ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM

టాప్​టెన్ న్యూస్

author img

By

Published : Feb 20, 2021, 1:00 PM IST

etv bharat 1 pm top ten news
టాప్ టెన్ న్యూస్
  • నీతి ఆయోగ్‌ సమావేశంలో సీఎం.. ప్రధాని దృష్టికి రాష్ట్ర సమస్యలు

సీఎం జగన్ నీతి అయోగ్ సమావేశంలో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, సమస్యలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానే పారిశ్రామికాభివృద్ధిలో దూసుకెళ్లగలమని స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణ ఖర్చులో సవరించిన అంచనాలను వెంటనే ఆమోదించాలని ప్రధానిని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఏపీకి రూ.2,222.71 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల

రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్​కి రూ.2,222.71 కోట్లు, తెలంగాణకు రూ.1940.95 కోట్ల పరిహారం అందనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విశాఖ - రాయ్‌పూర్‌ మధ్య ఆర్థిక కారిడార్‌కు కేంద్రం ఆమోదం

విశాఖ - రాయ్‌పూర్‌ మధ్య ఆర్థిక కారిడార్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.824.29 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణాన్ని చేపట్టనుంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల వైఎస్‌ అభిమానులతో షర్మిల భేటీ

హైదరాబాద్‌లో రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. వారితో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'సమాఖ్య విధానమే దేశాభివృద్ధికి మూలం'

కరోనా సమయంలో కేంద్ర, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేశాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ విధంగా సహకార సమాఖ్య విధానాన్ని మరింత అర్థవంతంగా మార్చడమే దేశ అభివృద్ధికి పునాది అని చెప్పారు. నీతి ఆయోగ్ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ఆ విషయంలో రాజీపడేది లేదు'

ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కేంద్రంపై మండిపడ్డారు. సాగు చట్టాలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సామాన్యుడిని ఇబ్బందికి గురిచేసిన విషయాలను ప్రశ్నించడంలో రాజీపడనని తెలిపారు. పేరు, ప్రతిష్ఠల కోసం తాము ప్రభుత్వాన్ని విమర్శించమని అన్నారు. కేంద్రం తప్పుడు చర్యలను విమర్శిస్తున్నామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'అమెరికా ఈజ్ బ్యాక్- చైనా టార్గెట్!'

ట్రంప్ తీసుకొచ్చిన విధానాలను తమ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. అమెరికా తన పూర్వ స్థితికి వచ్చిందని ఉద్ఘాటించారు. ఐరోపా సహా మిత్ర దేశాలతో భాగస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నారు. చైనా పోటీని ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బంగారంపై రుణమా?.. ఇవి గుర్తుంచుకోండి

తాత్కాలికంగా నగదు సమస్య ఎదుర్కొంటున్నప్పుడు తప్ప.. ఇల్లు కొనడం వంటి పెద్ద ఖర్చులకు బంగారంపై రుణాలు తీసుకోవద్దంటున్నారు నిపుణులు. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

  • పీఎస్​ఎల్​ ప్రారంభానికి ముందు క్రికెటర్​కు కరోనా

పాకిస్థాన్​ సూపర్​లీగ్​ ప్రారంభానికి ముందు బయో బబుల్​లోని ఓ క్రికెటర్​కు కరోనా సోకినట్లు పాక్​ క్రికెట్​ బోర్డు వెల్లడించింది. వైరస్ సోకిన ఆటగాడిని క్వారంటైన్​కు తరలించామని పేర్కొంది. రాబోయే రోజుల్లో చేసే కొవిడ్​ టెస్ట్​ల్లో రెండుసార్లు నెగెటివ్​ వచ్చిన తర్వాతే అతడిని బయో బబుల్​లోకి అనుమతిస్తామని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రకుల్ విషయంలో షాకైన హీరో నితిన్

