ఆర్థిక లోటు భర్తీ
ఆర్థికలోటు భర్తీకి విద్యుత్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తే.. రూ.514.43 కోట్ల ఆదాయం సమకూరుతుందన్నారు. నూతన టారిఫ్ను అమలు చేసినప్పటికీ.. ఇంకా రూ.3,625.63 కోట్ల ఆర్థికలోటు ఉంటుందని పేర్కొన్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో వార్షిక ఆదాయం రూ.28,548.51 కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుందని... టారిఫేతర, ఇతర సబ్సిడి సర్ఛార్జీల నుంచి రూ.18,247.33 కోట్ల ఆదాయం విద్యుత్ శాఖకు వస్తుందన్నారు. ఎస్పీడీసీఎల్ రూ.10,301 కోట్ల ఆర్థికలోటులో ఉందని ఆ సంస్థ సీఎండీ హరినాథరావు పేర్కొన్నారు. నూతన టారిఫ్ అమలు చేస్తే రూ.19,106.17 కోట్ల ఆదాయం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన టారిఫ్ అమలు చేసినా.. ఇంకా రూ.9,442.35 కోట్ల ఆర్థికలోటు ఉంటుందన్నారు.
ఛార్జీల సవరణ
ఏపీఈడీసీఎల్లో ఎల్టీ(లో టెన్షన్ విద్యుత్)-1 గృహవసరాలు, ఎల్టీ-2 వాణిజ్య అవసరాలు, ఎల్టీ-3 పరిశ్రమలు, ఎల్ టీ- 4 సాధారణ అవసరాలు, ఎల్టీ-5 వ్యవసాయం, ఆక్వా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, హెచ్టీ(హై టెన్షన్ విద్యుత్)-3 భారీ పరిశ్రమలు, హెచ్టీ-5 ఆక్వా, ఎల్టీ, హెచ్టీ-4సీ ఆధ్యాత్మిక ప్రదేశాలకు సంబంధించిన టారీఫ్లలో ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. ఎల్టీ-2, హెచ్టీ-2 ఫంక్షన్ హాల్స్, హెచ్టీ-2 వాణిజ్య సముదాయాలు, ఎల్టీ-4 స్థానిక సంస్థలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, సీపీడబ్ల్యూఎస్, పీ.డబ్ల్యూఎస్, రైల్వే సంస్థలు, ఎల్టీ-5 కార్పొరేట్, రైతులు, హేచరీస్, పశుదాన కేంద్రాలు.. హెచ్టీ-5 హేచరీస్, పశుదాన కేంద్రాలు, ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన ఛార్జీలు సవరించేందుకు ప్రతిపాదనలు సమర్పించామని తెలిపారు.
ఇదీ చదవండి :