వాహనదారుడితో నడిరోడ్డుపై ట్రాఫిక్ హోంగార్డ్ కుస్తీలు పట్టిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్ పరిధిలో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. గగన్పహడ్కు చెందిన మధుకుమార్ బైక్పై గగన్పహడ్ నుంచి కాటేదాన్ వెళ్లేందుకు నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద నుంచి వస్తుండగా రోడ్డుపై ఉన్న ట్రాఫిక్ హోంగార్డ్ బైక్ ఫొటో తీశాడు.
మధుకుమార్ హోంగార్డు వద్దకు వచ్చి ఫొటో ఎందుకు తీశావని ప్రశ్నించగా.. ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ఇంతలో హోంగార్డు బైక్ తాళాలు తీసుకుంటుండగా... మధుకుమార్ బైక్ తాళాలు ఎందుకు తీసుకుంటున్నావని అడగగా... హోంగార్డ్ చేయి చేసుకున్నాడు. ఇద్దరూ నడిరోడ్డుపై కొట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పొలీసులు ఇరువురిని పోలీసుస్టేషన్కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి: 'రైతు ధైర్యంగా అడుగేయనంతవరకు ప్రపంచంతో పోటీ పడలేం'