ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 1321 కరోనా కేసులు.. ఐదుగురు మృతి

author img

By

Published : Apr 4, 2021, 12:01 PM IST

తెలంగాణలో కొత్తగా 1321 మందికి కరోనా సోకింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 3,12,140కి చేరింది. వైరస్ బారిన పడి మరో ఐదుగురు మృతి చెందారు.

corona cases in ap
కరోనా వైరస్

తెలంగాణలో కరోనా రెండో దశ వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 8వేలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో 62,973 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,321 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 3,12,140కి చేరింది. ప్రస్తుతం 7,923 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తాజాగా కరోనాతో ఐదుగురు మృతి చెందగా.. ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,717కు చేరింది. 293 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,886 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా 320 కరోనా కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కరోనా రెండో దశ వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 8వేలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో 62,973 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,321 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 3,12,140కి చేరింది. ప్రస్తుతం 7,923 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తాజాగా కరోనాతో ఐదుగురు మృతి చెందగా.. ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,717కు చేరింది. 293 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,886 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా 320 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:

వైకాపా జడ్పీ ఛైర్మన్‌ అభ్యర్థుల ఎంపిక పూర్తి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.