్లు దక్కాయి.

* జేఆర్‌ అసోసియేట్స్‌ కంపెనీ విశాఖ డిస్టిలరీస్‌ను సబ్‌ లీజుకు తీసుకుని మంజీరా క్లాసిక్‌ రిజర్వ్‌ విస్కీని ఉత్పత్తి చేస్తోంది. ఆ ఒక్క బ్రాండ్‌వే రూ.189.14 కోట్ల విలువైన 13.02 లక్షల కేసుల సరఫరాకు అనుమతులు దక్కడం గమనార్హం.

తమిళనాడుకు చెందిన ఎస్‌ఎన్‌జే కంపెనీలకు రూ.1,996.66 కోట్లు..

* ఎస్‌ఎన్‌జే 10000 స్పెషల్‌ సూపర్‌ స్ట్రాంగ్‌ బీర్‌, బ్రిటిష్‌ ఎంపైర్‌ అల్ట్రా ప్రీమియం స్ట్రాంగ్‌ బీర్‌, రాయల్‌ ప్యాలెస్‌ వీఎస్‌వోపీ బ్రాందీ, జీసీ గ్రీన్‌ ఛాయిస్‌ సుపీరియర్‌ విస్కీ, మల్బార్‌ హౌస్‌ వీఎస్‌వోపీ బ్రాందీ.. ఇవేవీ గతంలో పెద్దగా ప్రాచుర్యంలో లేవు. ఏపీలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మాత్రం మూడేళ్లుగా ఈ బ్రాండ్లు ఎక్కువగానే అమ్ముతున్నారు. తమిళనాడువాసులకు చెందిన ఎస్‌ఎన్‌జీ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బ్రూవరీస్‌ డివిజన్‌), ఎస్‌ఎన్‌జీ షుగర్స్‌ అండ్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ కంపెనీలు ఈ బ్రాండ్లు ఉత్పత్తి చేస్తున్నాయి.

* ఈ రెండు కంపెనీలకు కలిపి రూ.1996.66 కోట్ల విలువైన 2.12 కోట్ల కేసుల మద్యం సరఫరాకు ఏపీఎస్‌బీసీఎల్‌ ఆర్డర్లు ఇచ్చింది. ఎస్‌ఎన్‌జే షుగర్స్‌ అండ్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ తయారు చేసే.. జీసీ గ్రీన్‌ ఛాయిస్‌ సుపీరియర్‌ విస్కీ బ్రాండుకు వైకాపా అధికారంలోకి వచ్చాకే అనుమతిచ్చారు. ఈ ఒక్క బ్రాండుకే రూ.384.36 కోట్ల విలువైన 32.06 లక్షల కేసుల సరఫరా కోసం ఏపీఎస్‌బీసీఎల్‌ ఆర్డర్లు ఇవ్వడం గమనార్హం. అధికార పార్టీలోని కొందరు పెద్దలతో ఉన్న సంబంధాల వల్లే వీరికి ఇంత పెద్ద మొత్తంలో ఆర్డర్లు దక్కాయన్న ప్రచారం ఉంది.

* పుదుచ్చేరికి చెందిన లీలా డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి రూ.198.62 కోట్ల విలువైన మద్యం సరఫరా కోసం ఏపీఎస్‌బీసీఎల్‌ ఆర్డర్లు ఇచ్చింది. ఈ కంపెనీ తయారుచేసే లీలాస్‌ బ్రిలియంట్‌ బ్లెండ్‌ సూపర్‌ గ్రెయిన్‌ విస్కీ 9.83 లక్షల కేసుల సరఫరాకు ఆర్డర్లు దక్కాయి. ఎస్‌ఎన్‌జే షుగర్స్‌ అండ్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌, ఎస్‌ఎన్‌జే డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బ్రూవరీస్‌ డివిజన్‌)లో డైరెక్టర్లుగా ఉన్న గీతా జయమురుగన్‌ 2020 ఫిబ్రవరి 26 వరకూ, నాగలింగం జయమురుగన్‌ 2022 మార్చి 1 వరకూ లీలా డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లోనూ డైరెక్టర్లుగా కొనసాగారు.

