ETV Bharat / city

PROMOTIONS: ఏపీఎస్ఆర్టీసీలో పదోన్నతులు...ఈ నెలాఖరులోపు..

author img

By

Published : Sep 14, 2021, 8:54 PM IST

Updated : Sep 14, 2021, 10:57 PM IST

ఏపీఎస్ఆర్టీసీలో పదోన్నతి కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల కల నేరవేరబోతోంది. అర్హత ఉన్న ఉద్యోగులందరికీ ఈ నెలాఖరులోపు పదోన్నతులు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు అదేశిలిచ్చారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఏపీఎస్ఆర్టీసీలో పదోన్నతుల పండగ
ఏపీఎస్ఆర్టీసీలో పదోన్నతుల పండగ



ఏపీఎస్ ఆర్టీసీలో పదోన్నతుల పండగ ప్రారంభమైంది. పదోన్నతి కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న ఉద్యోగుల కల నేరవేరబోతోంది. అర్హత ఉన్న ఉద్యోగులందరికీ ఈ నెలాఖరులోపు పదోన్నతులు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఉత్తర్వుల్లో తెలిపారు. దీంతో అన్ని జిల్లాల్లోనూ అర్హుల జాబితా రూపొందించడంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు.

రెండేళ్లుగా నిలిచిపోయిన పదవీవిరమణలు..

ఆర్టీసీలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును రాష్ట్ర ప్రభుత్వం 60 ఏళ్లకు పెంచింది. దీంతో రెండేళ్లుగా పదవీ విరమణలు నిలిచిపోయాయి. చాలామంది పదోన్నతులు పొందాల్సి ఉండగా ఖాళీలు లేకపోవడంతో పదోన్నతులు పొందలేకపోయారు. 60 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నవారు ఈ నెలాఖరున పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో ఈ నెలాఖరు నుంచి ఆర్టీసీలో ఉద్యోగుల పదవీ విరమణ ప్రక్రియ తిరిగి ప్రారంభం కాబోతోంది.

ఇకపై నెలకు 200 నుంచి 300 వరకు ఉద్యోగులు పదవీ విరమణ పొందనున్నారు. దీంతో నిబంధనలను అనుసరించి ఖాళీ అయిన స్థానాల్లో పలు పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. పదోన్నతులు ఇచ్చే అంశంపై 2011, 2019 లో ఆర్టీసీ యాజమాన్యం నిబంధనలు రూపొందించింది. 2019లో అప్పటి ఎండీ సురేంద్రబాబు హయాంలో నిబంధనలను సవరించారు. వీటినే బోర్డులో ఆమోదముద్ర తీసుకుని పదోన్నతులు చేపట్టాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

ప్రభుత్వంలో విలీనం తర్వాత తొలిసారి..

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన అనంతరం తొలిసారిగా పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. పదోన్నతులు ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలన్న ఎండీ ఆదేశాల మేరకు ఆఘమేఘాల మీద దస్త్రాలు సిద్దమవుతున్నాయి. కండక్టర్లు, మెకానిక్​లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ డిపో మేనేజర్లు, కంట్రోలర్లు, గ్యారేజీ సూపర్​వైజర్లు, ట్రాఫిక్ సూపర్​వైజర్లు తదితర ఉద్యోగులు ఎక్కువమంది పదోన్నతులు పొందే అవకాశాలున్నాయి. పదోన్నతుల అనంతరం సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను అధికారులు ప్రభుత్వానికి నివేదించనున్నారు. అనంతరం ఖాళీగా ఉన్న పోస్టులను ఏపీపీఎస్సీ లేదా నేరుగా భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.

ఇదీ చదవండి:

నకిలీ చలాన్ల బాధ్యులపై కఠిన చర్యలు: మంత్రి ధర్మాన కృష్ణదాస్‌



ఏపీఎస్ ఆర్టీసీలో పదోన్నతుల పండగ ప్రారంభమైంది. పదోన్నతి కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న ఉద్యోగుల కల నేరవేరబోతోంది. అర్హత ఉన్న ఉద్యోగులందరికీ ఈ నెలాఖరులోపు పదోన్నతులు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఉత్తర్వుల్లో తెలిపారు. దీంతో అన్ని జిల్లాల్లోనూ అర్హుల జాబితా రూపొందించడంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు.

రెండేళ్లుగా నిలిచిపోయిన పదవీవిరమణలు..

ఆర్టీసీలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును రాష్ట్ర ప్రభుత్వం 60 ఏళ్లకు పెంచింది. దీంతో రెండేళ్లుగా పదవీ విరమణలు నిలిచిపోయాయి. చాలామంది పదోన్నతులు పొందాల్సి ఉండగా ఖాళీలు లేకపోవడంతో పదోన్నతులు పొందలేకపోయారు. 60 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నవారు ఈ నెలాఖరున పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో ఈ నెలాఖరు నుంచి ఆర్టీసీలో ఉద్యోగుల పదవీ విరమణ ప్రక్రియ తిరిగి ప్రారంభం కాబోతోంది.

ఇకపై నెలకు 200 నుంచి 300 వరకు ఉద్యోగులు పదవీ విరమణ పొందనున్నారు. దీంతో నిబంధనలను అనుసరించి ఖాళీ అయిన స్థానాల్లో పలు పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. పదోన్నతులు ఇచ్చే అంశంపై 2011, 2019 లో ఆర్టీసీ యాజమాన్యం నిబంధనలు రూపొందించింది. 2019లో అప్పటి ఎండీ సురేంద్రబాబు హయాంలో నిబంధనలను సవరించారు. వీటినే బోర్డులో ఆమోదముద్ర తీసుకుని పదోన్నతులు చేపట్టాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

ప్రభుత్వంలో విలీనం తర్వాత తొలిసారి..

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన అనంతరం తొలిసారిగా పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. పదోన్నతులు ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలన్న ఎండీ ఆదేశాల మేరకు ఆఘమేఘాల మీద దస్త్రాలు సిద్దమవుతున్నాయి. కండక్టర్లు, మెకానిక్​లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ డిపో మేనేజర్లు, కంట్రోలర్లు, గ్యారేజీ సూపర్​వైజర్లు, ట్రాఫిక్ సూపర్​వైజర్లు తదితర ఉద్యోగులు ఎక్కువమంది పదోన్నతులు పొందే అవకాశాలున్నాయి. పదోన్నతుల అనంతరం సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను అధికారులు ప్రభుత్వానికి నివేదించనున్నారు. అనంతరం ఖాళీగా ఉన్న పోస్టులను ఏపీపీఎస్సీ లేదా నేరుగా భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.

ఇదీ చదవండి:

నకిలీ చలాన్ల బాధ్యులపై కఠిన చర్యలు: మంత్రి ధర్మాన కృష్ణదాస్‌

Last Updated : Sep 14, 2021, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.