రాష్ట్రంలో ఇసుక అవసరమైన వారు ఇసుక రీచ్లు, డిపోలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా... ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. గతంలో ఏపీ ఖనిజాబివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)మాదిరిగానే డోర్ డెలివరీ చేసేందుకు అందులో ఏర్పాట్లు చేశారు. గనులశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇసుక తవ్వకాలు, విక్రయాలు చేస్తున్న జేపీ పవర్ వెంచర్స్ సంస్థ.... ఆన్లైన్ పోర్టల్ను అదివారం ప్రారంభించింది. www.andhrasand.com పేరిట ఉండే ఈ పోర్టల్లో ఆదివారాలు తప్ప రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు. రీచ్లో టన్ను రూ.475, ఆయా డిపోల్లో అధికారులు నిర్ణయించిన ధర ప్రకారం తీసుకోనున్నారు. డోర్ డెలివరీ కావాల్సిన వారి చిరునామాను గూగుల్ మ్యాప్ ద్వారా ఎంత దూరం ఉంటుందో పరిగణలోకి తీసుకుని, అందుకు అయ్యే రవాణా ఛార్జీలను ఆన్లైన్లో పేర్కొంటారు. వీటిని చెల్లించిన వారికి డెలివరీ చేయనున్నారు.ఆంధ్రా శాండ్ పేరిట యాప్ సిద్ధం చేశారు. ఇందులో కూడా ఇసుక బుకింగ్కు వీలు కల్పించారు.
గనులశాఖ పర్యవేక్షణలో ఫోన్ నంబరు...
ఇసుక బుకింగ్, ఆన్లైన్లో సమస్యలు తదితరాలపై సంప్రదించేందుకు 9700009944 నంబరును అందుబాటులోకి తెచ్చినట్లు గనులశాఖ అధికారుల తెలిపారు. త్వరలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ఇసుక బుకింగ్కు సదుపాయం మొదలవుతుందని పేర్కొన్నారు.
ఇవీచదవండి.