ETV Bharat / city

అదిరేటి అంచనాలు.. చిక్కిపోయిన వ్యయాలు

author img

By

Published : Jun 11, 2020, 5:09 AM IST

రాష్ట్రంలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2019-20) బడ్జెట్‌ అంచనాల్లో మూడొంతులు మాత్రమే ఖర్చు సాకారమయింది. 2019-20లో రూ.2,27,975 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ ప్రవేశపెడితే రూ.1,66,322 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు తేలుతున్నాయి

fiscal year
fiscal year

రాష్ట్రంలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2019-20) బడ్జెట్‌ అంచనాల్లో మూడొంతులు మాత్రమే ఖర్చు సాకారమయింది. 2019-20లో రూ.2,27,975 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ ప్రవేశపెడితే రూ.1,66,322 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు తేలుతున్నాయి. ఈ లెక్కలను తర్వాత సవరించే అవకాశమూ ఉంది. ఇటీవల కాలంలో బడ్జెట్‌ అంచనాలు, ఖర్చులకూ పొంతన లేకుండా పోతోంది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ తర్వాత తొలి రెండు ఆర్థిక సంవత్సరాల్లో అంచనాలకు మించి నిధులు ఖర్చు చేశారు. ఆ తర్వాత క్రమేణా అంచనాలు పెరిగిపోవడం, ఖర్చులు తగ్గడం వంటి పరిణామాలు ప్రారంభమయ్యాయి.

2017-18 నుంచి వరుసగా ఇది 93 శాతం, 86శాతానికి తగ్గిపోయి కిందటి ఆర్థిక సంవత్సరంలో మరీ తక్కువగా 73శాతానికి ఖర్చు పరిమితమయింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో సొంత ఆదాయమూ, పన్ను, పన్నేతర ఆదాయమూ, కేంద్ర సాయమూ తగ్గిపోయాయి. ఇది ఒక్క ఈ రాష్ట్రంలోనే కాదని, దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోని ఆదాయాల్లో గణనీయమైన తగ్గుదల ఉందని ఆర్థికశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఈసారి బడ్జెట్‌ ఎలా ఉంటుందో..?
2020-21 సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను వచ్చే వారం శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే బడ్జెట్‌ కసరత్తు పూర్తయి ఒక స్వరూపం ఏర్పడింది. చివరి దశ కసరత్తు చేయాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో రాష్ట్ర ఆదాయాల్లో నాలుగో వంతూ దక్కలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్‌ ఏ స్థాయిలో ఉంటుందన్న చర్చ జరుగుతోంది.

ఇదీ చదవండి:

నేడు రాష్ట్ర మంత్రి మండలి సమావేశం..40 అంశాలతో అజెండా!

రాష్ట్రంలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2019-20) బడ్జెట్‌ అంచనాల్లో మూడొంతులు మాత్రమే ఖర్చు సాకారమయింది. 2019-20లో రూ.2,27,975 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ ప్రవేశపెడితే రూ.1,66,322 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు తేలుతున్నాయి. ఈ లెక్కలను తర్వాత సవరించే అవకాశమూ ఉంది. ఇటీవల కాలంలో బడ్జెట్‌ అంచనాలు, ఖర్చులకూ పొంతన లేకుండా పోతోంది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ తర్వాత తొలి రెండు ఆర్థిక సంవత్సరాల్లో అంచనాలకు మించి నిధులు ఖర్చు చేశారు. ఆ తర్వాత క్రమేణా అంచనాలు పెరిగిపోవడం, ఖర్చులు తగ్గడం వంటి పరిణామాలు ప్రారంభమయ్యాయి.

2017-18 నుంచి వరుసగా ఇది 93 శాతం, 86శాతానికి తగ్గిపోయి కిందటి ఆర్థిక సంవత్సరంలో మరీ తక్కువగా 73శాతానికి ఖర్చు పరిమితమయింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో సొంత ఆదాయమూ, పన్ను, పన్నేతర ఆదాయమూ, కేంద్ర సాయమూ తగ్గిపోయాయి. ఇది ఒక్క ఈ రాష్ట్రంలోనే కాదని, దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోని ఆదాయాల్లో గణనీయమైన తగ్గుదల ఉందని ఆర్థికశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఈసారి బడ్జెట్‌ ఎలా ఉంటుందో..?
2020-21 సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను వచ్చే వారం శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే బడ్జెట్‌ కసరత్తు పూర్తయి ఒక స్వరూపం ఏర్పడింది. చివరి దశ కసరత్తు చేయాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో రాష్ట్ర ఆదాయాల్లో నాలుగో వంతూ దక్కలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్‌ ఏ స్థాయిలో ఉంటుందన్న చర్చ జరుగుతోంది.

ఇదీ చదవండి:

నేడు రాష్ట్ర మంత్రి మండలి సమావేశం..40 అంశాలతో అజెండా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.