ETV Bharat / city

ముఖ్యమంత్రితో ఫాక్స్ కాన్ ఇండియా ఎండీ భేటీ

author img

By

Published : Sep 17, 2019, 6:51 PM IST

సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ తో ఫాక్స్ కాన్ ఇండియా సంస్థ మేనిజింగ్ డైరెక్టర్ జోష్ పాల్జర్ మర్యాదపూర్వకంగా భేటీ ఆయ్యారు. రాష్ట్రంలో  ఫాక్స్ కాన్ సంస్థ చేపట్టిన కార్యక్రమాలను సీఎంకు వివరించారు. మరిన్ని పెట్టుబడులకు ముందుకువస్తే.. ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందజేస్తుందని సీఎం చెప్పారు.

foxcon-md-meet-with-cm-jagan-at-secreatetate

ఫాక్స్ కాన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జోష్ ఫాల్జర్ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో మర్యాదపూర్వరంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫాక్స్ కాన్ సంస్థ కార్యకలాపాలను సీఎంకు వివరించారు. నెల్లూరు జిల్లా శ్రీసిటీలో ఉన్న తమ సంస్థ లో 15 వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని.. వారందరికీ వృత్తిపరమైన శిక్షణ ఇచ్చామని వివరించారు. ఈ ఏడాది నుంచి కంపెనీ ఉత్పాదక సామర్థ్యం పెంచబోతున్నామని , నెలకు 35 లక్షల సెల్ ఫోన్లను విక్రయిస్తున్నామని వెల్లడించారు.

ముఖ్యమంత్రితో ఫాక్స్ కాన్ ఇండియా ఎండీ భేటీ

ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: సీఎం

ఎలక్ట్రానిక్ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త అవకాశాలను కూడా అందిపుచ్చుకునేందుకు ఏపీ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఫాక్స్ కాన్ ఎండీకి తెలిపారు. రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్‌ హబ్‌ గా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని సీఎం వెల్లడించారు. పెట్టుబడులకు రాష్ట్రం అన్ని విధాల అనుకూల ప్రాంతమని.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. ఉత్తమ నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేయడానికి అత్యుత్తమ ప్రమాణాలతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమన్న ముఖ్యమంత్రి జగన్, ఆ దిశగా ఫాక్స్ కాన్ సంస్థ కూడా ముందుడుగు వేయాలని ఆకాంక్షించారు.

ఫాక్స్ కాన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జోష్ ఫాల్జర్ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో మర్యాదపూర్వరంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫాక్స్ కాన్ సంస్థ కార్యకలాపాలను సీఎంకు వివరించారు. నెల్లూరు జిల్లా శ్రీసిటీలో ఉన్న తమ సంస్థ లో 15 వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని.. వారందరికీ వృత్తిపరమైన శిక్షణ ఇచ్చామని వివరించారు. ఈ ఏడాది నుంచి కంపెనీ ఉత్పాదక సామర్థ్యం పెంచబోతున్నామని , నెలకు 35 లక్షల సెల్ ఫోన్లను విక్రయిస్తున్నామని వెల్లడించారు.

ముఖ్యమంత్రితో ఫాక్స్ కాన్ ఇండియా ఎండీ భేటీ

ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: సీఎం

ఎలక్ట్రానిక్ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త అవకాశాలను కూడా అందిపుచ్చుకునేందుకు ఏపీ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఫాక్స్ కాన్ ఎండీకి తెలిపారు. రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్‌ హబ్‌ గా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని సీఎం వెల్లడించారు. పెట్టుబడులకు రాష్ట్రం అన్ని విధాల అనుకూల ప్రాంతమని.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. ఉత్తమ నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేయడానికి అత్యుత్తమ ప్రమాణాలతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమన్న ముఖ్యమంత్రి జగన్, ఆ దిశగా ఫాక్స్ కాన్ సంస్థ కూడా ముందుడుగు వేయాలని ఆకాంక్షించారు.

Intro:ap_tpt_81_17_kodelaku_nivali_avb_ap10009

కోడెల శివప్రసాద్ కు తెదేపా నివాళి

తెదేపా సీనియర్ నాయకుడు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మృతి పట్ల కుప్పం తెదేపా నేతలు సంతాపం వ్యక్తం చేశారు ఇవాళ శాంతిపురం లోని ఎన్టీఆర్ కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివంగత కోడెల శివప్రసాదరావు చిత్రపటానికి పూజలు చేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కోడెల శివ ప్రసాద్ రావు మృతి తెదేపాకు తీరనిలోటని పేర్కొన్నారు ఆయన రాష్ట్ర మంత్రిగా గా స్పీకర్ గా అభి వృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు


Body:gfd


Conclusion:hgf
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.