ETV Bharat / city

ఈ నెల 26 నుంచి ఎంసెట్​ దరఖాస్తుల స్వీకరణ

ఈ నెల 26వ తేదీ నుంచి ఎంసెట్​ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఎంసెట్​​ కమిటీ నిర్ణయించింది. దరఖాస్తులను ఆన్​లైన్​లోనే స్వీకరించనున్నట్లు తెలిపారు. కాకినాడ జేఎన్​టీయూ ఈ పరీక్షలు నిర్వహించనుంది.

author img

By

Published : Feb 11, 2020, 8:17 AM IST

eamcet online application starts on 26th march
ఈ నెల 26 నుంచి ఎంసెట్​ దరఖాస్తుల స్వీకరణ

ఏపీ ఎంసెట్​ దరఖాస్తులను ఈ నెల 26వ తేదీ నుంచి స్వీకరించనున్నారు. 20న నోటిఫికేషన్​ జారీ చేయనున్నారు. తాడేపల్లిలో సోమవారం ఛైర్మన్​ హేమచంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఎంసెట్​ కమిటీ సమావేశంలో నోటిఫికేషన్​, దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన ప్రాథమిక షెడ్యూల్​పై నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తులను ఆన్​లైన్​లోనే స్వీకరించనున్నారు. విద్యార్థులకు కంప్యూటర్​ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. కాకినాడ జేఎన్​టీయూ పరీక్షలు నిర్వహించనుంది. ఎంసెట్​ కన్వీనర్​గా వి. రవీంద్ర వ్యవహరించనున్నారు. ఇంజనీరింగ్​, బయో టెక్నాలజీ, బీఎస్సీ వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్ధక (బీవీఎస్​సీ), మత్స్య (బీఎఫ్​ఎస్​సీ), బీఫార్మసీ, ఫార్మా-డీ కోర్సులు కోసం ఎంసెట్​కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంసెట్​ ఫలితాలను ప్రాథమిక షెడ్యూల్​ ప్రకారం మే 5న విడుదల చేస్తారు.

ఇదీ చదవండి :

ఏపీ ఎంసెట్​ దరఖాస్తులను ఈ నెల 26వ తేదీ నుంచి స్వీకరించనున్నారు. 20న నోటిఫికేషన్​ జారీ చేయనున్నారు. తాడేపల్లిలో సోమవారం ఛైర్మన్​ హేమచంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఎంసెట్​ కమిటీ సమావేశంలో నోటిఫికేషన్​, దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన ప్రాథమిక షెడ్యూల్​పై నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తులను ఆన్​లైన్​లోనే స్వీకరించనున్నారు. విద్యార్థులకు కంప్యూటర్​ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. కాకినాడ జేఎన్​టీయూ పరీక్షలు నిర్వహించనుంది. ఎంసెట్​ కన్వీనర్​గా వి. రవీంద్ర వ్యవహరించనున్నారు. ఇంజనీరింగ్​, బయో టెక్నాలజీ, బీఎస్సీ వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్ధక (బీవీఎస్​సీ), మత్స్య (బీఎఫ్​ఎస్​సీ), బీఫార్మసీ, ఫార్మా-డీ కోర్సులు కోసం ఎంసెట్​కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంసెట్​ ఫలితాలను ప్రాథమిక షెడ్యూల్​ ప్రకారం మే 5న విడుదల చేస్తారు.

ఇదీ చదవండి :

జేఎన్‌టీయూలో ఉత్సాహంగా యువజనోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.