ETV Bharat / city

యూ-1 జోన్​ను ఎత్తివేయాలని రైతుల ఆందోళన

author img

By

Published : Apr 14, 2021, 4:36 PM IST

రాజధాని ప్రాంతం తాడేపల్లిలో విధించిన యూ1(రిజర్వ్ జోన్)ను వెంటనే ఎత్తేయాలని రైతులు ఆందోళనకు దిగారు. ఎన్నికల వేళ వైకాపా హామీ ఇచ్చిందని.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా పట్టించుకోవటం లేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు.

యూ 1 జోన్
రాజధాని అమరావతి ప్రాంతం

యూ -1 జోన్​ను ఎత్తివేయాలని రైతుల ఆందోళన

గుంటూరు జిల్లా తాడేపల్లిలో విధించిన యూ-1 (రిజర్వ్ జోన్)ను వెంటనే ఎత్తేయాలని రైతులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయంలో అమరానగర్ ప్రాంతంలోని 178 ఎకరాలను రాజధాని అవసరాల కోసం యూ-1 జోన్​గా ప్రకటించారు. ఈ భూముల్లో ఎలాంటి క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరగకుండా నిషేధం విధించారు. నాటి నుంచి రైతులు పలు దఫాలుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

2019 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే యూ-1 జోన్​ ఎత్తివేస్తామని వైకాపా నేతలు హామీ ఇచ్చారు. ఈ విషయంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో జగన్​ను సైతం కలిశారు. 2 నెలల్లో ఎత్తివేస్తామని చెప్పారని.. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్నారు. జాతీయ రహదారిని అనుకొని ఉన్న తమ భూములను అవసరాల కోసం అమ్ముకోలేకపోతున్నామని ఆవేదన చెందారు.

యూ -1 జోన్​ను ఎత్తివేయాలని రైతుల ఆందోళన

గుంటూరు జిల్లా తాడేపల్లిలో విధించిన యూ-1 (రిజర్వ్ జోన్)ను వెంటనే ఎత్తేయాలని రైతులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయంలో అమరానగర్ ప్రాంతంలోని 178 ఎకరాలను రాజధాని అవసరాల కోసం యూ-1 జోన్​గా ప్రకటించారు. ఈ భూముల్లో ఎలాంటి క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరగకుండా నిషేధం విధించారు. నాటి నుంచి రైతులు పలు దఫాలుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

2019 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే యూ-1 జోన్​ ఎత్తివేస్తామని వైకాపా నేతలు హామీ ఇచ్చారు. ఈ విషయంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో జగన్​ను సైతం కలిశారు. 2 నెలల్లో ఎత్తివేస్తామని చెప్పారని.. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్నారు. జాతీయ రహదారిని అనుకొని ఉన్న తమ భూములను అవసరాల కోసం అమ్ముకోలేకపోతున్నామని ఆవేదన చెందారు.

ఇదీ చదవండి:

భాజపా, జనసేన అంటే వైకాపా భయపడుతోంది: సోము వీర్రాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.