ETV Bharat / city

లాక్​డౌన్​ ఎత్తివేస్తే ఇవి తప్పనిసరిగా పాటించాలట!

author img

By

Published : May 5, 2020, 2:39 PM IST

మరో 2 వారాలకో లేదా నెల రోజులకో లాక్‌డౌన్‌ను ఎత్తేయాల్సిన పరిస్థితులొస్తాయి. అప్పుడు కూడా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాల్సిందే. వ్యక్తిగత దూరం, ముఖానికి మాస్కులు ధరించడం, చేతులను శుభ్రపర్చుకోవడం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే’’ అని భారతీయ నివారణ, సామాజిక వైద్య నిపుణుల సంస్థ (ఐఏపీఎస్‌ఎం) స్పష్టం చేసింది.

లాక్​డౌన్​ ఎత్తివేస్తే ఇవి తప్పనిసరిగా పాటించాలట!
లాక్​డౌన్​ ఎత్తివేస్తే ఇవి తప్పనిసరిగా పాటించాలట!

లాక్‌డౌన్‌ అనంతర చర్యలపై ఐఏపీఎస్‌ఎం రూపొందించిన అధ్యయన పత్రం తాజాగా ప్రముఖ వైద్యపత్రిక ‘ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ కమ్యూనిటీ హెల్త్‌’లో ప్రచురితమైంది. లాక్​డౌన్​ ఎత్తివేసినా స్వీయ నియంత్రణ పాటించాల్సిందేనని భారతీయ నివారణ, సామాజిక వైద్య నిపుణుల సంస్థ (ఐఏపీఎస్‌ఎం) స్పష్టం చేసింది.

వ్యక్తిగత దూరం, ముఖానికి మాస్కులు ధరించడం, చేతులను శుభ్రపర్చుకోవడం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కరోనా కట్టడికి సమయానుకూలంగా చేపట్టిన చర్యలపై ఐఏపీఎస్‌ఎం మార్గదర్శకాలను సిఫార్సు చేసింది. రాష్ట్రంలో వీటిని అమలు చేయడంలో ఉన్న సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం పరిశీలిస్తోంది.

తీవ్రత గుర్తింపు

లాక్‌డౌన్‌ను ఎత్తివేయడానికి ముందు వైరస్‌ తీవ్రత ప్రాంతాలను గుర్తించాలి. ప్రతి 10 లక్షల జనాభాలో ప్రతి 7 రోజులు, 14 రోజులకు కేసుల సంఖ్య ఎలా నమోదవుతోంది? వైద్యసేవలకు సంబంధించి ప్రతి వెయ్యి మంది జనాభాకు కొవిడ్‌ 19 బాధితులకు ఎన్ని పడకలు సమకూర్చారు? ఐసీయూ పడకలెన్ని? ఒకవేళ ఏ జిల్లాలోనైనా ఐసీయూ పడకలను ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోతే.. పక్క జిల్లాలో అదనపు ఐసీయూ పడకలను సమకూర్చారో లేదో పరిశీలించాలి.

కచ్చితంగా పాటించాల్సినవి

  • రద్దీ ప్రదేశాల్లో రెండు మీటర్ల వ్యక్తిగత దూరాన్ని పాటించాలి.
  • ముఖానికి మాస్కు ధరించకుండా వెలుపలికి రాకూడదు.
  • 60 ఏళ్లు దాటినవారు, అధిక రక్తపోటు, మధుమేహం, తదితర దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న 50 ఏళ్లు దాటినవారు.. ఇంటిపట్టునే ఉండడం మేలు. వీలైతే వీరికి ఇంటి వద్ద నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాలి. వీరిని వీలైతే వారానికి రెండుసార్లు, లేదంటే కనీసం వారంలో ఒకరోజైనా వైద్యసిబ్బంది పరీక్షించాలి.
  • మాల్స్‌, సినిమా హాళ్లు, షాపింగ్‌ సెంటర్లు, విద్యాసంస్థలు, మతపరమైన ప్రదేశాలు, ప్రార్థన స్థలాలు, పార్కులు, ఫంక్షన్‌ హాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్రీడలు, ఎగ్జిబిషన్లు, సంగీత విభావరులు, తదితర రద్దీ ఎక్కువగా ఉండే వాటిని మరో 60 రోజుల పాటు మూసివేయాలి.
  • ప్రజలకు నిత్యావసరాల కొరత లేకుండా.. ఉత్పత్తి సంస్థ నుంచి వినియోగదారుడికి చేరే వరకూ అన్ని స్థాయుల్లోనూ పక్కా ప్రణాళికను రూపొందించాలి. జిల్లా కలెక్టర్‌ స్థాయి అధికారి ఎప్పటికప్పుడు సమీక్షించాలి.
  • రోగులు, వైద్యసిబ్బంది ఆసుపత్రులకు రావడానికి ఇబ్బంది పడకుండా ముఖ్యమైన మార్గాలను ఎంపిక చేసి బస్సులు, రైళ్లు, వంటి ప్రజారవాణాను పునరుద్ధరించాలి. ఇందులోనూ వ్యక్తిగత దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి.
  • ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో ప్రజల రాకపోకలను నియంత్రించాలి.
  • శుభకార్యాలు, అంత్యక్రియల్లో పాల్గొనడానికి గరిష్ఠంగా 20 మందికి మించి అనుమతించొద్దు.
  • నెలరోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను సగం మంది ఉద్యోగుల హాజరుతో నడిపించాలి. ఐదురోజుల పనిదినాలుండాలి.
  • సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ అంతర్జాతీయ, అంతర్రాష్ట్రాల మధ్య పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు కొనసాగించకుండా నియంత్రించాలి.
  • పని ప్రదేశాల్లో శానిటైజర్లను సమకూర్చాలి.
  • బస్సు/రైళ్లలో ఒక సీటులో ఒక ప్రయాణికుడు మాత్రమే కూర్చోవడానికి అనుమతించాలి.
  • ఆటోల్లో డ్రైవరు కాకుండా మరొకరు, టాక్సీల్లో డ్రైవర్‌ కాకుండా మరో ఇద్దరు ప్రయాణించాలి. అందరూ మాస్కులు ధరించాలి. శానిటైజర్‌ను అందుబాటులో ఉంచుకోవాలి.

