తెలంగాణాలోని శంషాబాద్లో యువతి హత్యపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక మనిషిని మరో మనిషి అంతక్రూరంగా హింసించి ఎలా చంపేస్తారంటూ బావోద్వేగానికి లోనయ్యారు. ఊహించుకోవడానికే ఎంతో భయానకంగా ఉందని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు రాహుల్ ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి : నిందితులకు న్యాయ సహాయం చేయొద్దు: కేంద్రమంత్రి