ETV Bharat / city

కళా వెంకట్రావు అరెస్టుపై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసనలు

author img

By

Published : Jan 22, 2021, 10:09 AM IST

తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు అరెస్ట్​ను నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Statewide TDP protests
రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసనలు

తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు అరెస్ట్​ను నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. తెదేపా అధినేత చంద్రబాబు పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లోని అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాల వద్ద ఈ కార్యక్రమాలు జరిగినట్లు పార్టీ పేర్కొంది. బీసీ నాయకత్వాన్ని అణిచేసేందుకు వైకాపా చేసే కుట్రలను బీసీలంతా ఏకమై తిప్పికొట్టాలని నేతలు పిలుపునిచ్చారు. దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసాన్ని ఖండించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యమత ప్రచారం, బలవంతపు మత మార్పిళ్లను ప్రశ్నించడమే నేరమా.. అని నినాదాలు చేశారు.

గుంటూరు జిల్లాలో...

వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజా అన్నారు. తెనాలిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు. వైకాపా నేతలు అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయారని విమర్శించారు. పేదవాడి పొట్టలు కొట్టి.. డబ్బులు సంపాదిస్తున్నారని అన్నారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావుపై కుట్రపూరితంగా కేసులు పెట్టారని ఆలపాటి రాజా ఆరోపించారు. విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు రాత్రివేళ పిలుస్తారా.. అంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని కాపాడటంలో అధికార ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అడుగడుగునా తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీలపైనే.. ఎస్సీ యాక్ట్ పెట్టే స్థితిలో ప్రభుత్వం దిగజారిందని ఆలపాటి విమర్శలు గుప్పించారు.

తూర్పుగోదావరి జిల్లాలో...

తెదేపా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావును అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అమలాపురం పార్లమెంట్ అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి అన్నారు. వెంకట్రావు అరెస్ట్​పై కొత్తపేట నియోజకవర్గంలో పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కొత్తపేట, రావులపాలెంలో పార్లమెంట్ తెదేపా యువత అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజు, పార్టీ నాయకులు గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైకాపా ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలు చేపడుతుందన్నారు. అధికార ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలు చేపడుతుందన్నారు.

విశాఖ జిల్లాలో...

తెదేపా నేత కళా వెంకట్రావు అరెస్ట్​ను ఖండిస్తూ ముంచంగిపుట్టు మండల కేంద్రంలో పార్టీ వర్గాలు రాస్తారోకో నిర్వహించాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక పేద, బడుగు, బలహీన వర్గాలపై దాడులు పెరిగిపోయాయని నాయకులు అన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తుంటే నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టటం తగదని హెచ్చరించారు. వైకాపాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ప్రధాన రహదారి వద్ద ధర్నా చేశారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే కేసులు పెడతారా ?: కళా

తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు అరెస్ట్​ను నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. తెదేపా అధినేత చంద్రబాబు పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లోని అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాల వద్ద ఈ కార్యక్రమాలు జరిగినట్లు పార్టీ పేర్కొంది. బీసీ నాయకత్వాన్ని అణిచేసేందుకు వైకాపా చేసే కుట్రలను బీసీలంతా ఏకమై తిప్పికొట్టాలని నేతలు పిలుపునిచ్చారు. దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసాన్ని ఖండించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యమత ప్రచారం, బలవంతపు మత మార్పిళ్లను ప్రశ్నించడమే నేరమా.. అని నినాదాలు చేశారు.

గుంటూరు జిల్లాలో...

వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజా అన్నారు. తెనాలిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు. వైకాపా నేతలు అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయారని విమర్శించారు. పేదవాడి పొట్టలు కొట్టి.. డబ్బులు సంపాదిస్తున్నారని అన్నారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావుపై కుట్రపూరితంగా కేసులు పెట్టారని ఆలపాటి రాజా ఆరోపించారు. విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు రాత్రివేళ పిలుస్తారా.. అంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని కాపాడటంలో అధికార ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అడుగడుగునా తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీలపైనే.. ఎస్సీ యాక్ట్ పెట్టే స్థితిలో ప్రభుత్వం దిగజారిందని ఆలపాటి విమర్శలు గుప్పించారు.

తూర్పుగోదావరి జిల్లాలో...

తెదేపా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావును అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అమలాపురం పార్లమెంట్ అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి అన్నారు. వెంకట్రావు అరెస్ట్​పై కొత్తపేట నియోజకవర్గంలో పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కొత్తపేట, రావులపాలెంలో పార్లమెంట్ తెదేపా యువత అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజు, పార్టీ నాయకులు గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైకాపా ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలు చేపడుతుందన్నారు. అధికార ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలు చేపడుతుందన్నారు.

విశాఖ జిల్లాలో...

తెదేపా నేత కళా వెంకట్రావు అరెస్ట్​ను ఖండిస్తూ ముంచంగిపుట్టు మండల కేంద్రంలో పార్టీ వర్గాలు రాస్తారోకో నిర్వహించాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక పేద, బడుగు, బలహీన వర్గాలపై దాడులు పెరిగిపోయాయని నాయకులు అన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తుంటే నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టటం తగదని హెచ్చరించారు. వైకాపాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ప్రధాన రహదారి వద్ద ధర్నా చేశారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే కేసులు పెడతారా ?: కళా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.