ETV Bharat / city

raghu ramaraju: 'ఏపీ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది'

author img

By

Published : Aug 2, 2021, 4:37 PM IST

Updated : Aug 2, 2021, 7:19 PM IST

ఏపీ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిందని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఏపీలో అవకతవకలు, జరగకూడని తప్పులు జరిగాయన్నారు. నిబంధనల ఉల్లంఘనను ప్రధాని, ఆర్థికమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. అభివృద్ధి పక్కనపెట్టి అప్పులు చేస్తే భావితరాలకు తీవ్ర నష్టం జరుగుతుందని రఘురామ అన్నారు.

mp raghu rama raju comments on ap financial condition
mp raghu rama raju comments on ap financial condition

ఏపీ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిందని ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆక్షేపించారు. ఏపీలో అవకతవకలు, జరగకూడని తప్పులు జరిగాయన్నారు. ఇదే విధంగా అభివృద్ధిని పక్కనపెట్టి ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తే.. భావితరాలకు తీరని నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుల విషయంలో నిబంధనల ఉల్లంఘన అంశాన్ని ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.

‘‘తప్పులు చేయకుండా అప్పులు చేయాలి. గతంలో సీఎం ఆర్థిక సలహాదారు కృష్ణ, ఆర్థిక మంత్రి బుగ్గన సీఎంకు ఇదే విషయం చెప్పారు. దాన్నే నేను మరోసారి గుర్తు చేస్తున్నాను’’ అని రఘురామ వెల్లడించారు.

ఇదీ చదవండి:

payyavula keshav: 'బయటపెట్టిన అంశాలు కొన్నే.. ఇంకా పెద్ద ఆర్థిక ఉల్లంఘనలు జరిగాయ్​..'

ఏపీ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిందని ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆక్షేపించారు. ఏపీలో అవకతవకలు, జరగకూడని తప్పులు జరిగాయన్నారు. ఇదే విధంగా అభివృద్ధిని పక్కనపెట్టి ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తే.. భావితరాలకు తీరని నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుల విషయంలో నిబంధనల ఉల్లంఘన అంశాన్ని ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.

‘‘తప్పులు చేయకుండా అప్పులు చేయాలి. గతంలో సీఎం ఆర్థిక సలహాదారు కృష్ణ, ఆర్థిక మంత్రి బుగ్గన సీఎంకు ఇదే విషయం చెప్పారు. దాన్నే నేను మరోసారి గుర్తు చేస్తున్నాను’’ అని రఘురామ వెల్లడించారు.

ఇదీ చదవండి:

payyavula keshav: 'బయటపెట్టిన అంశాలు కొన్నే.. ఇంకా పెద్ద ఆర్థిక ఉల్లంఘనలు జరిగాయ్​..'

Last Updated : Aug 2, 2021, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.