ETV Bharat / city

AIMS: గ్రామీణులకు అత్యాధునిక వైద్యం.. రూ. 10కే ఏడాదంతా ఓపీ

author img

By

Published : Nov 6, 2021, 11:25 AM IST

ఇప్పటివరకు ఓపీ సేవలకే పరిమితమైన తెలంగాణ బీబీనగర్​లోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్).. దీపావళి నుంచి ఇన్​పేషెంట్ సేవలను కూడా ప్రారంభించింది. రూ. 10 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారికి ఏడాది పాటు ఓపీ సేవలందిస్తున్నారు. ప్రస్తుతం రోజూ 400 మంది ఓపీ సేవలు వినియోగించుకుంటున్నారు.

inpatient-department-available-in-aiims-at-bibinagar
గ్రామీణులకు అత్యాధునిక వైద్యం.. రూ. 10కే ఏడాదంతా ఓపీ

గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలందించే దిశగా తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు ఓపీ సేవలకే పరిమితమైన ఇందులో ఇన్‌పేషెంట్‌ సేవలు కూడా దీపావళి నుంచి అందుబాటులోకి వచ్చాయి. వంద పడకల ఆసుపత్రిలో సాధారణ (జనరల్‌ మెడిసిన్‌, ఆర్థోపెడిక్‌, పిడియాట్రిక్స్‌, ఆప్తమాలజీ, గైనకాలజీ, ఫ్యామిలీ మెడిసిన్‌, ఈఎన్‌టీ, జనరల్‌ సర్జరీ, డెర్మటాలజీ), పది పడకలతో కొవిడ్‌ ఐసోలేషన్‌ ఇన్‌పేషెంట్‌ సేవలు కొనసాగుతున్నాయి. రూ. 10 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారికి ఏడాది పాటు ఓపీ సేవలందిస్తున్నారు. తక్కువ ధరకే రోగ నిర్ధారణ పరీక్షలు (రక్త, అల్ట్రాసౌండ్‌, ఎక్స్‌రే) చేస్తున్నారు. అన్ని రకాల జనరిక్‌ మందులనూ అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం రోజూ 400 మంది ఓపీ సేవలు వినియోగించుకుంటున్నారు.

మొదలైన శస్త్రచికిత్సలు

ఇప్పటి వరకు 90 మంది వైద్యులు, 128 మంది నర్సులు విధుల్లో చేరారు.మరో 72 మంది వైద్యులు, వంద నర్సు పోస్టులను ఈ నెలాఖరులోపు భర్తీ చేయనున్నారు. 2019లో 50 సీట్లు, 2020లో 62 వైద్య సీట్లు భర్తీ చేశారు. ఈసారి వంద సీట్ల భర్తీకి శ్రీకారం చుట్టారు. కొత్తగా ప్రారంభించిన ఆపరేషన్‌ థియేటర్‌లో రెండు శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేశారు.

మెరుగైన చికిత్సలు

సిద్ధమైన శస్త్రచికిత్స గది

రూ. 1,028 కోట్లతో పనులు

కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 1,028 కోట్లలో రూ.800 కోట్లను నిర్మాణ పనులకు, రూ.183 కోట్లు వైద్య పరికరాల కొనుగోలు, మిగతా రూ.45 కోట్లు ఆసుపత్రి అభివృద్ధికి కేటాయించారు. 201 ఎకరాల్లో ఆసుపత్రి భవనాలు, 28 అంతస్తులతో మూడు టవర్లు (వసతి గృహాలు) వైద్య కళాశాల, ఆయుష్‌ భవనం, ఈత కొలనులు, పచ్చదనం, అతిథి గృహాలు, ఆడిటోరియం, వసతి గృహాలు, విశాలమైన పార్కులు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

భువనగిరిలో సేవలు

నిర్మాణ పనులు కొనసాగుతున్నందున గైనిక్‌, పీడియాట్రిక్‌ వైద్యులను భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి పంపి ప్రస్తుతానికి అక్కడి నుంచే సేవలందిస్తున్నారు.

300 మందికి సరిపడా ఆక్సిజన్‌

ఓపీ విభాగం ఇన్‌ఛార్జి వైద్యురాలు

రోజూ దాదాపు 400 మంది రోగులు వస్తున్నారు. కరోనా మూడో దశ వచ్చినా ఇబ్బందులు కలగకుండా నిమిషానికి వెయ్యి లీటర్లు ఉత్పత్తి చేసే ఆక్సిజన్‌ ప్లాంటును అందుబాటులోకి తెచ్చాం. రోజూ 200- 300 వరకు కొవిడ్‌ రోగులకు సేవలందించగలుగుతాం.

-డాక్టర్‌ నిషా జైన్‌, ఓపీ విభాగం ఇన్‌ఛార్జి వైద్యురాలు

భూమి అప్పగిస్తే గ్రామీణ ఆరోగ్య కేంద్రం

డాక్టర్‌ వికాస్‌ భాటియా

పాత నిమ్స్‌ భవన సముదాయాలు, భూములకు సంబంధించిన దస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. 40-60 కిలోమీటర్ల లోపు పదెకరాల భూమి అప్పగిస్తే ఎయిమ్స్‌కు అనుబంధంగా గ్రామీణ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తాం. వచ్చే ఏడాది జులైలోపు ఎనిమిది విభాగాలు (అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయోలజీ, ఫార్మకాలజీ, పాథాలజీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, కమ్యూనిటీ మెడిసిన్‌) పూర్తిచేసి ఎంఎస్‌, ఎండీ కోర్సులను ఇక్కడ అందుబాటులోకి తెస్తాం.

