ETV Bharat / city

తెదేపా అభియోగపత్రానికి వైకాపా పోటీ పత్రం - deputy cms counter to tdp charge sheet on ycp govt

వైకాపా పాలనపై తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన ఛార్జిషీట్​ను​ రాష్ట్ర ఉపముఖ్యమంత్రులు తిప్పికొట్టారు. అందులో చేసిన విమర్శల్లో ఒక్కటి కూడా నిర్మాణాత్మకంగా లేదని అన్నారు. అధికారానికి దూరమయ్యామనే ఆవేదన చంద్రబాబులో కనిపిస్తోందని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కాకముందే రాయలసీమ కరవు పాలైందంటూ ఛార్జిషీట్ లో రాయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెదేపా అభియోగపత్రానికి వైకాపా పోటీ పత్రం
author img

By

Published : Sep 8, 2019, 3:10 AM IST


ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వ వంద రోజుల పాలనపై తెదేపా విడుదల చేసిన ఛార్జిషీట్‌లో ఒక్క నిర్మాణాత్మక విమర్శ కూడా లేదని ఉపముఖ్యమంత్రులు అన్నారు. ఈ మేరకు 35 అంశాలతో ఉపముఖ్యమంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, ఆళ్ల నాని, కె.నారాయణస్వామి, పుష్పశ్రీవాణి, అంజాద్‌బాషా సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారానికి దూరమయ్యామనే ఆవేదన చంద్రబాబులో కనిపిస్తోందన్న వారు... గత 3 నెలల్లో తన ఇల్లు ముంచేశారని, తాను కట్టిన ప్రజావేదికను కూల్చేశారనే మాటలే ఎక్కువగా వినిపించాయని తెలిపారు. కృష్ణా, గోదావరి నదుల కళకళలు చూసి అసూయ చెందారన్న ఉపముఖ్యమంత్రులు... మూడు నెలలు కాకముందే రాయలసీమ కరవు పాలైందంటూ ఛార్జిషీటులో రాశారని మండిపడ్డారు. తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రమంతా కరవే ఉందని 2019 జనవరిలో చంద్రబాబు ప్రభుత్వమే, కేంద్రానికి నివేదిక ఇచ్చిన విషయాన్ని కూడా ఛార్జిషీటులో చెప్పి ఉంటే బాగుండేదన్నారు. అమరావతిలో 50 వేల కోట్ల రూపాయల పనులు నిలిపివేశారని ఛార్జిషీటులో రాశారని... కేంద్రం ఇచ్చింది 1500 కోట్లు అయితే.. మిగతా మొత్తాన్ని ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ పథకాల అమలుకు... సగర్వంగా షెడ్యూల్‌ ప్రకటించామన్న ఉపముఖ్యమంత్రులు.. మేనిఫెస్టో అమలు చేసే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు.

తెదేపా అభియోగపత్రానికి వైకాపా పోటీ పత్రం

రైతులు బకాయిలు చెల్లించాలని తెలీదా?

  • 2014 జూన్ 8న తొలి సంతకంతోనే రైతుల రుణాల మాఫీ చేశామని చెప్పారు కదా? 2019లో నాలుగైదు వాయిదాలు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి? ఎన్నికల్లోగా బకాయిలు చెల్లించాలని ఎందుకనిపించలేదు?
  • ఓటుకు నోటు కేసులో దొరికిపోయి, కేసీఆర్ కు భయపడి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చింది. సాష్టాంగపడిందీ చంద్రబాబే. హైదరాబాద్ భవనాల్నీ ఖాళీగా పెట్టి... ఇక్కడ కావలసిన వారి భవనాలకు కార్యాలయాల పేరిట ఎన్ని వేల కోట్లు దోచిపెట్టారు?
  • కియా మోటార్స్, పేపర్ పరిశ్రమ వంటివి రాష్ట్రం నుంచి పరారయ్యాయనటం ఆయన నేరపూరిత ఆలోచనలకు నిదర్శనం. ఏవీ వెళ్లలేదు.
  • అన్న క్యాంటీన్లలో పెట్టిన ఏ మెతుక్కీ తెదేపా ప్రభుత్వం పైసా విడుదల చేయలేదు.
  • చివరి రెండు నెలల్లో రూ. 2 వేల చొప్పున ఇచ్చి నిరుద్యోగుల్ని ముంచిన చంద్రబాబుకి వారి గురించి మాట్లాడే అర్హత లేదు.

