ETV Bharat / city

కొవిడ్ క్వారంటైన్ సెంటర్​ను సందర్శించిన ఎమ్మెల్యే అళ్ల

author img

By

Published : May 15, 2021, 4:14 PM IST

మంగళగిరిలోని గుండిమెడ కరోనా క్వారంటైన్ సెంటర్​ను స్థానిక ఎమ్మెల్యే అళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. కరోనా బాధితులకు అందుతున్న చికిత్స, సదుపాయాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.

mla alla ramakrishna reddy
ఎమ్మెల్యే అళ్ల రామకృష్ణారెడ్డి

కరోనా నివారణకు ఆత్మ ధైర్యం ఎంతో ముఖ్యమని మంగళగిరి ఎమ్మెల్యే అళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న గుండిమెడ కరోనా క్వారంటైన్ సెంటర్​ను ఆయన పరిశీలించారు. వైరస్ బారిన పడిన రోగులను పరామర్శించారు. భోజన, ఇతర సదుపాయాల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్, మందుల గురించి వైద్యులను ఆరా తీయగా.. నర్సుల కొరత ఉందని వైద్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే ఫోన్​లో ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన .. నర్సులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

కరోనా నివారణకు ఆత్మ ధైర్యం ఎంతో ముఖ్యమని మంగళగిరి ఎమ్మెల్యే అళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న గుండిమెడ కరోనా క్వారంటైన్ సెంటర్​ను ఆయన పరిశీలించారు. వైరస్ బారిన పడిన రోగులను పరామర్శించారు. భోజన, ఇతర సదుపాయాల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్, మందుల గురించి వైద్యులను ఆరా తీయగా.. నర్సుల కొరత ఉందని వైద్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే ఫోన్​లో ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన .. నర్సులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

3వారాల్లో కరోనాను జయించిన 2నెలల పసికందు

రూ.396కే రెడ్​మీ ఫోన్​- ఎలా వచ్చిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.