ETV Bharat / city

ఒకే గ్రామంలో 53 మందికి కరోనా... స్వచ్ఛందంగా లాక్​డౌన్​!

author img

By

Published : Apr 15, 2021, 2:52 PM IST

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా లాక్​డౌన్​ పాటిస్తున్నారు. తాజాగా.. కరీంనగర్​ జిల్లాలోని పెద్దకుర్మపల్లిలో ప్రజలు తమకు తాముగా లాక్​డౌన్ విధించుకున్నారు.

pedda karma palli village in self lockdown
పెద్దకుర్మపల్లిలో స్వచ్ఛందంగా లాక్​డౌన్​

కరోనా రెండో దశ వ్యాప్తి దృష్ట్యా తెలంగాణలోని కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లిలో.. ప్రజలే స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించుకున్నారు. గత వారం వేరే గ్రామానికి పండగకు వెళ్లిన వారంతా అస్వస్థతకు గురైన కారణంగా.. కరోనా పరీక్షలు నిర్వహించారు. వారం రోజుల్లోనే 53మందికి వ్యాధి నిర్ధరణ కావటంపై... గ్రామస్థులు అప్రమత్తమయ్యారు.

వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా పంచాయతీ పాలకవర్గం ప్రజలందరి అంగీకారంతో ప్రత్యేక చర్యలు తీసుకుంది. గ్రామంలో లాక్‌డౌన్ అమలుకు‌ తీర్మానించింది. ప్రజలందరూ సహకరించాలని కోరింది. కేసులు కాస్త తగ్గుముఖం పట్టేవరకు ఆంక్షలు అమల్లో ఉండేలా చర్యలు తీసుకుంది.

కరోనా రెండో దశ వ్యాప్తి దృష్ట్యా తెలంగాణలోని కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లిలో.. ప్రజలే స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించుకున్నారు. గత వారం వేరే గ్రామానికి పండగకు వెళ్లిన వారంతా అస్వస్థతకు గురైన కారణంగా.. కరోనా పరీక్షలు నిర్వహించారు. వారం రోజుల్లోనే 53మందికి వ్యాధి నిర్ధరణ కావటంపై... గ్రామస్థులు అప్రమత్తమయ్యారు.

వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా పంచాయతీ పాలకవర్గం ప్రజలందరి అంగీకారంతో ప్రత్యేక చర్యలు తీసుకుంది. గ్రామంలో లాక్‌డౌన్ అమలుకు‌ తీర్మానించింది. ప్రజలందరూ సహకరించాలని కోరింది. కేసులు కాస్త తగ్గుముఖం పట్టేవరకు ఆంక్షలు అమల్లో ఉండేలా చర్యలు తీసుకుంది.

ఇదీ చూడండి:

దేశంలో మెడికల్ ఆక్సిజన్​ కొరత లేదు: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.