తక్కువ ముప్పు ఉన్నచోట..

  • 30 రోజుల కార్యాచరణను పరిశీలించాలి.
  • ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు మినహా ఇతర సంస్థల్లో ఒక్కో షిఫ్టులో 70 శాతం ఉద్యోగుల హాజరుతో నడిపించాలి.

ముప్పు కొంచెం ఎక్కువగా..

  • 40 రోజుల కార్యాచరణను అమలుచేయాలి. పరిస్థితులు మెరుగుపడితే మార్చుకోవాలి.
  • కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులు ఒక షిఫ్టులో హాజరవ్వాలి. ఉత్పత్తి 70 శాతానికి మించి జరగొద్దు.

ముప్పు తీవ్రత అధికంగా..

  • 50 రోజుల పాటు పరిశీలించాలి.
  • మొత్తం ఉద్యోగుల్లో 30 శాతం మాత్రమే ఒక షిఫ్టులో పనిచేయాలి. ఉత్పత్తి గరిష్ఠంగా 50 శాతానికి మించి జరగొద్దు.

తీవ్రత మరీ ఎక్కువుంటే..

  • ఉద్యోగులు 20 శాతానికి కంటే ఎక్కువగా ఒక షిఫ్టులో హాజరవ్వద్దు. ఉత్పత్తి కూడా 30-50 శాతానికి దాటొద్దు.

ఇవీ చూడండి:

సొంతూళ్లకు వెళ్తామంటూ.. వలస కూలీల నిరసనలు

లాక్‌డౌన్‌ అనంతర చర్యలపై ఐఏపీఎస్‌ఎం రూపొందించిన అధ్యయన పత్రం తాజాగా ప్రముఖ వైద్యపత్రిక ‘ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ కమ్యూనిటీ హెల్త్‌’లో ప్రచురితమైంది. లాక్​డౌన్​ ఎత్తివేసినా స్వీయ నియంత్రణ పాటించాల్సిందేనని భారతీయ నివారణ, సామాజిక వైద్య నిపుణుల సంస్థ (ఐఏపీఎస్‌ఎం) స్పష్టం చేసింది.

వ్యక్తిగత దూరం, ముఖానికి మాస్కులు ధరించడం, చేతులను శుభ్రపర్చుకోవడం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కరోనా కట్టడికి సమయానుకూలంగా చేపట్టిన చర్యలపై ఐఏపీఎస్‌ఎం మార్గదర్శకాలను సిఫార్సు చేసింది. రాష్ట్రంలో వీటిని అమలు చేయడంలో ఉన్న సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం పరిశీలిస్తోంది.

తీవ్రత గుర్తింపు

లాక్‌డౌన్‌ను ఎత్తివేయడానికి ముందు వైరస్‌ తీవ్రత ప్రాంతాలను గుర్తించాలి. ప్రతి 10 లక్షల జనాభాలో ప్రతి 7 రోజులు, 14 రోజులకు కేసుల సంఖ్య ఎలా నమోదవుతోంది? వైద్యసేవలకు సంబంధించి ప్రతి వెయ్యి మంది జనాభాకు కొవిడ్‌ 19 బాధితులకు ఎన్ని పడకలు సమకూర్చారు? ఐసీయూ పడకలెన్ని? ఒకవేళ ఏ జిల్లాలోనైనా ఐసీయూ పడకలను ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోతే.. పక్క జిల్లాలో అదనపు ఐసీయూ పడకలను సమకూర్చారో లేదో పరిశీలించాలి.

