ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM

టాప్ టెన్ న్యూస్

author img

By

Published : Apr 20, 2021, 1:01 PM IST

etv bharat 1 pm top news
టాప్ టెన్ న్యూస్
  • 'రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది'

సున్నా వడ్డీ రాయితీ నిధులు విడుదల కార్యక్రమాన్ని సీఎం జగన్​ క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. రబీలో రూ.లక్ష లోపు రుణాలు తీసుకుని ఏడాదిలోగా చెల్లించిన రైతులకు నిధులు విడుదల కానున్నాయి. వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం రూ.128.47 కోట్లు జమ చేస్తారు. ఇ-పంటలో నమోదు చేసుకున్న రైతులకే పథకం వర్తిస్తుంది. పథకం ద్వారా 6,27,906 మంది రైతులు లబ్ధిపొందుతారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 30 వరకు రాత్రి కర్ఫ్యూ

తెలంగాణలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 30 వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బ్రిస్బేన్​లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు.. ఆస్ట్రేలియాలోని అభిమానులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వేడుక చేశారు. శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఫన్​ బకెట్ ఫేం భార్గవ్.. ఫోక్సో చట్టం కింద అరెస్ట్

యూట్యూబ్​లో ప్రసారమయ్యే ఫన్ బకెట్ ఛానెల్​తో పేరు సంపాదించి.. టిక్​టాక్​తో ఫేమస్ అయిన భార్గవ్​ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాలికకు అవకాశాలు కల్పిస్తామని లొంగదీసుకుని గర్భవతిని చేయటంతో.. ఫోక్సో చట్టం కింద భార్గవ్​ని అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సీఈసీ సుశీల్‌ చంద్రకు కరోనా

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(ఈసీ) సుశీల్​ చంద్రకు కరోనా సోకింది. ఎన్నికల కమిషనర్​‌ రాజీవ్‌ కుమార్‌కు కూడా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. మరోవైపు కాంగ్రెస్​ సీనియర్​ నేత ఆనంద శర్మ.. వైరస్ బారిన పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొవ్వొత్తులా వెలుగునిచ్చే 'పాండవ చెట్టు'

చెట్లు.. ఎన్నో జీవులకు ఆవాసాన్ని ఇస్తాయి. అలసిపోయినవారు సేద తీరేందుకు నీడనిస్తాయి. అయితే చెట్లు వెలుగునివ్వడం ఎప్పుడైనా చూశారా? చూడటమే కాదు.. వినుండరు కాదూ! అయితే దీపంలా కాంతులు వెదజిమ్మే కైకరీలు/పాండవ చెట్టు గురించి మీరు చదవాల్సిందే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • చిన్నారిని కాపాడిన సాహసవీరుడికి సత్కారం

ప్రాణాలకు తెగించి రైలు పట్టాలపై పడిపోయిన ఓ చిన్నారిని కాపాడిన సాహసవీరుడిని రైల్వే అధికారులు సత్కరించారు. కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​​ కూడా ఆ రైల్వే పాయింట్స్​మన్​కు ఫోన్​ చేసి ప్రశంసించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ఆ దేశాలపై నిషేధాజ్ఞలు పునరుద్ధరించండి'‌

అమెరికాను ఇస్లామిక్‌ ఉగ్రవాదం నుంచి కాపాడేందుకు పలు దేశాలపై ప్రయాణ నిషేధ ఆంక్షల్ని విధించాలని అధ్యక్షుడు జో బైడెన్​కు విజ్ఞప్తి చేశారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి కొంత తెలివిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఒలింపిక్స్ కోసం గబ్బా స్టేడియం పునర్ నిర్మాణం

ఆస్ట్రేలియాలోని ముఖ్యమైన క్రికెట్ స్టేడియాల్లో ఒకటైన గబ్బాను పునర్​ నిర్మించాలని క్వీన్స్​లాండ్​ ప్రభుత్వం నిర్ణయించింది. 2032 ఒలింపిక్స్ కోసమే దీనిని తిరిగి కడుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఓటీటీ ఎంట్రీకి అజయ్ దేవ్​గణ్ రెడీ

'ఆర్ఆర్ఆర్'లో నటిస్తూ బిజీగా ఉన్న అజయ్ దేవ్​గణ్.. ఓటీటీ ప్రేక్షకుల్ని అలరించేందుకు వచ్చేస్తున్నారు. 'రుద్ర' అనే పోలీస్ డ్రామా సిరీస్​లో నటిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది'

