ETV Bharat / city

'కార్యదర్శిపై ఛైర్మన్​ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది'

author img

By

Published : Feb 17, 2020, 2:15 PM IST

Updated : Feb 17, 2020, 3:01 PM IST

సెలెక్ట్ కమిటీ దస్త్రాన్ని రెండు సార్లు తిప్పిపంపిన నేపథ్యంలో...కార్యదర్శిపై మండలి ఛైర్మన్ చర్యలు తీసుకునే అవకాశం కల్పించినట్లు అయ్యిందని తెదేపా నేత యనమల అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఛైర్మన్ ఎలా వ్యవహరిస్తారో చూడాలని అన్నారు. ఐటీ సోదాలపై మాట్లాడుతున్న వైకాపా నేతలు...జగన్ కేసులో ఈడీ జప్తు చేసిన 43వేల కోట్లపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

tdp leader yanamala On Select Comittee
tdp leader yanamala On Select Comittee

సెలక్ట్ కమిటీ దస్త్రాన్ని మళ్లీ వెనక్కి పంపటం ద్వారా అసెంబ్లీ కార్యదర్శిపై చర్యలు తీసుకునే అధికారం ఛైర్మన్ కు ఉంటుందని మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. కమిటీ ఏర్పాటును అడ్డుకునేలా ప్రభుత్వం అంతలా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సీఆర్డీఏ రద్దు బిల్లు, రాజధానుల ఏర్పాటుపై మండలిలో సరైన సమాధానం ఇవ్వలేకపోయిందని విమర్శించారు. శాసనమండలి రద్దు అంశంపై త్వరలోనే దిల్లీకి తెదేపా ఎమ్మెల్సీలకు బృందం వెళుతుందని తెలిపారు. రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

మీడియాతో మాట్లాడుతున్న యనమల

జప్తు చేసిన ఆస్తుల సంగతేంటి..?

ఐటీ దాడుల అంశంపై చంద్రబాబు, లోకేశ్ స్పందించాలని వైకాపా నేతలు డిమాండ్ చేయడంపై యనమల స్పందించారు. కేంద్ర దర్యాప్తు బృందాలు... జగన్ కు చెందిన 43వేల కోట్ల రూపాయలను జప్తు చేశాయని, ఆ విషయంపై జగన్ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ఐటీ సోదాలపై స్పందించాల్సిన అవసరం చంద్రబాబు, లోకేశ్ కు లేదన్నారు.

ఇదీ చదవండి : 'నిధులు మళ్లించి ప్రభుత్వం బీసీల పొట్టగొడుతోంది'

సెలక్ట్ కమిటీ దస్త్రాన్ని మళ్లీ వెనక్కి పంపటం ద్వారా అసెంబ్లీ కార్యదర్శిపై చర్యలు తీసుకునే అధికారం ఛైర్మన్ కు ఉంటుందని మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. కమిటీ ఏర్పాటును అడ్డుకునేలా ప్రభుత్వం అంతలా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సీఆర్డీఏ రద్దు బిల్లు, రాజధానుల ఏర్పాటుపై మండలిలో సరైన సమాధానం ఇవ్వలేకపోయిందని విమర్శించారు. శాసనమండలి రద్దు అంశంపై త్వరలోనే దిల్లీకి తెదేపా ఎమ్మెల్సీలకు బృందం వెళుతుందని తెలిపారు. రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

మీడియాతో మాట్లాడుతున్న యనమల

జప్తు చేసిన ఆస్తుల సంగతేంటి..?

ఐటీ దాడుల అంశంపై చంద్రబాబు, లోకేశ్ స్పందించాలని వైకాపా నేతలు డిమాండ్ చేయడంపై యనమల స్పందించారు. కేంద్ర దర్యాప్తు బృందాలు... జగన్ కు చెందిన 43వేల కోట్ల రూపాయలను జప్తు చేశాయని, ఆ విషయంపై జగన్ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ఐటీ సోదాలపై స్పందించాల్సిన అవసరం చంద్రబాబు, లోకేశ్ కు లేదన్నారు.

ఇదీ చదవండి : 'నిధులు మళ్లించి ప్రభుత్వం బీసీల పొట్టగొడుతోంది'

Last Updated : Feb 17, 2020, 3:01 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.