పెరల్‌ డిస్టిలరీస్‌ కంపెనీలకు రూ.931.32 కోట్లు..

* ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఉన్న పెరల్‌ డిస్టిలరీస్‌ లిమిటెడ్‌ కంపెనీకి రూ.427.09 కోట్ల విలువైన 25.41 లక్షల మద్యం కేసుల సరఫరాకు, పెరల్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ కంపెనీకి రూ.504.22 కోట్ల విలువైన 28.77 లక్షల మద్యం కేసుల సరఫరాకు ఆర్డర్లు ఇచ్చారు. ఆ రెండు కంపెనీల పేరిటే రూ.931.32 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కాయి. మాగుంట పార్వతమ్మ ఈ కంపెనీలో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

* రాడికో ఖైతాన్‌ లిమిటెడ్‌ కంపెనీకి రూ.948.64 కోట్ల విలువైన 51 లక్షల మద్యం కేసుల సరఫరాకు ఆర్డర్లు ఇచ్చారు. సెంటినీ బయో ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పీఎంకే డిస్ట్టిలేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మోహన్‌ బ్రూవరీస్‌, బీఆర్‌కే స్పిరిట్స్‌ కంపెనీలను సబ్‌లీజుకు తీసుకుని వారి మద్యం బ్రాండ్లు తయారు చేశారు.

* ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం దావులూరు గ్రామంలోని బీఆర్‌కే స్పిరిట్స్‌ కంపెనీకి రూ.1041.15 కోట్ల విలువైన 77.24 లక్షల మద్యం కేసుల సరఫరాకు ఆర్డర్లు ఇచ్చారు.

* ఉమ్మడి కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని శార్వాణి ఆల్కో బ్రూవరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి రూ.426.64 కోట్ల విలువైన 30.23 లక్షల కేసుల కేసుల మద్యం సరఫరాకు ఆర్డర్లు లభించాయి. ఈ కంపెనీని హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఈ.చంద్రారెడ్డి నిర్వహిస్తున్నారు.

* ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సెంటినీ బయోప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి రూ.393.40 కోట్ల విలువైన 25.89 లక్షల కేసుల సరఫరా ఆర్డర్లు లభించాయి.

* అంబర్‌ స్పిరిట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి రూ.475.99 కోట్ల విలువైన 33.09 లక్షల కేసుల సరఫరాకు ఏపీఎస్‌బీసీఎల్‌ ఆర్డర్లు ఇచ్చింది.

* తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలోని బీడీహెచ్‌ ఆగ్రో వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి 24.99 లక్షల కేసుల మద్యం సరఫరాకు ఆర్డర్లు దక్కాయి. వీటి విలువ రూ.322.78 కోట్లు.

* ఈగల్‌ డిస్టిలరీస్‌కు రూ.532.46 కోట్ల విలువైన 41.74 లక్షల కేసుల మద్యం సరఫరాకు ఆర్డర్లు ఇచ్చారు.

* నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చాక ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌లో ఎస్పీవై హెచ్‌డీ గోల్డ్‌ విస్కీ, ఎస్పీవై గెలాక్సీ ప్యూర్‌ గ్రెయిన్‌ విస్కీ, ఎస్పీవై గెలాక్సీ బ్రాందీ, ఎస్పీవై హెచ్‌డీ గోల్డ్‌ బ్రాందీ, ఎస్పీవై ఛాంపియన్‌ స్పెషల్‌ విస్కీ బ్రాండ్లకు 2019 అక్టోబరు 2 నుంచి 2020 ఫిబ్రవరి మధ్య అనుమతులు లభించాయి. ఏపీఎస్‌బీసీఎల్‌ ఈ బ్రాండ్లనే ఎక్కువగా కొనుగోలు చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.