కచ్చితంగా పాటించాల్సినవి

  • రద్దీ ప్రదేశాల్లో రెండు మీటర్ల వ్యక్తిగత దూరాన్ని పాటించాలి.
  • ముఖానికి మాస్కు ధరించకుండా వెలుపలికి రాకూడదు.
  • 60 ఏళ్లు దాటినవారు, అధిక రక్తపోటు, మధుమేహం, తదితర దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న 50 ఏళ్లు దాటినవారు.. ఇంటిపట్టునే ఉండడం మేలు. వీలైతే వీరికి ఇంటి వద్ద నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాలి. వీరిని వీలైతే వారానికి రెండుసార్లు, లేదంటే కనీసం వారంలో ఒకరోజైనా వైద్యసిబ్బంది పరీక్షించాలి.
  • మాల్స్‌, సినిమా హాళ్లు, షాపింగ్‌ సెంటర్లు, విద్యాసంస్థలు, మతపరమైన ప్రదేశాలు, ప్రార్థన స్థలాలు, పార్కులు, ఫంక్షన్‌ హాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్రీడలు, ఎగ్జిబిషన్లు, సంగీత విభావరులు, తదితర రద్దీ ఎక్కువగా ఉండే వాటిని మరో 60 రోజుల పాటు మూసివేయాలి.
  • ప్రజలకు నిత్యావసరాల కొరత లేకుండా.. ఉత్పత్తి సంస్థ నుంచి వినియోగదారుడికి చేరే వరకూ అన్ని స్థాయుల్లోనూ పక్కా ప్రణాళికను రూపొందించాలి. జిల్లా కలెక్టర్‌ స్థాయి అధికారి ఎప్పటికప్పుడు సమీక్షించాలి.
  • రోగులు, వైద్యసిబ్బంది ఆసుపత్రులకు రావడానికి ఇబ్బంది పడకుండా ముఖ్యమైన మార్గాలను ఎంపిక చేసి బస్సులు, రైళ్లు, వంటి ప్రజారవాణాను పునరుద్ధరించాలి. ఇందులోనూ వ్యక్తిగత దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి.
  • ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో ప్రజల రాకపోకలను నియంత్రించాలి.
  • శుభకార్యాలు, అంత్యక్రియల్లో పాల్గొనడానికి గరిష్ఠంగా 20 మందికి మించి అనుమతించొద్దు.
  • నెలరోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను సగం మంది ఉద్యోగుల హాజరుతో నడిపించాలి. ఐదురోజుల పనిదినాలుండాలి.
  • సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ అంతర్జాతీయ, అంతర్రాష్ట్రాల మధ్య పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు కొనసాగించకుండా నియంత్రించాలి.
  • పని ప్రదేశాల్లో శానిటైజర్లను సమకూర్చాలి.
  • బస్సు/రైళ్లలో ఒక సీటులో ఒక ప్రయాణికుడు మాత్రమే కూర్చోవడానికి అనుమతించాలి.
  • ఆటోల్లో డ్రైవరు కాకుండా మరొకరు, టాక్సీల్లో డ్రైవర్‌ కాకుండా మరో ఇద్దరు ప్రయాణించాలి. అందరూ మాస్కులు ధరించాలి. శానిటైజర్‌ను అందుబాటులో ఉంచుకోవాలి.

తక్కువ ముప్పు ఉన్నచోట..

  • 30 రోజుల కార్యాచరణను పరిశీలించాలి.
  • ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు మినహా ఇతర సంస్థల్లో ఒక్కో షిఫ్టులో 70 శాతం ఉద్యోగుల హాజరుతో నడిపించాలి.

ముప్పు కొంచెం ఎక్కువగా..

  • 40 రోజుల కార్యాచరణను అమలుచేయాలి. పరిస్థితులు మెరుగుపడితే మార్చుకోవాలి.
  • కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులు ఒక షిఫ్టులో హాజరవ్వాలి. ఉత్పత్తి 70 శాతానికి మించి జరగొద్దు.

ముప్పు తీవ్రత అధికంగా..

  • 50 రోజుల పాటు పరిశీలించాలి.
  • మొత్తం ఉద్యోగుల్లో 30 శాతం మాత్రమే ఒక షిఫ్టులో పనిచేయాలి. ఉత్పత్తి గరిష్ఠంగా 50 శాతానికి మించి జరగొద్దు.

తీవ్రత మరీ ఎక్కువుంటే..

  • ఉద్యోగులు 20 శాతానికి కంటే ఎక్కువగా ఒక షిఫ్టులో హాజరవ్వద్దు. ఉత్పత్తి కూడా 30-50 శాతానికి దాటొద్దు.

ఇవీ చూడండి:

సొంతూళ్లకు వెళ్తామంటూ.. వలస కూలీల నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.