ETV Bharat / city

ఇంట్లో రోజుకో చోట మంటలు.. కారణం తెలియదు!

ఆ ఇంట్లో అనుకోని రీతిలో మంటలు చెలరేగుతున్నాయి. ఎక్కడినుంచి ఎలా వస్తున్నాయో తెలియక 4 రోజులుగా వారంతా కంటిమీద కునుకు లేకుండా చెట్టు కిందే ఉంటున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో అర్థం కాక ఆ ఇంటివారంతా ఆందోళనకు గురవుతున్నారు.

author img

By

Published : May 9, 2020, 1:36 PM IST

Updated : May 9, 2020, 2:51 PM IST

telengana
ఇంట్లో రోజుకో చోట మంటలు.. కారణం తెలిదు!
ఇంట్లో రోజుకో చోట మంటలు.. కారణం తెలియదు!

తెలంగాణలోని మహబూబాబాద్​ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంలోని వేములపల్లి రాజు కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. 4 రోజుల క్రితం ఆ ఇంట్లో మంటలు చెలరేగి టీవీ, మొబైల్ ఫోన్, సెల్ఫ్​లో చెద్దర్లు కాలిపోయాయి. మంటలను గమనించిన ఇంట్లోని వారు వెంటనే మంటలను ఆర్పివేశారు. రెండవ రోజు కిచెన్​లో, వరండాలోని ఫ్రిజ్​పైన ఉన్న దుస్తులు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ తో కాలిపోతున్నాయని వారు భావించారు.

వెంటనే ఇంట్లోని వస్తువులన్నీ ఆరుబయట రేకుల గుడిసెలో ఉంచారు. మూడవరోజు రేకుల గుడిసెలోని ఓ బ్యాగులో, స్నానాల గదిలో విడిచిన బట్టల్లో మంటలు చెలరేగి బట్టలు కాలిపోయాయి. స్నానాల గదికి విద్యుత్ సరఫరా కూడా లేదు. మరి ఎలా కాలిపోయాయో అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాలుగవ రోజు వంట గదిలో తలుపుకు తగిలించిన ఉల్లిగడ్డల కవరులో, ఇంటి ముందు కొట్టం పైన ఉన్న తాటాకులపై మంటలు వచ్చి కాలిపోతుండగా.. గమనించిన వారు వెంటనే మంటలను ఆర్పివేశారు. ఈ పరిణామాలతో ఆ ఇంటి వారంతా చెట్టు కిందే ఉంటూ మంటలు ఎలా వస్తున్నాయో తెలియక క్షణం... క్షణం భయం భయంగా గడుపుతున్నారు.

ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల బయ్యారం ఎస్సై రమాదేవి ఆ ఇంటిని సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ విషయంపై ఆ ఇంటి వారు మాట్లాడుతూ.... ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్య ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఇలాంటి సంఘటనలను ఎప్పుడూ చూడలేదని.. తమ ఇంట్లోనే ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదన్నారు. ఏం చేయాలో పాలుపోవడం లేదని వాపోయారు.

ఇవీ చదవండి:

విశాఖ వాసులను వెంటాడుతున్న విషవాయువు...!

ఇంట్లో రోజుకో చోట మంటలు.. కారణం తెలియదు!

తెలంగాణలోని మహబూబాబాద్​ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంలోని వేములపల్లి రాజు కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. 4 రోజుల క్రితం ఆ ఇంట్లో మంటలు చెలరేగి టీవీ, మొబైల్ ఫోన్, సెల్ఫ్​లో చెద్దర్లు కాలిపోయాయి. మంటలను గమనించిన ఇంట్లోని వారు వెంటనే మంటలను ఆర్పివేశారు. రెండవ రోజు కిచెన్​లో, వరండాలోని ఫ్రిజ్​పైన ఉన్న దుస్తులు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ తో కాలిపోతున్నాయని వారు భావించారు.

వెంటనే ఇంట్లోని వస్తువులన్నీ ఆరుబయట రేకుల గుడిసెలో ఉంచారు. మూడవరోజు రేకుల గుడిసెలోని ఓ బ్యాగులో, స్నానాల గదిలో విడిచిన బట్టల్లో మంటలు చెలరేగి బట్టలు కాలిపోయాయి. స్నానాల గదికి విద్యుత్ సరఫరా కూడా లేదు. మరి ఎలా కాలిపోయాయో అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాలుగవ రోజు వంట గదిలో తలుపుకు తగిలించిన ఉల్లిగడ్డల కవరులో, ఇంటి ముందు కొట్టం పైన ఉన్న తాటాకులపై మంటలు వచ్చి కాలిపోతుండగా.. గమనించిన వారు వెంటనే మంటలను ఆర్పివేశారు. ఈ పరిణామాలతో ఆ ఇంటి వారంతా చెట్టు కిందే ఉంటూ మంటలు ఎలా వస్తున్నాయో తెలియక క్షణం... క్షణం భయం భయంగా గడుపుతున్నారు.

ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల బయ్యారం ఎస్సై రమాదేవి ఆ ఇంటిని సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ విషయంపై ఆ ఇంటి వారు మాట్లాడుతూ.... ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్య ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఇలాంటి సంఘటనలను ఎప్పుడూ చూడలేదని.. తమ ఇంట్లోనే ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదన్నారు. ఏం చేయాలో పాలుపోవడం లేదని వాపోయారు.

ఇవీ చదవండి:

విశాఖ వాసులను వెంటాడుతున్న విషవాయువు...!

Last Updated : May 9, 2020, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.