ETV Bharat / city

గాంధీ ఆస్పత్రిలో సమ్మె విరమించిన పొరుగు సేవల సిబ్బంది - gandhi hospital employyes protest

తెలంగాణలోని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో పొరుగు సేవల సిబ్బంది సమ్మె విరమించారు. తక్షణమే విధుల్లోకి చేరుతున్నట్లు ప్రకటించారు. డీఎంతో చర్చలు సఫలం కావడం వల్ల సిబ్బంది విధుల్లోకి చేరారు. షిప్టుల వారీగా నెలలో 15 రోజుల విధులకు అధికారులు అంగీకరించారు. కొవిడ్‌ విధుల్లో ఉన్నవారికి రోజుకు రూ.300 చొప్పున అదనపు భత్యం చెల్లించేందుకు అధికారులు ఒప్పుకొన్నారు.

telengana
గాంధీ ఆస్పత్రిలో సమ్మె విరమించిన పొరుగు సేవల సిబ్బంది
author img

By

Published : Jul 15, 2020, 9:23 PM IST

గాంధీ ఆస్పత్రి పొరుగు సేవల సిబ్బంది ఉదయం నుంచి విధులు బహిష్కరించి ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. వేతనాలు పెంచాలన్న డిమాండ్​తో నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు విధుల్లోకి వచ్చేది లేదని తేల్చిచెప్పారు. వీరి సమ్మెతో సౌకర్యాలు కల్పించే వారు లేక రోగులు ఇబ్బందులు పడ్డారు.

ఓపీ, ఇతర వార్డుల్లో సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారి జీతాల పెంపు సమస్యకు పరిష్కారం లభించింది. చివరికి పొరుగు సేవల సిబ్బంది సమ్మె విరమించారు. షిప్టుల వారీగా నెలలో 15 రోజుల విధులకు అధికారులు అంగీకరించారు. కొవిడ్‌ విధుల్లో ఉన్నవారికి రోజుకు రూ.300 చొప్పున అదనపు భత్యం చెల్లించేందుకు అధికారులు ఒప్పుకొన్నారు.

గాంధీ ఆస్పత్రి పొరుగు సేవల సిబ్బంది ఉదయం నుంచి విధులు బహిష్కరించి ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. వేతనాలు పెంచాలన్న డిమాండ్​తో నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు విధుల్లోకి వచ్చేది లేదని తేల్చిచెప్పారు. వీరి సమ్మెతో సౌకర్యాలు కల్పించే వారు లేక రోగులు ఇబ్బందులు పడ్డారు.

ఓపీ, ఇతర వార్డుల్లో సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారి జీతాల పెంపు సమస్యకు పరిష్కారం లభించింది. చివరికి పొరుగు సేవల సిబ్బంది సమ్మె విరమించారు. షిప్టుల వారీగా నెలలో 15 రోజుల విధులకు అధికారులు అంగీకరించారు. కొవిడ్‌ విధుల్లో ఉన్నవారికి రోజుకు రూ.300 చొప్పున అదనపు భత్యం చెల్లించేందుకు అధికారులు ఒప్పుకొన్నారు.

ఇదీ చదవండి:

యాప్స్ కంటే 'మన దేశం-మన ఐక్యతే' ముఖ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.