ఏపీ ప్రభుత్వం....తెలంగాణలో చిచ్చుపెట్టాలని చూస్తోందని ఆ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. జగన్ పార్టీ...భాజపాకు బి టీమ్గా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ సర్కారుతో అనవసరంగా తగాదా పెట్టుకుంటున్నారన్న గంగుల....జగన్ పాలనా వైఫల్యం వల్లే తెలంగాణకు వలసలు పెరిగాయన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి... వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించిన గంగుల....హరీష్రావుపై అభ్యంతరకర వ్యాఖ్యలతో...కేసీఆర్ కుటుంబాన్ని ఎవరూ విడదీయలేరన్నారు. సజ్జల తమతో ఎందుకు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం జోలికి వస్తే దాడులు చేస్తామని హెచ్చరించిన గంగుల... రెచ్చగొడితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయన్నారు.
"తెలంగాణలో ఏపీ ప్రభుత్వం చిచ్చు పెట్టాలని చూస్తోంది. భాజపాకు బి టీంగా వైకాపా వ్యవహరిస్తోంది. తెలంగాణ సర్కారుతో అనవసరంగా తగాదా పెట్టుకుంటున్నారు. వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి యత్నం. తల్లి, కుమారుడు; అన్నా చెల్లెల్లను విడదీసేందుకు యత్నిస్తున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ఎవరూ విడదీయలేరు. హరీశ్రావును టార్గెట్ చేసి ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ, తెరాసపై ఎందుకు విషం చిమ్ముతున్నారు. మా సీఎం, ప్రభుత్వం జోలికి వస్తే తీవ్రంగా స్పందిస్తాం. కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై మాట్లాడేవాళ్లకు హెచ్చరిస్తున్నా. మా జోలికి రాకండి..రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. జగన్ ప్రభుత్వ వైఫల్యాల వల్లే తెలంగాణకు వలసలు పెరిగాయి. ఒత్తిడిలో ఉన్న సజ్జల.. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు." -గంగుల కమలాకర్, తెలంగాణ మంత్రి
ఇవీ చదవండి: