కరోనా కేసుల పెరుగుదలలో ఏపీ దేశంలోనే 3వ స్థానంలో ఉందన్న ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు వ్యాఖ్యానించారు. టీకా పంపిణీలో మాత్రం దేశంలోనే అట్టడుగున ఉందని విమర్శించారు. వ్యాక్సినేషన్లో ముందున్నామని ప్రభుత్వం అబద్దపు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో టీకా పంపిణీ ప్రక్రియ మందకొడిగా సాగుతోందన్నారు.
రాజకీయ కక్షసాధింపు చర్యలకే ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయలు శూన్యమని వ్యాఖ్యానించారు. ఫ్రంట్ లైన్స్ వారియర్స్ ను ప్రభుత్వం వైద్య సేవలకు వాడుకుని రోడ్డున పడేసిందన్నారు. వేతనాల కోసం ఆందోళనలు చేస్తే లాఠీచార్జ్లు చేయటం దుర్మార్గమని మండిపడ్డారు.
ఇదీ చదవండీ.. EX MLA DEAD: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి మృతి