పాటలు, గ్లామర్ అంశాలు లేకపోయినప్పటికీ రకుల్ తమ సినిమాలో నటిస్తానని ఒప్పుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని నితిన్ చెప్పారు. వీరిద్దరూ కలిసి నటించిన 'చెక్' ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నీతి ఆయోగ్‌ సమావేశంలో సీఎం.. ప్రధాని దృష్టికి రాష్ట్ర సమస్యలు

సీఎం జగన్ నీతి అయోగ్ సమావేశంలో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, సమస్యలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానే పారిశ్రామికాభివృద్ధిలో దూసుకెళ్లగలమని స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణ ఖర్చులో సవరించిన అంచనాలను వెంటనే ఆమోదించాలని ప్రధానిని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఏపీకి రూ.2,222.71 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల

రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్​కి రూ.2,222.71 కోట్లు, తెలంగాణకు రూ.1940.95 కోట్ల పరిహారం అందనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విశాఖ - రాయ్‌పూర్‌ మధ్య ఆర్థిక కారిడార్‌కు కేంద్రం ఆమోదం

విశాఖ - రాయ్‌పూర్‌ మధ్య ఆర్థిక కారిడార్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.824.29 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణాన్ని చేపట్టనుంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల వైఎస్‌ అభిమానులతో షర్మిల భేటీ

హైదరాబాద్‌లో రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. వారితో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'సమాఖ్య విధానమే దేశాభివృద్ధికి మూలం'

కరోనా సమయంలో కేంద్ర, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేశాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ విధంగా సహకార సమాఖ్య విధానాన్ని మరింత అర్థవంతంగా మార్చడమే దేశ అభివృద్ధికి పునాది అని చెప్పారు. నీతి ఆయోగ్ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ఆ విషయంలో రాజీపడేది లేదు'

ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కేంద్రంపై మండిపడ్డారు. సాగు చట్టాలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సామాన్యుడిని ఇబ్బందికి గురిచేసిన విషయాలను ప్రశ్నించడంలో రాజీపడనని తెలిపారు. పేరు, ప్రతిష్ఠల కోసం తాము ప్రభుత్వాన్ని విమర్శించమని అన్నారు. కేంద్రం తప్పుడు చర్యలను విమర్శిస్తున్నామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'అమెరికా ఈజ్ బ్యాక్- చైనా టార్గెట్!'

ట్రంప్ తీసుకొచ్చిన విధానాలను తమ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. అమెరికా తన పూర్వ స్థితికి వచ్చిందని ఉద్ఘాటించారు. ఐరోపా సహా మిత్ర దేశాలతో భాగస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నారు. చైనా పోటీని ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బంగారంపై రుణమా?.. ఇవి గుర్తుంచుకోండి

తాత్కాలికంగా నగదు సమస్య ఎదుర్కొంటున్నప్పుడు తప్ప.. ఇల్లు కొనడం వంటి పెద్ద ఖర్చులకు బంగారంపై రుణాలు తీసుకోవద్దంటున్నారు నిపుణులు. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

  • పీఎస్​ఎల్​ ప్రారంభానికి ముందు క్రికెటర్​కు కరోనా

పాకిస్థాన్​ సూపర్​లీగ్​ ప్రారంభానికి ముందు బయో బబుల్​లోని ఓ క్రికెటర్​కు కరోనా సోకినట్లు పాక్​ క్రికెట్​ బోర్డు వెల్లడించింది. వైరస్ సోకిన ఆటగాడిని క్వారంటైన్​కు తరలించామని పేర్కొంది. రాబోయే రోజుల్లో చేసే కొవిడ్​ టెస్ట్​ల్లో రెండుసార్లు నెగెటివ్​ వచ్చిన తర్వాతే అతడిని బయో బబుల్​లోకి అనుమతిస్తామని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రకుల్ విషయంలో షాకైన హీరో నితిన్

పాటలు, గ్లామర్ అంశాలు లేకపోయినప్పటికీ రకుల్ తమ సినిమాలో నటిస్తానని ఒప్పుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని నితిన్ చెప్పారు. వీరిద్దరూ కలిసి నటించిన 'చెక్' ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.