ఇదీ చదవండి : '100 రోజుల జగన్ తుగ్లక్ పాలన'


ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వ వంద రోజుల పాలనపై తెదేపా విడుదల చేసిన ఛార్జిషీట్‌లో ఒక్క నిర్మాణాత్మక విమర్శ కూడా లేదని ఉపముఖ్యమంత్రులు అన్నారు. ఈ మేరకు 35 అంశాలతో ఉపముఖ్యమంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, ఆళ్ల నాని, కె.నారాయణస్వామి, పుష్పశ్రీవాణి, అంజాద్‌బాషా సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారానికి దూరమయ్యామనే ఆవేదన చంద్రబాబులో కనిపిస్తోందన్న వారు... గత 3 నెలల్లో తన ఇల్లు ముంచేశారని, తాను కట్టిన ప్రజావేదికను కూల్చేశారనే మాటలే ఎక్కువగా వినిపించాయని తెలిపారు. కృష్ణా, గోదావరి నదుల కళకళలు చూసి అసూయ చెందారన్న ఉపముఖ్యమంత్రులు... మూడు నెలలు కాకముందే రాయలసీమ కరవు పాలైందంటూ ఛార్జిషీటులో రాశారని మండిపడ్డారు. తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రమంతా కరవే ఉందని 2019 జనవరిలో చంద్రబాబు ప్రభుత్వమే, కేంద్రానికి నివేదిక ఇచ్చిన విషయాన్ని కూడా ఛార్జిషీటులో చెప్పి ఉంటే బాగుండేదన్నారు. అమరావతిలో 50 వేల కోట్ల రూపాయల పనులు నిలిపివేశారని ఛార్జిషీటులో రాశారని... కేంద్రం ఇచ్చింది 1500 కోట్లు అయితే.. మిగతా మొత్తాన్ని ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ పథకాల అమలుకు... సగర్వంగా షెడ్యూల్‌ ప్రకటించామన్న ఉపముఖ్యమంత్రులు.. మేనిఫెస్టో అమలు చేసే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు.

తెదేపా అభియోగపత్రానికి వైకాపా పోటీ పత్రం

రైతులు బకాయిలు చెల్లించాలని తెలీదా?

  • 2014 జూన్ 8న తొలి సంతకంతోనే రైతుల రుణాల మాఫీ చేశామని చెప్పారు కదా? 2019లో నాలుగైదు వాయిదాలు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి? ఎన్నికల్లోగా బకాయిలు చెల్లించాలని ఎందుకనిపించలేదు?
  • ఓటుకు నోటు కేసులో దొరికిపోయి, కేసీఆర్ కు భయపడి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చింది. సాష్టాంగపడిందీ చంద్రబాబే. హైదరాబాద్ భవనాల్నీ ఖాళీగా పెట్టి... ఇక్కడ కావలసిన వారి భవనాలకు కార్యాలయాల పేరిట ఎన్ని వేల కోట్లు దోచిపెట్టారు?
  • కియా మోటార్స్, పేపర్ పరిశ్రమ వంటివి రాష్ట్రం నుంచి పరారయ్యాయనటం ఆయన నేరపూరిత ఆలోచనలకు నిదర్శనం. ఏవీ వెళ్లలేదు.
  • అన్న క్యాంటీన్లలో పెట్టిన ఏ మెతుక్కీ తెదేపా ప్రభుత్వం పైసా విడుదల చేయలేదు.
  • చివరి రెండు నెలల్లో రూ. 2 వేల చొప్పున ఇచ్చి నిరుద్యోగుల్ని ముంచిన చంద్రబాబుకి వారి గురించి మాట్లాడే అర్హత లేదు.

ఇదీ చదవండి : '100 రోజుల జగన్ తుగ్లక్ పాలన'

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం పంచాయతీ వార్డ్ వాలంటీర్లకు ప్రభుత్వ పథకాలు పంపిణీపై తహసిల్దార్ పూజారి రాంబాబు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్కరోజులోనే 50 కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ అందించాలని తెలిపారు ఇంటికి తాళం వేసి ఉన్న నా దగ్గర లేకపోయినా సాయంత్రం కి పంపిణీ చేసిన సరుకులను సంబంధించిన రేషన్ డిపోలకు అందించాలని సూచించారు పంపిణీ కార్యక్రమం ఏవిధంగా చేపట్టాలో అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అధికారులు డీలర్లు వాలంటీర్లు ఉన్నారు.8008574248.Body:వార్డు గ్రామ వాలంటీర్లకు అవగాహన సదస్సుConclusion:8008574248

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.