ETV Bharat / city

అత్యంత అరుదు.. 5 కిలోల బరువుతో పాప జననం

author img

By

Published : May 10, 2020, 2:36 PM IST

తెలంగాణ ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం ప్రభుత్వ వైద్యశాలలో అరుదైన సంఘటన జరిగింది. ఓ ఆడ శిశువు 5 కిలోల బరువుతో జన్మించింది.

ఖమ్మం ఆసుపత్రిలో 5 కిలోల బరువుతో శిశువు జననం
ఖమ్మం ఆసుపత్రిలో 5 కిలోల బరువుతో శిశువు జననం

తెలంగాణలోని ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంకు చెందిన సౌజన్య అనే గర్భిణి నెలలు నిండగా.. పెనుబల్లి మండల ప్రభుత్వ వైద్యశాలకు వచ్చింది. వైద్యులు ఆ మహిళకు శస్త్రచికిత్స నిర్వహించి పాపకు పురుడు పోశారు.

5 కిలోల 100 గ్రాముల బరువుతో ఆడ శిశివు జన్మించిందని డాక్టర్ రమేశ్ తెలిపారు. ఇంత బరువుతో ఒక శిశువు పుట్టడం అరుదైన ఘటనగా చెప్పారు. మహిళ, శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు.

తెలంగాణలోని ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంకు చెందిన సౌజన్య అనే గర్భిణి నెలలు నిండగా.. పెనుబల్లి మండల ప్రభుత్వ వైద్యశాలకు వచ్చింది. వైద్యులు ఆ మహిళకు శస్త్రచికిత్స నిర్వహించి పాపకు పురుడు పోశారు.

5 కిలోల 100 గ్రాముల బరువుతో ఆడ శిశివు జన్మించిందని డాక్టర్ రమేశ్ తెలిపారు. ఇంత బరువుతో ఒక శిశువు పుట్టడం అరుదైన ఘటనగా చెప్పారు. మహిళ, శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:

'రక్త దానం చేయండి... మా కుమారుడి ప్రాణాలు కాపాడండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.