ETV Bharat / city

మఠంపై నిర్ణయాన్ని ధార్మిక పరిషత్ అనుమతించిందా?: హైకోర్టు

author img

By

Published : Jul 1, 2021, 10:38 PM IST

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం(BRAMHAMGARI MATAM) పీఠాధిపత్యం వివాదం హైకోర్టుకు(HIGH COURT) చేరడంతో.. కథ మళ్లీ మొదటికి వచ్చిన విషయం తెలిసిందే. దివంగత మఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్​పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది.

high-court-on-bramhamgari-matam
high-court-on-bramhamgari-matam

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి(BRAMHAMGARI MATAM) శాశ్వత, తాత్కాలిక మఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవాదాయ శాఖను ఆదేశించాలని కోరుతూ దివంగత మఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు(high court) విచారణ జరిపింది. మఠానికి స్పెషల్ ఆఫీసర్​ను నియమించే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. మఠంపై నిర్ణయాలను ధార్మిక పరిషత్ తీసుకుంటుందని తెలిపారు. ధార్మిక పరిషత్ అనుమతించిందా? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలతో సోమవారం నాటికి అఫిడవిడ్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపతి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి(BRAMHAMGARI MATAM) శాశ్వత, తాత్కాలిక మఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవాదాయ శాఖను ఆదేశించాలని కోరుతూ దివంగత మఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు(high court) విచారణ జరిపింది. మఠానికి స్పెషల్ ఆఫీసర్​ను నియమించే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. మఠంపై నిర్ణయాలను ధార్మిక పరిషత్ తీసుకుంటుందని తెలిపారు. ధార్మిక పరిషత్ అనుమతించిందా? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలతో సోమవారం నాటికి అఫిడవిడ్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపతి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.