ETV Bharat / city

'సరైన సమయంలో కేంద్రం జోక్యం'

author img

By

Published : Jan 18, 2020, 1:15 PM IST

రాజధాని తరలింపు అంశంపై కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందని ఎంపీ సుజనా చౌదరి అన్నారు. మూడు రాజధానులపై ముందుకెళ్తే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు.

sujana chowdary on capital issue
మూడు రాజధానులపై ఎంపీ సుజనా చౌదరి
మూడు రాజధానులపై ఎంపీ సుజనా చౌదరి

మూడు రాజధానులపై ముందుకెళ్తే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఎంపీ సుజనా చౌదరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచి పద్ధతి కాదని సూచించారు. ఎయిమ్స్‌, నిఫ్ట్‌ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్రానికి వచ్చాయని.. ఇకనైనా వైకాపా ప్రభుత్వం పరిపాలన వైపు దృష్టి సారించాలన్నారు.

సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా అని సుజనాచౌదరి ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు. హైకోర్టు, సచివాలయం, రాజ్‌భవన్‌ వంటివి ఒకేచోట ఉండాలని విభజన చట్టం సెక్షన్‌ 6లో చెప్పారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందన్నారు.

రాజధాని నిర్మిస్తామని చెప్పడం వల్లే రైతులు భూములు ఇచ్చారని.. రైతులను మోసం చేయడం మంచి పద్ధతి కాదని మండిపడ్డారు. సచివాలయం కాదు కదా... అమరావతి నుంచి ఏదీ మార్చడానికి కుదరదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

ఎల్లుండి అసెంబ్లీ ప్రత్యేక భేటీ..అధికారుల ప్రత్యేక చర్యలు

మూడు రాజధానులపై ఎంపీ సుజనా చౌదరి

మూడు రాజధానులపై ముందుకెళ్తే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఎంపీ సుజనా చౌదరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచి పద్ధతి కాదని సూచించారు. ఎయిమ్స్‌, నిఫ్ట్‌ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్రానికి వచ్చాయని.. ఇకనైనా వైకాపా ప్రభుత్వం పరిపాలన వైపు దృష్టి సారించాలన్నారు.

సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా అని సుజనాచౌదరి ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు. హైకోర్టు, సచివాలయం, రాజ్‌భవన్‌ వంటివి ఒకేచోట ఉండాలని విభజన చట్టం సెక్షన్‌ 6లో చెప్పారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందన్నారు.

రాజధాని నిర్మిస్తామని చెప్పడం వల్లే రైతులు భూములు ఇచ్చారని.. రైతులను మోసం చేయడం మంచి పద్ధతి కాదని మండిపడ్డారు. సచివాలయం కాదు కదా... అమరావతి నుంచి ఏదీ మార్చడానికి కుదరదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

ఎల్లుండి అసెంబ్లీ ప్రత్యేక భేటీ..అధికారుల ప్రత్యేక చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.