![Ediotr guild demands abolish Go 2430](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5003092_editors.png)
పరువుకు భంగం కలిగించే వార్తలు రాస్తే మీడియాపై కేసులు నమోదు చేయవచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 2430 తీసుకురావడంపై... ఎడిటర్స్ గిల్డ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ జీవో సెన్సార్షిప్ కిందికే వస్తుందని అభిప్రాయపడింది. తక్షణం జీవోను ఉపసంహరించుకోవాలని ఎడిటర్స్ గిల్డ్ డిమాండ్ చేసింది. గిల్డ్ అధ్యక్షుడు శేఖర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి ఏకే భట్టాచార్య, కోశాధికారి షీలా భట్... ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రతి శాఖకు నేతృత్వం వహిస్తున్న ఉన్నతాధికారులకు కట్టబెట్టిన అపరిమిత అధికారాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని... ఇది పత్రికా స్వాతంత్య్రానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి :