ETV Bharat / city

పులిపోస... ఇదంటే మన్యం ప్రజల గుండెల్లో హడల్ !

పచ్చని అడవి అందాలు, హిమపాతాలు, సెలయేళ్లు, వాగులు, వంకలు, రకరకాల జీవ జాతులు... అడవితల్లినే నమ్ముకుని జీవించే కుటుంబాలు ఇలాంటి ఎన్నో విశేషాల సముహామే విశాఖ మన్యం. అలాంటి  మన్యంలో ఓ విష జీవి గిరిజన వాసులను భయపెడుతోంది. ఆ జీవి పేరు వింటేనే అమ్మో అనే పరిస్థితి ఉంది. మరీ ఆ ప్రాణాంతకమైన జీవి గురించి మనమూ తెలుసుకుందాం...!

author img

By

Published : Oct 26, 2019, 11:10 PM IST

strange poisonous creature found in Visakha Manya
పులిపోస...ఇదంటే మన్యం ప్రజల గుండెల్లో హడల్ !
విశాఖ మన్యం కొండ కోనల సమూహం. కోట్లాది జీవరాసుల ఆవాసం. అలాంటి జీవరాసుల్లో ఒకటి పులిపోస. నలుపు రంగు ఆకృతిలో తెలుపు చారలు కలిగి ఉండే బల్లి లాంటి జీవి. ఇది చాలా ప్రమాదకరమైనది. పొరపాటున కరిస్తే అంతే... పది నిమిషాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. పాడేరు మండలం ఇనాడ, దేవాపురం పంచాయతీల పరిధి కొండ చరియల్లో ఈ జీవులు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

పులిపోసే కాదు పులిబల్లిగా కూడా..

మన్యంలో ఉండే ప్రజలు ఈ విష జీవిని 'పులిపోస'గా పిలుస్తారు. శరీరంపై పులిచారలు కలిగి ఉండడం వల్ల దీనిని 'పులిబల్లి' అని కూడా అంటారు. ఇవి కొండ తొర్రల్లో నివసిస్తాయి. వర్షాలు, తేమ ఉన్న సందర్భాల్లో రాత్రి వేళ్లలో ఎక్కువగా బయటకు వస్తాయి. కొండ గట్ల వద్ద తిరిగే వారు వీటి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

నిమిషాల్లోనే ప్రాణం పోతుంది

ఈ పులిబల్లి కరిస్తే మనిషి కేవలం పది నిమిషాల్లోనే హఠాత్తుగా చనిపోతాడు. కనీసం ప్రాథమిక చికిత్స చేసే సమయం కూడా ఉండదు. ఏమి జరిగిందో అని తెలుసుకునే లోపే ప్రాణాలు పోతాయి. ఈ పులిపోసలతో అత్యంత జాగ్రత్తగా ఉండాలని స్థానికులు హెచ్చరిస్తున్నారు. మన్యంలో ఇలాంటి విష జీవుల బారిన పడి ఎంతో మంది ఆకస్మిక మరణాలకు గురవుతుంటారు. అధికారులు ఇలాంటి జీవుల గురించి అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించి... మన్యం వాసుల విలువైన ప్రాణాలు కాపాడేలా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదీ చదవండి:

విశాఖలో తీగ లాగితే... కోల్​కతాలో డొంక కదిలింది!

పులిపోస...ఇదంటే మన్యం ప్రజల గుండెల్లో హడల్ !
విశాఖ మన్యం కొండ కోనల సమూహం. కోట్లాది జీవరాసుల ఆవాసం. అలాంటి జీవరాసుల్లో ఒకటి పులిపోస. నలుపు రంగు ఆకృతిలో తెలుపు చారలు కలిగి ఉండే బల్లి లాంటి జీవి. ఇది చాలా ప్రమాదకరమైనది. పొరపాటున కరిస్తే అంతే... పది నిమిషాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. పాడేరు మండలం ఇనాడ, దేవాపురం పంచాయతీల పరిధి కొండ చరియల్లో ఈ జీవులు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

పులిపోసే కాదు పులిబల్లిగా కూడా..

మన్యంలో ఉండే ప్రజలు ఈ విష జీవిని 'పులిపోస'గా పిలుస్తారు. శరీరంపై పులిచారలు కలిగి ఉండడం వల్ల దీనిని 'పులిబల్లి' అని కూడా అంటారు. ఇవి కొండ తొర్రల్లో నివసిస్తాయి. వర్షాలు, తేమ ఉన్న సందర్భాల్లో రాత్రి వేళ్లలో ఎక్కువగా బయటకు వస్తాయి. కొండ గట్ల వద్ద తిరిగే వారు వీటి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

నిమిషాల్లోనే ప్రాణం పోతుంది

ఈ పులిబల్లి కరిస్తే మనిషి కేవలం పది నిమిషాల్లోనే హఠాత్తుగా చనిపోతాడు. కనీసం ప్రాథమిక చికిత్స చేసే సమయం కూడా ఉండదు. ఏమి జరిగిందో అని తెలుసుకునే లోపే ప్రాణాలు పోతాయి. ఈ పులిపోసలతో అత్యంత జాగ్రత్తగా ఉండాలని స్థానికులు హెచ్చరిస్తున్నారు. మన్యంలో ఇలాంటి విష జీవుల బారిన పడి ఎంతో మంది ఆకస్మిక మరణాలకు గురవుతుంటారు. అధికారులు ఇలాంటి జీవుల గురించి అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించి... మన్యం వాసుల విలువైన ప్రాణాలు కాపాడేలా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదీ చదవండి:

విశాఖలో తీగ లాగితే... కోల్​కతాలో డొంక కదిలింది!

Intro:Body:

ap_vsp_79_25_pramada_balli_pdr_pkg_avb_ap10082_2510digital_1572023569_389ap_vsp_79_25_pramada_balli_pdr_pkg_avb_ap10082_2510digital_1572023569_389


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.