ETV Bharat / city

ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం లేదు: పిల్లి సుభాష్ చంద్రబోస్

author img

By

Published : Jul 1, 2020, 1:06 PM IST

ఎమ్మెల్సీ పదవికి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తుందన్న నమ్మకం తనకు లేదని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేశారు.

pilli subhash chandrabose resigned mlc membership
పిల్లి సుభాష్ చంద్రబోస్

ఎమ్మెల్సీ పదవికి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేశారు. ఈ మేరకు మండలి కార్యదర్శికి రాజీనామా లేఖ ఇచ్చారు. ఈనెల 19న ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికతో శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు.

మంత్రిగా ఏడాది కాలం సంతృప్తిగా పని చేశానని సుభాష్ చంద్రబోస్ అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు సీఎం పూర్తి స్వేచ్ఛనిచ్చారని తెలిపారు. పార్లమెంటుకు వెళ్లాలన్నది తన చిరకాల కోరికన్నారు. ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ సుదీర్ఘ పోరాటం చేశారని.. అయితే హోదా వస్తుందని తనకు నమ్మకం లేదన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని స్పష్టంచేశారు.

రఘురామకృష్ణరాజు వ్యవహారంపై స్పందిస్తూ.. ఎంపీలు ఎవరైనా పార్టీకి విధేయులుగా ఉండాలని సూచించారు. పార్టీ నిర్ణయాన్ని ఎవరైనా శిరోధార్యంగా భావించాలని తెలిపారు.

ఎమ్మెల్సీ పదవికి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేశారు. ఈ మేరకు మండలి కార్యదర్శికి రాజీనామా లేఖ ఇచ్చారు. ఈనెల 19న ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికతో శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు.

మంత్రిగా ఏడాది కాలం సంతృప్తిగా పని చేశానని సుభాష్ చంద్రబోస్ అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు సీఎం పూర్తి స్వేచ్ఛనిచ్చారని తెలిపారు. పార్లమెంటుకు వెళ్లాలన్నది తన చిరకాల కోరికన్నారు. ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ సుదీర్ఘ పోరాటం చేశారని.. అయితే హోదా వస్తుందని తనకు నమ్మకం లేదన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని స్పష్టంచేశారు.

రఘురామకృష్ణరాజు వ్యవహారంపై స్పందిస్తూ.. ఎంపీలు ఎవరైనా పార్టీకి విధేయులుగా ఉండాలని సూచించారు. పార్టీ నిర్ణయాన్ని ఎవరైనా శిరోధార్యంగా భావించాలని తెలిపారు.

ఇవీ చదవండి..

'విజయసాయిరెడ్డికి పుట్టినరోజు బహుమతి...108 స్కామ్​తో రూ.300 కోట్లు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.