ETV Bharat / city

న్యాయవాదుల హత్యను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హైకోర్టు

author img

By

Published : Feb 18, 2021, 11:15 AM IST

Updated : Feb 18, 2021, 12:02 PM IST

lawyers-murder-in-telangana
lawyers-murder-in-telangana

11:12 February 18

తెలంగాణలో న్యాయవాదుల హత్య

న్యాయవాదుల హత్యపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. పెద్దపల్లిలో జరిగిన న్యాయవాదుల హత్యను ఉన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. హత్యపై నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి  ఆదేశాలు జారీ చేసింది.  నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేయాలని పేర్కొంది. లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని తెలంగాణ హైకోర్టు తెలిపింది.  ప్రభుత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని వ్యాఖ్యానించింది. సాక్ష్యాలను పకడ్బందీగా స్వీకరించాలని సూచించింది. న్యాయవాదుల హత్య తీవ్ర గర్హనీయమని వెల్లడించింది. హత్య కేసులో నిందితులను పట్టుకోవాలని ఆదేశించింది. న్యాయవాదుల హత్య అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని వ్యాఖ్యానించింది. న్యాయవాదుల హత్య కేసు విచారణ మార్చి 1కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: న్యాయవాదుల మర్డర్ కేసులో పోలీసుల నిర్లక్ష్యం

11:12 February 18

తెలంగాణలో న్యాయవాదుల హత్య

న్యాయవాదుల హత్యపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. పెద్దపల్లిలో జరిగిన న్యాయవాదుల హత్యను ఉన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. హత్యపై నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి  ఆదేశాలు జారీ చేసింది.  నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేయాలని పేర్కొంది. లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని తెలంగాణ హైకోర్టు తెలిపింది.  ప్రభుత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని వ్యాఖ్యానించింది. సాక్ష్యాలను పకడ్బందీగా స్వీకరించాలని సూచించింది. న్యాయవాదుల హత్య తీవ్ర గర్హనీయమని వెల్లడించింది. హత్య కేసులో నిందితులను పట్టుకోవాలని ఆదేశించింది. న్యాయవాదుల హత్య అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని వ్యాఖ్యానించింది. న్యాయవాదుల హత్య కేసు విచారణ మార్చి 1కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: న్యాయవాదుల మర్డర్ కేసులో పోలీసుల నిర్లక్ష్యం

Last Updated : Feb 18, 2021, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.