ETV Bharat / city

రాజధానిలో ఇళ్ల స్థలాల పంపిణీ జీవోపై హైకోర్టు స్టే

రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్లో ఇళ్ల స్థలాల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

author img

By

Published : Mar 23, 2020, 3:08 PM IST

high-court-stay
high-court-stay
'రాజధాని భూముల్లో ఇళ్ల స్థలాల పంపిణీ జీవోపై హైకోర్టు స్టే'

రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఈ అంశంపై మంగళగిరి మండలం కృష్ణాయపాలేనికి చెందిన ఆవల నందకిషోర్.... కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ఇంద్రనీల్... సీఆర్డీఏ చట్టం ప్రకారం పేదలకు నాణ్యమైన ఇళ్లు కట్టించాల్సి ఉందన్నారు. ఆ పని చేయకుండా ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం... ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం విడుదల చేసిన 107 జీవోపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

'రాజధాని భూముల్లో ఇళ్ల స్థలాల పంపిణీ జీవోపై హైకోర్టు స్టే'

రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఈ అంశంపై మంగళగిరి మండలం కృష్ణాయపాలేనికి చెందిన ఆవల నందకిషోర్.... కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ఇంద్రనీల్... సీఆర్డీఏ చట్టం ప్రకారం పేదలకు నాణ్యమైన ఇళ్లు కట్టించాల్సి ఉందన్నారు. ఆ పని చేయకుండా ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం... ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం విడుదల చేసిన 107 జీవోపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవీ చదవండి:

దేశంలో 415కు చేరిన కరోనా బాధితల సంఖ్య

For All Latest Updates

TAGGED:

stay
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.