ETV Bharat / city

దేవినేని ఉమా పిటీషన్​పై హైకోర్టులో విచారణ.. మంగళవారానికి వాయిదా

author img

By

Published : Jul 31, 2021, 3:08 AM IST

మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు దాఖలు చేసిన పిటీషన్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. జి.కొండూరు పోలీసులు తప్పుడు కేసులో ఇరికించారని దేవినేని ఉమ తరపు న్యాయవాది వాదించారు. కోర్టు.. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

hc on devineni uma petition
దేవినేని ఉమా పిటీషన్​పై హైకోర్టులో విచారణ

కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ.. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు దాఖలు చేసిన పిటీషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నట్లు ఏ నేరానికి పాల్పడలేదని దేవినేని ఉమ తరపు న్యాయవాది వాదించారు. పోలీసులు తప్పుడు కేసులో ఇరికించారన్నారు. ఫిర్యాదుదారు ఎవరో .. అతను ఏ సామాజిక వర్గమో తనకు తెలియదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి..

కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ.. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు దాఖలు చేసిన పిటీషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నట్లు ఏ నేరానికి పాల్పడలేదని దేవినేని ఉమ తరపు న్యాయవాది వాదించారు. పోలీసులు తప్పుడు కేసులో ఇరికించారన్నారు. ఫిర్యాదుదారు ఎవరో .. అతను ఏ సామాజిక వర్గమో తనకు తెలియదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి..

Godavari River Management Board: ఆగస్టు 3న సమన్వయ కమిటీ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.