ETV Bharat / city

Srikakulam Collectorate: ఉపాధి బిల్లులను తక్షణమే విడుదల చేయాలి: తెదేపా - ఉపాధీ హామీ పథకం

శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్​ ఎదుట తెదేపా నేతల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తెదేపా హయాంలో జరిగిన పనులకు తక్షణమే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

tdp
tdp
author img

By

Published : Jul 13, 2021, 8:42 PM IST

ఉపాధి హామీ బిల్లులను చెల్లించకుండా వైకాపా ప్రభుత్వం నీచ సంస్కృతికి తెర తీసిందని తెదేపా నేతలు ఆరోపించారు. బిల్లుల అంశంపై శ్రీకాకుళం కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి కళా వెంకట్రావ్, ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్​ కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడినే నేతలు ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. తెదేపా పాలనలో జరిగిన ఉపాధి పనుల బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడూ నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ.. జగన్ ప్రభుత్వం రాజకీయ కక్షతో నిధులను ఆపుతున్నారని ఆరోపించారు. ఉపాధి హామీతో పాటు ఇళ్లు, నీటి సంఘాల నిధులను వెంటనే ఇవ్వాలన్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్​కు లేఖ ఇచ్చేందుకు వచ్చామని.. కానీ కలెక్టర్​ అపాయింట్​మెంట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. రాజకీయాలకు అతీతంగా అధికారులు పని చేయాలని హితవు పలికారు.

ఉపాధి హామీ బిల్లులను చెల్లించకుండా వైకాపా ప్రభుత్వం నీచ సంస్కృతికి తెర తీసిందని తెదేపా నేతలు ఆరోపించారు. బిల్లుల అంశంపై శ్రీకాకుళం కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి కళా వెంకట్రావ్, ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్​ కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడినే నేతలు ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. తెదేపా పాలనలో జరిగిన ఉపాధి పనుల బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడూ నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ.. జగన్ ప్రభుత్వం రాజకీయ కక్షతో నిధులను ఆపుతున్నారని ఆరోపించారు. ఉపాధి హామీతో పాటు ఇళ్లు, నీటి సంఘాల నిధులను వెంటనే ఇవ్వాలన్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్​కు లేఖ ఇచ్చేందుకు వచ్చామని.. కానీ కలెక్టర్​ అపాయింట్​మెంట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. రాజకీయాలకు అతీతంగా అధికారులు పని చేయాలని హితవు పలికారు.

ఇదీ చదవండి

Payyavula Keshav: రూ.25 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీలను తెలియకుండా దాచారు: పయ్యావుల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.