గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన జకియా ఖానుం.. ముఖ్యమంత్రి జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. తనను ఎమ్మెల్సీగా నియమించటంపై సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
మైనారిటీ వర్గానికి చెందిన మహిళగా ఆ వర్గ ప్రజలకు, మహిళలకు సేవచేస్తానని జకియా ఖానుం చెప్పారు. ఆమెతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సీఎంను కలిశారు.