-డాక్టర్‌ వికాస్‌ భాటియా, డైరెక్టర్‌

ఇదీ చూడండి: ఎయిమ్స్​ సిబ్బందికి త్రివిధ దళాల వందనం

బీబీనగర్‌ ఎయిమ్స్‌ కోసం వెచ్చించింది రూ.22.78కోట్లు మాత్రమే

గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలందించే దిశగా తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు ఓపీ సేవలకే పరిమితమైన ఇందులో ఇన్‌పేషెంట్‌ సేవలు కూడా దీపావళి నుంచి అందుబాటులోకి వచ్చాయి. వంద పడకల ఆసుపత్రిలో సాధారణ (జనరల్‌ మెడిసిన్‌, ఆర్థోపెడిక్‌, పిడియాట్రిక్స్‌, ఆప్తమాలజీ, గైనకాలజీ, ఫ్యామిలీ మెడిసిన్‌, ఈఎన్‌టీ, జనరల్‌ సర్జరీ, డెర్మటాలజీ), పది పడకలతో కొవిడ్‌ ఐసోలేషన్‌ ఇన్‌పేషెంట్‌ సేవలు కొనసాగుతున్నాయి. రూ. 10 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారికి ఏడాది పాటు ఓపీ సేవలందిస్తున్నారు. తక్కువ ధరకే రోగ నిర్ధారణ పరీక్షలు (రక్త, అల్ట్రాసౌండ్‌, ఎక్స్‌రే) చేస్తున్నారు. అన్ని రకాల జనరిక్‌ మందులనూ అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం రోజూ 400 మంది ఓపీ సేవలు వినియోగించుకుంటున్నారు.

మొదలైన శస్త్రచికిత్సలు

ఇప్పటి వరకు 90 మంది వైద్యులు, 128 మంది నర్సులు విధుల్లో చేరారు.మరో 72 మంది వైద్యులు, వంద నర్సు పోస్టులను ఈ నెలాఖరులోపు భర్తీ చేయనున్నారు. 2019లో 50 సీట్లు, 2020లో 62 వైద్య సీట్లు భర్తీ చేశారు. ఈసారి వంద సీట్ల భర్తీకి శ్రీకారం చుట్టారు. కొత్తగా ప్రారంభించిన ఆపరేషన్‌ థియేటర్‌లో రెండు శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేశారు.

మెరుగైన చికిత్సలు

సిద్ధమైన శస్త్రచికిత్స గది

రూ. 1,028 కోట్లతో పనులు

కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 1,028 కోట్లలో రూ.800 కోట్లను నిర్మాణ పనులకు, రూ.183 కోట్లు వైద్య పరికరాల కొనుగోలు, మిగతా రూ.45 కోట్లు ఆసుపత్రి అభివృద్ధికి కేటాయించారు. 201 ఎకరాల్లో ఆసుపత్రి భవనాలు, 28 అంతస్తులతో మూడు టవర్లు (వసతి గృహాలు) వైద్య కళాశాల, ఆయుష్‌ భవనం, ఈత కొలనులు, పచ్చదనం, అతిథి గృహాలు, ఆడిటోరియం, వసతి గృహాలు, విశాలమైన పార్కులు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

భువనగిరిలో సేవలు

నిర్మాణ పనులు కొనసాగుతున్నందున గైనిక్‌, పీడియాట్రిక్‌ వైద్యులను భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి పంపి ప్రస్తుతానికి అక్కడి నుంచే సేవలందిస్తున్నారు.

300 మందికి సరిపడా ఆక్సిజన్‌

ఓపీ విభాగం ఇన్‌ఛార్జి వైద్యురాలు

రోజూ దాదాపు 400 మంది రోగులు వస్తున్నారు. కరోనా మూడో దశ వచ్చినా ఇబ్బందులు కలగకుండా నిమిషానికి వెయ్యి లీటర్లు ఉత్పత్తి చేసే ఆక్సిజన్‌ ప్లాంటును అందుబాటులోకి తెచ్చాం. రోజూ 200- 300 వరకు కొవిడ్‌ రోగులకు సేవలందించగలుగుతాం.

-డాక్టర్‌ నిషా జైన్‌, ఓపీ విభాగం ఇన్‌ఛార్జి వైద్యురాలు

భూమి అప్పగిస్తే గ్రామీణ ఆరోగ్య కేంద్రం

డాక్టర్‌ వికాస్‌ భాటియా

పాత నిమ్స్‌ భవన సముదాయాలు, భూములకు సంబంధించిన దస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. 40-60 కిలోమీటర్ల లోపు పదెకరాల భూమి అప్పగిస్తే ఎయిమ్స్‌కు అనుబంధంగా గ్రామీణ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తాం. వచ్చే ఏడాది జులైలోపు ఎనిమిది విభాగాలు (అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయోలజీ, ఫార్మకాలజీ, పాథాలజీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, కమ్యూనిటీ మెడిసిన్‌) పూర్తిచేసి ఎంఎస్‌, ఎండీ కోర్సులను ఇక్కడ అందుబాటులోకి తెస్తాం.

-డాక్టర్‌ వికాస్‌ భాటియా, డైరెక్టర్‌

ఇదీ చూడండి: ఎయిమ్స్​ సిబ్బందికి త్రివిధ దళాల వందనం

బీబీనగర్‌ ఎయిమ్స్‌ కోసం వెచ్చించింది రూ.22.78కోట్లు మాత్రమే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.