ETV Bharat / city

NEERUKONDA ON AMRAVATI CORPORATION : అమరావతి కార్పొరేషన్​లో కలవబోమన్న నీరుకొండ వాసులు - ఏపీ తాజా వార్తలు

NEERUKONDA REJECTED AMRAVATI CORPORATION: అమరావతి కార్పొరేషన్​లో కలిపే ప్రతిపాదనను నీరుకొండ గ్రామస్తులు వ్యతిరేకించారు. దీనికి సంబంధించి నిర్వహించిన గ్రామసభలో వారు తమ నిర్ణయాన్ని స్పష్టం చేసినట్లు.. మంగళగిరి ఎంపీడీవో తెలిపారు.

NEERUKONDA ON AMRAVATI CORPORATION
NEERUKONDA ON AMRAVATI CORPORATION
author img

By

Published : Jan 5, 2022, 3:39 PM IST

NEERUKONDA REJECTED AMRAVATI CORPORATION: అమరావతి మున్సిపల్ కార్పొరేషన్​ ప్రతిపాదనను నీరుకొండలో జరిగిన గ్రామసభ వ్యతిరేకిస్తూ తీర్మానించింది. నీరుకొండను అమరావతి కార్పొరేషన్​లో కలిపేందుకు గ్రామస్తులు నిరాకరించినట్లు.. మంగళగిరి ఎంపీడీవో రాంప్రసన్న అధికారికంగా ప్రకటించారు. నేడు జరిగిన రెండు గ్రామసభల్లోనూ ప్రజలు ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించినట్లు ఆయన వెల్లడించారు. 19 గ్రామాలతో కాకుండా.. 29 గ్రామాలతో కార్పొరేషన్​ను ఏర్పాటు చేయాలని ప్రజలు అభిప్రాయపడినట్లు స్పష్టం చేశారు.

కురుగల్లులో సేమ్ సీన్..
అమరావతి కేపిటల్ సిటీని మునిసిపల్ కార్పొరేషన్​గా ఏర్పాటు చేయడం కోసం నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా.. కురుగల్లులోనూ గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో గ్రామస్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ గ్రామసభలో మంగళగిరి ఎంపీడీవో రాంప్రసన్న నాయక్.. అమరావతి మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు గురించి వివరించారు. అమరావతి కార్పొరేషన్ ఏర్పాటుతో సీఆర్డీఏకు నష్టం లేదని ఆయన అన్నారు. సీఆర్డీఏ అలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అమరావతి కార్పొరేషన్ ఏర్పాటుపై స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పాలని ఆయన కోరారు. అయితే.. కురుగల్లు గ్రామస్థులు మాత్రం.. అమరావతి మున్సిపల్‌ కార్పొరేషన్ ఏర్పాటును ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ గ్రామస్థులు తీర్మానం చేశారు. కురుగల్లును అమరావతి కార్పొరేషన్‌లో కలపడం తమకు ఇష్టం లేదని తేల్చి చెప్పారు. గ్రామస్థుల తీర్మానాన్ని మంగళగిరి ఎంపీడీవో రాంప్రసన్న నాయక్ వెల్లడించారు.

ఇదీ చదవండి: అమరావతి కార్పొరేషన్​కు వ్యతిరేకంగా.. కురుగల్లు గ్రామస్థుల తీర్మానం

NEERUKONDA REJECTED AMRAVATI CORPORATION: అమరావతి మున్సిపల్ కార్పొరేషన్​ ప్రతిపాదనను నీరుకొండలో జరిగిన గ్రామసభ వ్యతిరేకిస్తూ తీర్మానించింది. నీరుకొండను అమరావతి కార్పొరేషన్​లో కలిపేందుకు గ్రామస్తులు నిరాకరించినట్లు.. మంగళగిరి ఎంపీడీవో రాంప్రసన్న అధికారికంగా ప్రకటించారు. నేడు జరిగిన రెండు గ్రామసభల్లోనూ ప్రజలు ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించినట్లు ఆయన వెల్లడించారు. 19 గ్రామాలతో కాకుండా.. 29 గ్రామాలతో కార్పొరేషన్​ను ఏర్పాటు చేయాలని ప్రజలు అభిప్రాయపడినట్లు స్పష్టం చేశారు.

కురుగల్లులో సేమ్ సీన్..
అమరావతి కేపిటల్ సిటీని మునిసిపల్ కార్పొరేషన్​గా ఏర్పాటు చేయడం కోసం నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా.. కురుగల్లులోనూ గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో గ్రామస్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ గ్రామసభలో మంగళగిరి ఎంపీడీవో రాంప్రసన్న నాయక్.. అమరావతి మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు గురించి వివరించారు. అమరావతి కార్పొరేషన్ ఏర్పాటుతో సీఆర్డీఏకు నష్టం లేదని ఆయన అన్నారు. సీఆర్డీఏ అలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అమరావతి కార్పొరేషన్ ఏర్పాటుపై స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పాలని ఆయన కోరారు. అయితే.. కురుగల్లు గ్రామస్థులు మాత్రం.. అమరావతి మున్సిపల్‌ కార్పొరేషన్ ఏర్పాటును ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ గ్రామస్థులు తీర్మానం చేశారు. కురుగల్లును అమరావతి కార్పొరేషన్‌లో కలపడం తమకు ఇష్టం లేదని తేల్చి చెప్పారు. గ్రామస్థుల తీర్మానాన్ని మంగళగిరి ఎంపీడీవో రాంప్రసన్న నాయక్ వెల్లడించారు.

ఇదీ చదవండి: అమరావతి కార్పొరేషన్​కు వ్యతిరేకంగా.. కురుగల్లు గ్రామస్థుల తీర్మానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.