ETV Bharat / city

అమానవీయం: కరోనా అనుమానం.. అంత్యక్రియలకు అవస్థలు

author img

By

Published : Jul 20, 2020, 11:50 AM IST

అనారోగ్యంతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు జరపడమే గగనంగా మారింది. కుటుంబ పెద్దను కడసారి కూడా పూర్తిస్థాయిలో చూడలేక పోతున్నా.. కనీసం కర్మకాండ అయినా నిబంధనలకు అనుగుణంగా చేయడానికి తీసుకెళితే స్థానికులు అడ్డుకోవడం బాధిత కుటుంబానికి మరింత శోకాన్ని మిగులుస్తోంది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌లో ఇలాంటిదే ఓ ఘటన చోటుచేసుకుంది.

అమానవీయం: కరోనా అనుమానం.. అంత్యక్రియలకు అవస్థలు
అమానవీయం: కరోనా అనుమానం.. అంత్యక్రియలకు అవస్థలు

తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ 60 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించి అంత్యక్రియల కోసం ఆదివారం ఉదయం 9 గంటలకు ఆసుపత్రి నుంచి 108 వాహనంలో పంపించారు. సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు నగరంలోనే ఉండటం వల్ల వారంతా కలిసి మృతదేహాన్ని కరీంనగర్‌లోని దిగువ మానేరు జలాశయం సమీపాన శ్మశానవాటిక స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ అంత్యక్రియలను జరిపేందుకు 108 వాహనంతో పాటు మరో ప్రైవేటు వాహనంలో కుటుంబ సభ్యులు వెళ్లారు.

విషయం తెలుసుకున్న స్థానికులు అంత్యక్రియలను అడ్డుకున్నారు. ఈ విషయంపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో జలాశయం ఉన్నందున ఇక్కడ నీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉందని అభ్యంతరం తెలిపారు. సర్ది చెప్పినా వినకపోవడం వల్ల 108 వాహనంతో పాటు వారి వెంట వచ్చిన బంధువులు తీగల వంతెన సమీపాన గల శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.

అక్కడ కూడా మొదట అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. అంత్యక్రియల కోసం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇబ్బందులు పడాల్సి వచ్చిందని కుటుంబసభ్యులు ఆవేదన చెందారు. ఇదిలా ఉండగా.. కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం మరో మహిళ మృతి చెందింది. ఆమె అంత్యక్రియలకు సంబంధించి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఇదీచూడండి: కనిపించని కన్నీళ్లు... పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు

తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ 60 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించి అంత్యక్రియల కోసం ఆదివారం ఉదయం 9 గంటలకు ఆసుపత్రి నుంచి 108 వాహనంలో పంపించారు. సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు నగరంలోనే ఉండటం వల్ల వారంతా కలిసి మృతదేహాన్ని కరీంనగర్‌లోని దిగువ మానేరు జలాశయం సమీపాన శ్మశానవాటిక స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ అంత్యక్రియలను జరిపేందుకు 108 వాహనంతో పాటు మరో ప్రైవేటు వాహనంలో కుటుంబ సభ్యులు వెళ్లారు.

విషయం తెలుసుకున్న స్థానికులు అంత్యక్రియలను అడ్డుకున్నారు. ఈ విషయంపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో జలాశయం ఉన్నందున ఇక్కడ నీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉందని అభ్యంతరం తెలిపారు. సర్ది చెప్పినా వినకపోవడం వల్ల 108 వాహనంతో పాటు వారి వెంట వచ్చిన బంధువులు తీగల వంతెన సమీపాన గల శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.

అక్కడ కూడా మొదట అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. అంత్యక్రియల కోసం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇబ్బందులు పడాల్సి వచ్చిందని కుటుంబసభ్యులు ఆవేదన చెందారు. ఇదిలా ఉండగా.. కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం మరో మహిళ మృతి చెందింది. ఆమె అంత్యక్రియలకు సంబంధించి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఇదీచూడండి: కనిపించని కన్నీళ్లు... పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.