సున్నా వడ్డీ రాయితీ నిధులు విడుదల కార్యక్రమాన్ని సీఎం జగన్​ క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. రబీలో రూ.లక్ష లోపు రుణాలు తీసుకుని ఏడాదిలోగా చెల్లించిన రైతులకు నిధులు విడుదల కానున్నాయి. వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం రూ.128.47 కోట్లు జమ చేస్తారు. ఇ-పంటలో నమోదు చేసుకున్న రైతులకే పథకం వర్తిస్తుంది. పథకం ద్వారా 6,27,906 మంది రైతులు లబ్ధిపొందుతారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 30 వరకు రాత్రి కర్ఫ్యూ

తెలంగాణలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 30 వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బ్రిస్బేన్​లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు.. ఆస్ట్రేలియాలోని అభిమానులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వేడుక చేశారు. శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఫన్​ బకెట్ ఫేం భార్గవ్.. ఫోక్సో చట్టం కింద అరెస్ట్

యూట్యూబ్​లో ప్రసారమయ్యే ఫన్ బకెట్ ఛానెల్​తో పేరు సంపాదించి.. టిక్​టాక్​తో ఫేమస్ అయిన భార్గవ్​ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాలికకు అవకాశాలు కల్పిస్తామని లొంగదీసుకుని గర్భవతిని చేయటంతో.. ఫోక్సో చట్టం కింద భార్గవ్​ని అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సీఈసీ సుశీల్‌ చంద్రకు కరోనా

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(ఈసీ) సుశీల్​ చంద్రకు కరోనా సోకింది. ఎన్నికల కమిషనర్​‌ రాజీవ్‌ కుమార్‌కు కూడా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. మరోవైపు కాంగ్రెస్​ సీనియర్​ నేత ఆనంద శర్మ.. వైరస్ బారిన పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొవ్వొత్తులా వెలుగునిచ్చే 'పాండవ చెట్టు'

చెట్లు.. ఎన్నో జీవులకు ఆవాసాన్ని ఇస్తాయి. అలసిపోయినవారు సేద తీరేందుకు నీడనిస్తాయి. అయితే చెట్లు వెలుగునివ్వడం ఎప్పుడైనా చూశారా? చూడటమే కాదు.. వినుండరు కాదూ! అయితే దీపంలా కాంతులు వెదజిమ్మే కైకరీలు/పాండవ చెట్టు గురించి మీరు చదవాల్సిందే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • చిన్నారిని కాపాడిన సాహసవీరుడికి సత్కారం

ప్రాణాలకు తెగించి రైలు పట్టాలపై పడిపోయిన ఓ చిన్నారిని కాపాడిన సాహసవీరుడిని రైల్వే అధికారులు సత్కరించారు. కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​​ కూడా ఆ రైల్వే పాయింట్స్​మన్​కు ఫోన్​ చేసి ప్రశంసించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ఆ దేశాలపై నిషేధాజ్ఞలు పునరుద్ధరించండి'‌

అమెరికాను ఇస్లామిక్‌ ఉగ్రవాదం నుంచి కాపాడేందుకు పలు దేశాలపై ప్రయాణ నిషేధ ఆంక్షల్ని విధించాలని అధ్యక్షుడు జో బైడెన్​కు విజ్ఞప్తి చేశారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి కొంత తెలివిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఒలింపిక్స్ కోసం గబ్బా స్టేడియం పునర్ నిర్మాణం

ఆస్ట్రేలియాలోని ముఖ్యమైన క్రికెట్ స్టేడియాల్లో ఒకటైన గబ్బాను పునర్​ నిర్మించాలని క్వీన్స్​లాండ్​ ప్రభుత్వం నిర్ణయించింది. 2032 ఒలింపిక్స్ కోసమే దీనిని తిరిగి కడుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఓటీటీ ఎంట్రీకి అజయ్ దేవ్​గణ్ రెడీ

'ఆర్ఆర్ఆర్'లో నటిస్తూ బిజీగా ఉన్న అజయ్ దేవ్​గణ్.. ఓటీటీ ప్రేక్షకుల్ని అలరించేందుకు వచ్చేస్తున్నారు. 'రుద్ర' అనే పోలీస్ డ్రామా సిరీస్​లో నటిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.