తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై దాడి చేసిన వారిని 24 గంటల్లోగా అరెస్ట్ చేయాలని జాతీయ బీసీ సంఘం డిమాండ్ చేసింది. లేకుంటే స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలన్నారు. మాచర్ల ఘటనపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మరో బిహార్లా మారిందని, ఏపీలో బలహీన వర్గాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను రాజ్యాధికారానికి దూరం చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.
ఇదీచదవండి