ETV Bharat / city

మనీలాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు! - మనీలాలో చిక్కుకున్న 90 మంది తెలుగు విద్యార్థులు

కరోనా ప్రభావంతో భారత్‌కు వచ్చే విమానాలు రద్దు కావటంతో.. ఫిలిప్పైన్స్‌లోని మనీలా విమానాశ్రయంలో సుమారు వంద మంది భారతీయ విద్యార్థులు అక్కడే చిక్కుకున్నారు. మనీలాలో చిక్కుకున్న వారిలో చాలా మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. వారిని భారత్ కు రప్పించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

telugu-students-trubles-in-manila
telugu-students-trubles-in-manila
author img

By

Published : Mar 19, 2020, 4:22 AM IST

Updated : Mar 19, 2020, 9:06 AM IST

మనీలాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు!
కరోనా వ్యాప్తితో.. ఫిలిప్పైన్స్‌లోని పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలల విద్యార్ధులకు అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. విదేశీ విద్యార్థులను 72 గంటల్లోగా స్వదేశాలకు వెళ్లిపోవాలని సూచించింది. దీని వల్ల వందలాది మంది విద్యార్థులు స్వస్థలాలకు రావడానికి విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ కరోనా వ్యాప్తితో పలు దేశాల నుంచి భారత్​కు వచ్చే విమానాలను నిలిపివేశారు. అధికారులు స్పందించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఫిలిప్పైన్స్‌లోని మనీలా విమానాశ్రయంలో సుమారు 90 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారు. తాము మనీలాలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు స్పందించాలని విద్యార్థులు కోరుతున్నారు. తమ తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా సెలవులు ప్రకటించిన అక్కడి కళాశాలల యాజమాన్యం గురువారం సాయంత్రంలోపు ఖాళీచేయాలని లేనిపక్షంలో నిర్భంధిస్తామని విద్యార్థులకు హెచ్చరికలు జారీచేసింది. అంతే కాక అనుమతి లేకుండా వీధుల్లో తిరగొద్దని హెచ్చరించింది.

వీరంతా కౌలాలంపూర్‌ మీదుగా భారత్‌కు వచ్చేందుకు ఎయిర్ ఏషియా ఇండియా విమాన సర్వీసులో టిక్కెట్లు బుక్‌ చేసుకున్నారు. ఆయా దేశాల నుంచి భారత్‌కు వచ్చే విమాన సర్వీసులన్నీ మంగళవారం నుంచే రద్దు కావటంతో తెలుగు విద్యార్థులంతా మనీలా విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, అనంతపురం... తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్‌ తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. మరికొన్ని గంటల వ్యవధిలో మనీలా విమానాశ్రయాన్ని అక్కడి ప్రభుత్వం షట్‌డౌన్‌ చేయనుంది. దీనిపై విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి: కరోనా ఎఫెక్ట్ : రాష్ట్రంలో రేపట్నుంచి విద్యాసంస్థలకు సెలవులు

మనీలాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు!
కరోనా వ్యాప్తితో.. ఫిలిప్పైన్స్‌లోని పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలల విద్యార్ధులకు అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. విదేశీ విద్యార్థులను 72 గంటల్లోగా స్వదేశాలకు వెళ్లిపోవాలని సూచించింది. దీని వల్ల వందలాది మంది విద్యార్థులు స్వస్థలాలకు రావడానికి విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ కరోనా వ్యాప్తితో పలు దేశాల నుంచి భారత్​కు వచ్చే విమానాలను నిలిపివేశారు. అధికారులు స్పందించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఫిలిప్పైన్స్‌లోని మనీలా విమానాశ్రయంలో సుమారు 90 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారు. తాము మనీలాలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు స్పందించాలని విద్యార్థులు కోరుతున్నారు. తమ తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా సెలవులు ప్రకటించిన అక్కడి కళాశాలల యాజమాన్యం గురువారం సాయంత్రంలోపు ఖాళీచేయాలని లేనిపక్షంలో నిర్భంధిస్తామని విద్యార్థులకు హెచ్చరికలు జారీచేసింది. అంతే కాక అనుమతి లేకుండా వీధుల్లో తిరగొద్దని హెచ్చరించింది.

వీరంతా కౌలాలంపూర్‌ మీదుగా భారత్‌కు వచ్చేందుకు ఎయిర్ ఏషియా ఇండియా విమాన సర్వీసులో టిక్కెట్లు బుక్‌ చేసుకున్నారు. ఆయా దేశాల నుంచి భారత్‌కు వచ్చే విమాన సర్వీసులన్నీ మంగళవారం నుంచే రద్దు కావటంతో తెలుగు విద్యార్థులంతా మనీలా విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, అనంతపురం... తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్‌ తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. మరికొన్ని గంటల వ్యవధిలో మనీలా విమానాశ్రయాన్ని అక్కడి ప్రభుత్వం షట్‌డౌన్‌ చేయనుంది. దీనిపై విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి: కరోనా ఎఫెక్ట్ : రాష్ట్రంలో రేపట్నుంచి విద్యాసంస్థలకు సెలవులు

Last Updated : Mar 19, 2020, 9:06 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.